Tuesday 26 March 2024

మనసమ్మెడి రవళితగా   

క్షణమొక సఖ్యత పిలుపుకు క్షేమము కొరకే 

వణకు చమట లూరుకళలు   

వినదగు దువ్వుచు నె కొంత విస్తరి ఐగుతాం  


నయన మూలాంచలములు స్విన్నంబు లయిన

గాల మేసేటి యీ ప్రాలు గాలికులుకు      

కారణంబెయ్యది వినోద కంటకంబు 

తనువు మార్చలేనివయసు తనము చేష్ట    

  

వనితాబిగువుల కళ కను

గొణలను వాత్త్సల్యరసము కురియగ ప్రేమా  

కనుగొని ముద్దాడి చనువు 

కొనియెను తృణపరిమళముతొ గుర్తింపు కళల్    

    

సొగసు కళలకు బడలిక సొలుపు లేక 

కోక తడియారక  ఎగసి కోర్క పొగరు 

మగువ తెగువును ముద్దాడి మెడల లేక  

మరల యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!          


ఓరగ చూపుల సొగసులు

వరమై లలిత సుఖజూపు వరదై పొంగెన్ 

తరుణము తరించ పిలుపై 

కరువేతీర్చుము వలువలు కేళీ పిలుపున్

 

***

*దివ్యత్వం*

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.

ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.

దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.

ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.

శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.

మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.

ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.

పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.

నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.

జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.

మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.

దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.

దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.

***

*ఆత్మ*

1) విడిచిపెట్టటానికీ వీలులేనిది..పట్టుకొనటానికీ వీలులేనిది.

మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం.. అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం... ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను.. ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను.. చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా.. నన్ను నేనే పట్టుకోవటం ఎలా.. నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం.. కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు.. విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది.

2) మనోవాచాం అగోచరం:-

మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో ఒక వ్యక్తియో ఒక విషయమో ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు వ్యక్తీ కాదు విషయమూ కాదు భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి మనస్సు ఆలోచించ గలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే అసలు విషయమే కాదు గదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియ లేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా.. కాదే. అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైనది గదా కనుకనే మనస్సుకు అందదు. అగోచరం. మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్ద శక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం.. కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలు అన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః..." అని. కళ్ళు, వాక్కు, మనస్సు అక్కడకు పోలేవు అని. ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి.. మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా.. చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

3) అప్రమేయం:-

సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ.. ఇంతేగదా.. అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా.. రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా. సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

4) ఆద్యంత రహితం:-

పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ, అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

5) మహ:-

తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు. 

6) అహం పూర్ణం బ్రహ్మ:-

అట్టి పరిపూర్ణ బ్రహ్మమును, పరమాత్మను, శుద్ధ చైతన్యాన్ని నేనే, నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన.. అంతే.

***

Monday 25 March 2024

సోమవారం పద్యాలు, కథలు

 శుభోదయంa***

మిత్రులందరికీ  హోళీ పండుగ శుభాకాంక్షలు 


సోమవారం ప్రాంజలి ప్రభ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer, 


శీర్షిక -హోళి.. తేటగీతి మాల 


హృదయ సంబరాలానాంద హాయి గొలుపు  

కోయిలమ్మ రాగం కళ కొత్త వెలుగు 

ఏడువర్ణాల జల్లులు యెల్లరాడు 

ధ్వనుల కోలాహలముగాను ధరణి యందు 


మధురస తరంగ చేష్టలు మానసమ్ము 

అదియు హోళి సంబరమేను యల్లరవదు 

మంజరి సుగంధ పరిమళం మధుర కళలు 

భరత ఖండ మందున జనం భలిరె యాట 


బాల బేలా కలసి వసంతాలు చల్లు

కరుణ కవ్వించు కుంటూను కదలి యాడు 

ఇదియు భిన్నత్వ  యేకత్వ ఇచ్ఛ యాట 

సంస్కృతియు ఉత్సాహపుకేళి సౌరుభమ్ము 


పడుతులు ఎగిరెగిరికేళి  పడుతు యాడు 

లయలు సంతోష సంబరాలకళ యదియు 

పలకరింపుల కళలతో పలుకు కేళి 

పూల బంతులన్నివిసిరి పూజ్యు లాట 


అలక ఆత్మీయ యనురాగ ఆట యదియు 

హరిహరులతొ బృందావనం హోలి కళలు 

భారతీయ పర్వదినము భజన లీల 

దాగియున్న మహత్వమ్ము దారి తెలుపు

***


సీస పద్యమాలిక 


మధువనిలో లీల  మధుమాస రంగులే 

మాధవ చిరుహాస మాయ మెరిసి 

పువ్వులే నవ్వులై పున్నమి కలువలు

వెల్లువెత్తెడికళ వింత మెరుపు 


 పుప్పొడి రంగులు పురమునజల్లిరి 

గోపెమ్మ కళకళ గొప్ప లీల 

బుగ్గలు ఎరుపెక్కె బుద్ధులు పరుగులై 

వాడలన్ని మురిసె వరద పొంగు 


పొదపొదలో రొద పోరుగా యాటలే 

రత్నాల కాంతులు రంగుజల్లె

నగధారి పలుకుల నటనల కళకళ 

నవ్వినదే రంగు నటన కళలు 


వన్నెలొలక వేళ వర్ణము లే జల్లు 

కాముని పున్నమి కళల వేళ

కొంటెవాని చిలుకు  కొసరి అల్లరిలోన 

జంటకలిసెకధ జాతి నందు


చిమ్మినదేను విచిత్ర రంగులకళ 

వెంటబడి వనిత విలవిలవల 

తడిపినదె తడిపి తకధుమ యాటలు 

రాచకేళియంబర రంగుల కళ

***

కం..నరుడై సహకారముగన్ 

హరుడై సహనమ్ము మానవాకారముగన్ 

సిరులే యందించు కళల్ 

హరిమాయ పరమ్ముగా యధార్ధమ్ముగనెన్

***


శా..ఆదిత్యా సకలమ్ము నీ దయ సమానమ్మేను సద్భావమే 

వేదమ్మే తెలిపే విధమ్ము సహనం వేదాత్మ నిర్వాహమే 

నీ దాతృత్వముగాను మేము బ్రతికే నీశక్తి మమ్మేలుటే 

సాదాతత్త్వముగానుసాగు విధిగా సాధ్యమ్ము సర్వమ్ముగన్


శా..రాధాకృష్ణుల కేళివేడుకమనో రక్తీ యతీతం వసం 

తా ధారా ఋతువై సుహాసినివేదాంతమ్ము కోలాహలం 

ప్రాధాన్యమ్ము కళేను హోలి రమణీ ప్రాబల్య ప్రేమమ్ముగా 

చేదేతీపిగనే మనస్సు కదిలీ చిందేసె రంగుల్ కళే 


శా..చిన్నారుల్మది చేష్టలే చిలిపిగా చింతల్లొ చిన్మాయగా

పన్నీరుల్మది నిత్య మాటలగుటే పంతమ్ము యాటల్లుగా 

వెన్నాముద్దలనే తినేటి కళలే వేళల్లొ చూపేనుగా 

వెన్నెల్లో విహరించు నేస్తములతో విందుల్లొ గోపాలుడే


ఉ..రంగుల హోలికేళియగు రమ్యత లోకము జూప కల్గుటే 

రంగులు రాసి యాటలగు రత్నపు కాంతులు వెళ్ళు వవ్వుటే 

రంగుల హావభావములు రవ్వల మెర్పులు సందడేయగన్ 

రంగుల యాటలై రమణి రాజ్యపు లీలలు హోలి పండుగే


ఉ..ముద్దర జీవమేయగుట ముఖ్యమనోగతి కాల మాయగన్ 

ప్రొద్దున మేలుచేయుటయు మ్రొ క్కెద గుర్వుకు తల్లి తండ్రికిన్

ఒద్దిక పొందగల్గెడిది నొయ్యది నేస్తము నిర్మలమ్ముగన్ 

పెద్దల గౌరవించు మది భిన్నము కాకయు ప్రేమ జూపుటన్

****

సోమవారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ 


*🌹🎨  హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival,  Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All.  🎨🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*ప్రాంజలి ప్రభ 


*. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? *

*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*


*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి.  హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,  ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*


*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*


*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు.  హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*


*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ  వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*


*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది.  కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*


*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*


*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*

***

సేకరణ... ప్రాంజలి ప్రభ కథలు


ప్రాంజలి ప్రభ సోమవారం కధలు 

మల్లాప్రగడ రామకృష్ణ 

 

*నీకంటూ ఒకరు ఉన్నారా 


నీకంటూ ఒకరు ఉన్నారా  ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే నీకు తెలియకుండానే ఇద్దరు ఉన్నారు  ఒకరు  ( తల్లి  ) మరొకరు ( దైవం ) .ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి.


పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!


మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.


మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!..


90% అందరూ చేసే తప్పు ఇదే ఏవో ఏమో కావాలని పరుగులు తీస్తారు జీవితం చివరికి వారికి మిగిలింది ఉట్టిపోయిన శరీరం రోగాల కుప్పతో నిండిన శరీరం చీదరించుకున్న కుటుంబ సభ్యులు ఒక రోజు కబీర్ దాస్  ఒక ఊరిలో ఉండగా.. 

ఆ ఊరి ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. 

కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. 


వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ, 


అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు.


 ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.


తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. 

ఆత్మ, పరంగా అందరిలో ఉన్న భగవంతుడు మాత్రమే శాశ్వతం. 


ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. 


ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. 


మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...

........

సోమవారం ప్రాంజలి ప్రభ  కధలు 

సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

 

వివేక వాణి   ( తేచ్చుకోవలసింది  బిక్ష కాని తిట్లుకాదు )


సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . 


మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . 


ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 


పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు . 


మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 


పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 


వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  


ప్రశ్న - సమాధానం 


----------------


ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?


స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .


ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?


స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .


ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 


స : నిజమే స్వామీ !


మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .( మనిషి నైజం ).


***

Sunday 24 March 2024

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు

 

నేటి ఉదయ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ.. ప్రాంజలి ప్రభ 


తేనె టీగ కృషియెనిజం తప్పు కాదు 

బాటసారి కి తీపిగా బాగు జేయు 

కూడబెట్టి యందించుతూ కుమిలి పోదు 

కాల ధర్మము బట్టియే కదులు చుండు 

***

కట్లపాము చూడ భయము కదల గలుగు 

తూట్లు తూట్లుగా చంపేది తుచ్చ బుద్ధి 

నోట్ల కట్టలు చూడగా నోటిమాట 

కట్లు తెంచిన యాంబోతు కదల గలుగు 

***

రాలిపోవు పూలు ప్రకృతి రమ్య తయది 

నేలకొరుగు చెట్లు ప్రకృతి నిజమునిజము 

జాలిగుండె బ్రతుకు నిత్య జగతి వేట 

కూలి పోవ యాధునికమ్ము కూడు యాపె 

***

మల్లెపూలవంటి వయసు మనసు గెలుచు 

మాయమాటలన్నియు తెల్పు మగని తోడ 

మొగుడులేని బ్రతుకుమోజు మొండి గుండ 

సగటు మనిషి సంబరములు సమర మెండ

***

చిన్న దీపమ్ము పోగొట్టు చీకటులను

మంచి మాట యనుకరణ మాయత రుము 

నంత మొందించు నజ్ఞాన మను తమము 

ఎట్టి విద్యను లేక శోభించలేవు

***

బాధలోన ఓదార్పుయే బంధ మగును 

బతికి బతికించు బుద్దియు బలము యగును 

విధము యేదైన వినయుము విలువ గనుము 

కలము గళముతో తెలుపుము కాల గమన

***

అంగనా కదలిక వేగ కథలు గాను 

చూడ సుందరీమణులగా చూవు గాను 

చక్కనైన హావ భవము చంచెలిగను 

ఆనటిగ గంధ పరిమళం ఆత్మ తృప్తి

***

ప్రకృతి చూపినా యాసల ప్రాభవమ్ము 

ధనము కోరి వికృతి చేష్ట ధరణి నందు 

ద్రాక్ష పండక పండించు దారి గతియు 

రోగ భయముతో జనులెళ్ళ రొప్పు యేల

***

జన్మన యేవిద్య యేరూప జాగృతి మనసు మార్పు తీరే 

వెన్నెల యేనీడ కాంతుల్ల విద్యల గమనమేను మారే 

మన్నన సద్బోధ సామ్మోహ  మాయగ మనసు మార్పు కోరే 

అన్నము జీర్ణమ్ము నిత్యమ్ము యాకలి పిలుపు లమ్మ దేవీ

***

సూర్యుడు సాక్షాత్తు దర్శించు సూత్రధర భవభావ దేవా 

ఆర్యుడు యాద్యంప్రభావమ్ము యానతి సకలసేవ దేవా 

సౌర్యుడు సర్వమ్ము గమ్యమ్ము సోదన వినయ లక్ష్య దేవా 

వీర్యుడు విశ్వమ్ము విజ్ఞాన విద్యల కళకళమ్ము దేవీ 

**-

సమస్య:

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

ఉ.

పట్టిన తీపి చేదగుట పాకము మాదిరి పాడుయే యగున్ 

పట్టక పోయినా కళల పాఠము కాలము తీర్పుయే యగున్ 

గట్టిగ నన్నమాటవిని గానము చేయుచు లీద్దరీ గతిన్ 

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

****

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!


కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….


“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”


“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.


“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.


internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.


తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”


” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.


అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!


“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.


నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.


రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.


నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???


ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!


నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.


టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!


మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..


” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….


( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)


ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼


ఆదివారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లాప్రగడ రామకృష్ణ 


```ఒక రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు.


ఒకరోజు రాజుగారు ప్రజలందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు.

ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.

తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు.

ఎంతో ధైర్యం కూడగట్టుకొని, చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.

అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి?” అని అడిగాడు. 


దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు….

“రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి."


రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, మరకలు అంటవు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు” అన్నాడు.


బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.

వెంటనే ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు.


అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజు గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది.


ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంటనే ఉంచుకొని తిరిగేవాడు. ఎందుకంటే రాజుగారి దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.


రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు కూడా తనకి ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారవేస్తారేమో అని భయం తనకి.

క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, అవి కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూటను మాత్రం అస్సలు వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ‘ధరించిందేమో రాజుగారి దుస్తులు మోసేదెమో పాత గుడ్డలు!’ అని హేళన చేస్తూ “పీలిక గుడ్డల మనిషి” అని తనకి పేరు పెట్టారు.


చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచం పై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంతో విలువైన చిరగని తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా! అని బాధ పడ్డారు.```


ఇందులోని నీతి :

```ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా ఇప్పటికి ఎప్పటికి అలానే మోస్తూ ఉంటున్నాము.

మనం మోస్తున్న మూటలో ఉన్నవి, అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషము, కోపము, మన భాధలు మొదలగునవి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తుతెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేకపోతున్నాం,

ఇలా ఉంటే జీవితంలో వేటినీ గుర్తించలేము ఆనందించలేం కూడా! ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడకిక్కడ, ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూటలాగా, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, మనలోని అశాంతికి కారణము.


ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!


కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….


“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”


“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.


“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.


internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.


తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”


” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.


అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!


“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.


నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.


రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.


నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???


ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!


నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.


టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!


మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..


” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….


( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)


ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼



 

ఓ సినిమా కథ 

(1 ) ఆకాశం మేఘకృతం, ఎతైన భవనాలనుతాకుతున్నట్లు ఉన్నాయి, ఆ భవనాలపై కొందరుపిల్లలు  ఆడుతున్నారు, మరికొందరు గాలిపటాలు ఎగరేస్తున్నారు, గాలిపఠాలతో సమానంగా విమానాలు ఎగురుతున్నాయి. అప్పుడే పైకి వచ్చి వాచ్ మెన్ వచ్చి మీరందరు ఇక్కడ ఉండకండి, ఇక దిగిపోండి అని  గట్టిగా అరిచాడు, ఆమాటలకు అందరూ క్రిందకు దిగారు, తలుపులు తాళాల వేసి వెనక్కి పొయ్యాడు. 

అప్పుడే చీకటి పడుతున్నది, విద్యార్థులు కొందరు బైకుల్లో వచ్చారు, వాళ్ళతో కొందరమ్మాయి లు కూడా ఉన్నారు, ఇది ఒక అప్పార్ట్మెంట్ ఇతరులను లోపలకు రానియ్యరు అని ఆపాడు, వాచ్ మెన్ .   నేను ఇక్కడే ఉంటాను,  అంటూ ఒకతను ముందుకొచ్చి నేను గెట్ టుగెథెర్  సందర్భముగా పిలిచాను, అయితే అందరి పేర్లు,  వెహికల్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఇందులో వ్రాయండి అని బుక్ ఇచ్చినాడు అంటే అందరూ వ్రాసి సంతకాలు పెట్టారు. అంతా చీకటిమయం దూరంగా వాహనాల శబ్దాలు వినవస్తున్నాయి. 

పార్టీ లో విద్యారులు బాగా త్రాగి పాడుకుంటున్నారు 

ఎంత మధురం, మరచి పోని ఆనందం మనలో 

సంతసమ్ము వేళాయే, అమానందరి మదిలో 

  

తొలి పొద్దు మేలు గొలుపు, మలి రాత్రి ముద్దు సలుపు, 

తొలి కాంతి ఆశ మెరుపు,  మలి హాయ్ సద్దు వలపు 

తొలి సేవ నిత్య మెరుపు,  మలి మాయ వద్దు గెలుపు 

తొలి  పూజ రక్తి తలపు,  మలి వెన్నె లద్ది  మలుపు  


తొలి వేళ వెచ్చ దనము, మలి నీడ చల్ల దనము 

తొలి గంధ పచ్చ దనము, మలి మౌన సేవ తనము 

తొలి హంస పంచు దనము, మలి హంస ప్రేమ తనము      

తొలి వంట ఇచ్చు తనము, మలి పంట  వెచ్చ తనము 


ఎంత మధురం, మరచి పోని ఆనందం మనలో 

సంతసమ్ము వేళాయే, అమానందరి మదిలో 

కాంతి కిరణం చల్లదనం తరుము, ప్రేమ మాధుర్యం కోపం తరుము, మత్తులో మనం మనం మరిచెదము, మనము ఒకరికొకరం పంచుకుందాము, అంటూ ఊగి పొయ్యారు. వాళ్ళు  

***

  తెళ్ల వారుతున్నది అప్పుడే ఎత్తైన భవనం మీద నుండి ఎవరో దూకారు, పడటంతోనే ప్రాణం కోల్పాయారు, వాతావరణం ప్రశాంతం ... 

తెల్లారాక పాపర్ బాయ్ వచ్చాడు చూసి భయంతో వెనక్కి వెళ్ళాడు పోలీసులకు ఫోన్ చేసాడు..., పాలుతెచ్చిన వాడు " అరవటం " వాళ్ళం అందరూ క్రిందకు దిగారు, నలుగురు నాలుగు రకాలుగా మాటలు వెలువడినాయి. అప్పుడే పోలీసులు వచ్చారు అందర్నీ ప్రశ్నల వర్ష కురిపించారు. అక్కడ వున్న యజమానులతో 

***

" అందరూ ఒకే మాట మేము చూడలేదు ఆమె ఎవ్వరో మాకు తెలియదు అన్నారు"   

మరలా గద్దించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ 

ఆమె మీకు తెలియదా 

ఏమంటున్నారు, నన్ను నమ్మమంటారా అని గట్టిగా లాఠీ ఝళిపించాడు 

అక్కడ ఉన్నవారిలో ఒకడు ఈమె రోజూ కారులో వస్తుంది ఎక్కడినుండి వస్తుందో తెలియదు ఫోర్త్ బ్లాక్ లో 420 ఎపార్టుమెంటులో ఉంటుంది అన్నాడు ఒకడు.

అవును మీకందరికీ తెలుసు ఈమె చెప్పండి లేదా అందరిని స్టేషన్ లో పెట్టి మా ప్రకారము అడగమంటారా అని గద్దించాడు. 

అప్పుడే ఒక వ్యాను వచ్చింది శవాన్ని పరిశీలించి చుట్టూ గుర్తులు గీసి వ్యాన్ ఎక్కించారు 

అప్పుడే అపరిగెడుతూ మా అమ్మాయి అంటూ ఒకతను వాచ్చి మా అమ్మాయిని ఎవరో పై నించి తోసేశారు అని ఏడవడం మొదలు పెట్టాడు. 

అన్ని విషయాలు మేము తెలుసుకుంటాం, ముందు మొరు ఏడుపు ఆపండి, మా ప్రయత్నం మమ్మల్ని చెయ్యనివ్వండి, మీరు వ్యానులో ఎక్కండి, డాక్టర పరీక్షా చేసి, ఎఫ్. ఐ. ఆర్. నోట్ చేసి,  అన్ని వివరాలు కోర్టులో తెలిపాక శవాన్ని ఇస్తాము. మీరు ఏడవకండి, మాతో సహకరించండి అన్నారు. 

ఎస్ . ఐ . రామకృష్ణ మరలా వస్తాము, మీ అందరి సహకారం కావాలి అని అడిగాడు 

అందరూ ముక్తకంఠంమ్ముగా మీరు ఎప్పుడన్నా అడిగినా తెలుపగలము అన్నారు వారు.

ఆడవాళ్లు మరణానికి కొందరు భర్తలు కారణం అవుతున్నారు అని ఒకరు చెప్పడం మొదలు పెట్టారు   

అప్పుడే వ్యాను బయలుదేరే ముందు పత్రికా విలేకరులు ప్రశ్నలవర్షం కురిపించారు. ఎస్ ఐ రామకృష్ణ చెప్పాడు, మాపనికి అడ్డురాకండి అన్నీ మీకు వివరించగలను త్వరలో  .

420 యపార్ట్మెంటూ తాళం పగలగొట్టి లోపల అన్నీ వెతికారు, ఒకచివర ఖాళీ మందుసీసా, గ్లాస్ జాగర్తగా తీసుకొచ్చారు. 

ప్రక్క ఇంటిలో వారిని పోలీసులు అడిగారు కస్తూరి గురించి చెప్పండి. 

నిన్న చాలామంది విద్యార్థులు వచ్చారు వారితో ఈమె కూడా పాల్గొన్నది, రాత్రియేమైనదో మాకు తెలియదు అనిచెప్పారు. విద్యార్థులను ప్రశ్నించేందుకు వెన క్కొచ్చారు పోలీసులు.

అక్కడ విద్యారులు లేరని తెలిసి మరలా 420 రూంలోకి వచ్చారు పోలీసులు, వెతకటం మొదలు పెట్టారు,  మరలా అక్కడ ఒక మూల డైరీ కనబడింది, కొన్ని పేజీలు ఏదో వ్రాసినట్లు  గమనించగలరు ఆ పోలీసులు, చదవటానికి ప్రయత్నించిన అర్ధం కాలేదు నిపుణులద్వారా చదివిద్దామని తీసుకు వెల్లారు వారు. ఇంకా వెతుకుతున్నారు.

 "నాలో నేను నిర్ధారణ చేసుకోలేక, నన్ను నేనుగా నమ్ము కోలేక, జరిగినది చూసీ ఎవ్వరికీ చెప్పలేక, రాజకీయము ఇంత దుర్మార్గమా నమ్మించి మోసం చెయ్యటమా, ఇంకా ఇంకా కావాలని వేంపర్లాడు బుద్ధి ఎందు కిచ్చాడో దేవుడు, ఓట్లకోసం నోట్లు పంచడం సర్వసా ధారణం, వారు మానవులను నమ్మించి, ఏడిపించి, కుక్కకు వేసే బిస్కెట్లులా కొన్ని వరాలు ఇచ్చి లొంగ దీసుకుంటున్నారు. అందులో హరిచంద్ర ప్రసాద్ (మంత్రి) లాంటి వారు రాజకీయములో ఉండటమే ద్రోహం,  ఒక వైపు ప్రేమకురిపిస్తూ అడ్డు వచ్చిన వారిని చంపుతున్నాడు. అందులో నేను కూడా వున్నాను కారణం మంత్రి కొడుకు నాతోటి స్త్రీని బలాత్కరించి చంపటం నాకళ్ళు చూసాను అప్పటి నుండి నన్ను వేడుకుతున్నాడు అతడు. అని వ్రాసియున్నది డైరీలో " 

మంత్రి పై కేసుపెట్టారు కస్తూరి తండ్రి. 

కోర్టులో వాదోపువాదాలు జరిగాయి, మంత్రి నిరపరాదని నిర్ధారణ కొచ్చారు జడ్జిగారు. తీర్పు చెప్ప బోతున్నారు.

లాయరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుమారుని ప్రశ్నించాల్ని అనుమతి కోరారు అంటూ ఒక పత్రం అంద జేశారు.

వెంటనే ఈ కేసు రెండు రోజులకు వాయిదా వేస్తున్నాను అని ముగించారు.

ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడం మంత్రి కొడుకు కూడా నిరపరాదని నిర్ధారణ అయింది. 

అప్పుడే కస్తూరి తండ్రి గట్టిగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నాకు అనుమతివ్వండి నేను నిరూపిస్తాను అన్నాడు. 

బోనులోకి వచ్చి చెప్పండి అన్నారు జడ్జి గారు. 

యీ ఆడియోను విని మీరు తీర్పు చెప్పండి అన్నాడు.

ఆడియో అంతా మంత్రి, మంత్రి కొడుకు సంభాషణలు వా రుచేసినతప్పులు వాక్కులు అవి విన్నారు జడ్జిగారు.

దాన్ని లాయర్ కిచ్చి మీరుకూడా వినండి అని ఇచ్చారు అదివిన్న తర్వాత యిది అసలైనదికాదు మంత్రి పై గిట్టని వారు చేసిన పని అని వాదించారు. 

కస్తూరి తండ్రి మా అమ్మాయి వచ్చి సాక్షము చెప్పితే నమ్ముతారా జడ్జిగారు అని ఆవేశంగా అన్నాడు. 

లాయారు ఆత్మను ప్రవేశ పెడతారా అని హేళన జేశారు. 

అనుమతి కోరింది నేను మీరు నవ్వకండి అన్నాడు పెద్దగా కస్తూరి తండ్రి.

కేసు తప్పు దోవపట్టించాలని మాట్లాడుతున్నారు జడ్జిగారు అంటూ లాయర్ వాదన మంత్రి మంత్రి కొడుకు నిరపరాధిగా తీర్పుఇవ్వండి, అన్నాడు. 

బోనులోకి నెమ్మదిగా కుంటుతూ వచ్చి నిలబడి కస్తూరి. 

భగవద్గీత పై ప్రమాణము చేసే అంతా నిజమే చెపుతున్నాను అబద్ధం చెప్పుటలేదు 

మీరు నాటకమాడటం కోర్ట్ సమయాన్ని దుర్వినియోగం చేయటం తప్పని పించలేదా?

లాయర్ గారు నేను మమ్మల్ని అడగవచ్చా 

అడగొచ్చు 

మంత్రి గారివద్ద ఎంతలాంచం ఫీజు గా తీసుకున్నారు అనగా బ్లాక్ మని 

అక్కడున్న సభ్యులందరు పెద్దగా చప్పట్లు కొట్టారు 

మీరు అట్లా అడగవచ్చా?

లాయర్ గా సత్యాన్ని ధర్మాన్ని గెలిపించే విధంగా వాదిస్తాం, తగ్గ పారితోషికం తీసుకుంటాం.

మంత్రి మరియు వారి కుమారుడు నిరఫరాదులా ?

జడ్జి గారు.. ఆధారాలు ఉంటే అందరూ దోషులే 

మీదగ్గర ఆధారాలు ఉంటే పొందు పరచండి.

లాయర్.. ఇప్పడిదాకా వీళ్ళనాన్న దొంగ ఏడుపులు, ఇప్పుడు ఈమె?

అవునండీ.. ఒక దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించాలంటే చాలా తెలివి వుండాలి. కదండీ.

లాయర్.. మంత్రి గురించి మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. 

జడ్జి గారు మానాన్నగారు మంత్రి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవారు, ఒకనాడు మంత్రిగారు దొంగనోట్లు చెలామణి చేయటం తెలిసికొని పోలీస్  వీడియో తీసి రిపోర్ట్ చేసారు కానీ పోలీసులు మంత్రిగారితో చేతులు కలిపి వీడియో తొలగించి కోర్టులో మంత్రిగారు నిజాయితీ పరుడని కొట్టేసారు కదండీ ఆనాడు

మంత్రిగారు ఆ కక్ష తో డ్రైవర్ నుండి తొలగించారు, పనిచేసిన పైకము ఇచ్చి చివరగా పార్టీలో త్రాగిచ్చి మరీ పంపారు ఇంటికి వచ్చేంగ పడిపోయ్యాడు డాక్టర్ చూపించాగా బ్రాందీలో ఏదోమందు కలిపటం వల్ల అప్పటినుండి పిచ్చిగా తిరుగుతున్నాడు.

లాయర్.. అనవసర విషయాలు చెపుతున్నారు, ఒక మంత్రిని అవమానిస్తున్నారు అన్నాడు.

అవునది నేను అవమానించటం లేదు నా ఆలోచనలు ఎస్ .ఐ .కు డాక్టర్ కు ముందే చెప్పా ను, వారికీ నపధకమునకు సహకరించారు. 

అసలు ఏమి జరిగిందంటే నేను యధా ప్రకారము రాత్రి ఆలస్యముగా ఇంటికే వచ్చా అప్పుడే కొందరు విద్యరుల బైకులు వచ్చాయి ఎందుకో నాకు అనుమానం వచ్చి చూసాను అందులో 4 గురు మంత్రి దగ్గర ఉండే గుండాలు వున్నారు నన్ను చంపటానికి వచ్చారని ఊహించాను అప్పటికప్పుడే ఏంచెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాను ఒక్కసారే ఆ నలుగురు మృగంలా నా మీద పడ్డారు తప్పించుకోవడానికి నిద్ర మాత్రా వేసుకున్నాను కింద పది పొయ్యాను వెంటనే వచ్చినవారు నన్ను మోసుకొని క్రిందదాకా వచ్చారు ఎవరో అలికిడి వచ్చిందని నన్ను క్రింద పడేసారని తెలిసింది తరువాత ఎట్లాగా డాక్టర్ ద్వారా నేను కోలుకున్నాను. 

మంత్రిగారికి దీనికి సంబంధమేమిటి అని లాయర్ వాదించారు 

జడ్జ్ గారు మీరు అనుమతిస్తే కొన్ని వీడియోలు మీకు చుపిస్తాను చూడండి తరువాత తీర్పు చెప్పండి 

మొదటి వీడియో .. దొంగనోట్లు మార్చుతూ మంత్రిగారు ...

రెండవ వీడియో .. బలవంతం చేసి అమ్మాయిని చంపుతున్న వీడియో 

మూడు .. మాఇంటిలో నాపై దాడిచేస్తూ వచ్చినవారి మాటలతో మంత్రిగారే పంపించారని 

తెలిసింది..                 

ఇంట వరకు మా నాన్న గారు కోలుకోలేదు దీనికి కారణమున్న వారికి శిక్ష పడటం తప్పా నేను జాగర్తగా మీకు వీడియోలు అందరికి చూపండి అని అరుస్తూ క్రింద పడి పోయింది.

జడ్జ్ గారు లాయర్ కు విడియాలు చూపించి 

వెంటనే మంత్రిగారు,వారికుమారుడు నేరాలు చేసినట్లు రుజువు ఉన్నందున 14  వత్సరాలు జైల్ శిక్ష మంత్రిగారికి, హత్య గూడా చేసినందుకు కొడుకుకు ఉరిశిక్ష వేయటం జరిగింది. వెంటనే పొలిసు వారు అదుపులోకి తీసుకోవాలని మరియు ఎంతోధైర్యముగా        

ముందుకు వచ్చి కస్తూరి ని కోర్టు గౌరవించి ఆమె సాహసానికి మెచ్చుకొని ఆమెకు ఆమె తండ్రికి మంచి వైదేము ప్రభుత్వం తరుఫున కహ్రుచు పెట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడం అయినది 

***

జోక్ 

(2 ) ఏమిటండి ఇప్పుడు బాటిల్ తీసుకోని వాకింగ్ పోతున్నారు,   

అవునే డాక్టర్ చెప్పారుగా ఉదయం సాయంత్రం నాలుగు రౌండ్లు కొట్టమన్నారు. 

నేను వస్తానండి మీతో రెండు రౌండ్లు కొడతాను నన్నది, అప్పుడే వాచ్ మెన్ పెళ్ళాం           

మీ బుద్ది పోనిచ్చారు కాదు జాగర్తగా ఉండండి ఆసలే రోజులు బాగోలేదు.


 

*_భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....ఎలా ఉంటాయో చూడండి. 


‘లేలేత’భర్తలు:  భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం..

భార్య చూపు తగిలితే చాలనుకోవడం..,

”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”,అనుకోవడం..!

భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం..

అసలు సృష్టిలో భార్య, తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం...!

అన్నీ పనులూ వచ్చని చెప్పడం..!

తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు  భార్యకు చెప్పేసుకోవడం..!

కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం..

{“ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!”}


‘దోర’భర్తలు:

పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ , కొంత పచ్చి మిగిలుంటుంది....

“అన్నీ చెప్పేసామే..!

కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం..

పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుంది లే ,అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు” అని నమ్మకంగా ఉండటం..

కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం.

భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం..

అడక్కపోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం..!

భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు..

కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం..

విలవిల్లాడిపోవడం..

భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం..

భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’అనడం..

తనని పని చేయనివ్వక పోవడం...

{“ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!”}


‘వగరు’భర్తలు:

అన్నీ అనవసరంగాచెప్పేసాం అని దిగులు పెరగడం..!

ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం..

“ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం..

అప్పుడప్పడూ మాట మాట పెరిగి, మళ్ళీ సర్దుకు పోవడం..

కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..!

బైటకి తిప్పడం తగ్గించడం. భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..!

భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ఎంతసేపని అలా పనిచేస్తూఉంటావ్”అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి ..నిర్లిప్తతగా చెప్పడం..

కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త ,పాపం తను ఒక్కతే కష్టంకదా చేసుకోవడం..అని భావించడం..!

{“ఈదశ  పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!”}


‘పండిన’భర్తలు:

భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..!

భార్యతో కాస్త ముభావంగా ఉండడం ..ముక్తసరిగా మాట్లాడ్డం..!

భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి ..

లేకపోతే  కష్టం అని నిర్ణయించుకోవడం..

ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే, “ఎందుకు లేటైంది?  ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?....”

లాంటి ప్రశ్నలు .. తట్టుకోలేక కోప్పడ్డం (ఇది మొదటి స్వచ్ఛమైన  కోపం)

‘ఏమనుకుంటోందో నేనంటే??’ అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం..

ఇంట్లోపని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది...అయినా ఆడవాళ్ళపని మనం చేయడమేంటి..?అని నిశ్చయించుకోవడం..!

{“ఈదశ మొదటి సంత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..!”}


‘పొగరు’భర్తలు: 

నేను మగాణ్ణి నా ఇష్టం ..

అనే భావనతో మెలగడం..భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా ,తన గతం ఎత్తి దెప్పుతూంటే 

చిరాకు పడ్డం ..

కోపంగా అరవడం..ఇంట్లోంచి ఆవేశంగా వెళిపోవడం..

రాత్రికి చల్ల బడ్డం..తనే ముందుగా,భార్యతో మాట్లాడ్డం “అన్నం తిందామా”అని అడగడం..

మళ్ళీ ఉదయం మామూలే..

{“ఈదశ ఆర్నెల్లు ఉంటుంది..!అంటే పెళ్ళయ్యి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది..ఈ దశ దాటాక క్రొత్త కష్టాలు మొదలౌతాయి...!”}

‘విసుగు’భర్తలు:

పిల్లల ఏడ్పులతో విసుగు చెందడం..!

భార్య, ”పిల్లల్ని చూస్తూండండి”అని చెప్పినప్పుడు.

కోపం-చికాకు అణుచుకోవడం..

ఓర్పు క్షీణించడం..

“ఛ ఛ కొంపలో మనశ్శాంతి లేదు” అని వీధుల్లో తిరగడం..

పాత మితృలను కలవడం..

పుట్టింటిని,అమ్మా నాన్న ను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం...

చదుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం..

ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు రావడం..

భార్యపై అరుస్తూ ఉండడం..

భార్యతో వాదనకు దిగడం..

భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే, వస్తువులు పగలకొట్టడం..

ఆవేశంగా బైటకి వెళిపోవడం..

ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం..

దెబ్బలు చూపిస్తూ,ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా..

భర్త అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు..

”ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్న పిల్లా??”అని మనసులో అనుకోవడం....

“ఇంకా పెళ్ళికాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను”అని సలహాలు చెప్తూండడు..

పెళ్ళి చేసుకున్న వాళ్ళపై జాలి ,సానుభూతి చూపడం..

{“ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకూ ఉంటుంది...!”}


’దిగులు’భర్తలు:

ఆదాయం కంటే ఖర్చులు పెరగడం..

అప్పులు చేయడం..

ముందు ఘోరం ఊహించక,భార్యని “ఏమైనా మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా??”

అని అభ్యర్థించడం..!

భార్య తెచ్చిచ్చి,గొడవలైనప్పుడల్లా “మా పుట్టి0టివాళ్ళు ఇస్తేనే గానీ దిక్కు లేదు”అనే ఈ అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినపుడు..

భార్యని ఏమీ అనలేక,మానసికంగా కుంగిపోవడం..కుమిలిపోవడం..

గిలగిల్లాడిపోవడం..!

భార్య”ఏం మా వాళ్ళు ఇంటికొస్తే నోరు పెగల్దే ..? 

మొహం మాడ్చుంటావ్..అదే మీ వాళ్ళొస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారి మొహం..మా వాళ్ళని చూడలేవు కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటావ్.పలకరిస్తే నీ ఆస్తులు కరిగిపోతాయా??.”లాంటి మాటలు..

భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకి వెళ్ళొచ్చాక కొన్ని నెలలపాటు భార్య,”చూసావా మీ వాళ్ళు ఎలాంటి చీర పెట్టారో !ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు!ఓ మంచిగా పలకరింపు లేదు.!తిన్నావామ్మా?అని అడిగింది లేదు..!గొప్పకుటుంబాలు ..!గొప్ప వంశం మీది..!”

లాంటి మాటలు వింటూ..

“పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను”

అని పశ్చాత్తాప పడడం..

మా నాన్నగారు”పెళ్ళైంది ..ముందులా కాకుండా జాగర్తగా ఉండాలి”అని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది...!అని బాధపడడం..

శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ నవ్వకోవడం చిన్న చిన్న మానసిక,శారీరక అనారోగ్యాలు..!

ముఖంలోదిగులు -బెంగ-నిరాశ,ఎదుటివారికి  కొట్టొచ్చినట్టు కనపడ్డం...

{“ఈదశ చాలా ప్రమాదకరమైన దశ,ఈదశలోనే చాలా మంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం, పూర్వపు ఆడ స్నేహితురాళ్ళకు దగ్గర కావడం..

ఇలా చాలా ఘోరంగా ఉంటుంది..

లేదా దేవునిపై విపరీతభక్తి ..

గుళ్ళకి ,గోపురాలకి ఎక్కువ తిరగడం..

పూజలు,ఉపవాసాలు, ఎక్కువగా చేస్తూ ఉండడం...

ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటూండడం..

అమ్మ నాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ...!ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకూ ఉంటుంది...!}


‘బరువు’ భర్తలు:

పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూడ్డం అనే బరువు మీద పడి.....

తన బాధలు మర్చిపోవడం..

(ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదోచేద్దాం అనుకున్నవి మరిచిపోయి)

నేను తండ్రిని ..నేను తండ్రిని ..

‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం...

{“ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ..ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది ..

అంటే ఒకప్పటి భర్త ..తండ్రి దశ దాటి తాత అవ్వడం..”}


‘చల్లారిన’భర్తలు: పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..

వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..

ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..

అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..

కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”

అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..

నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి ఏం ప్రయోజనంలేదు..

పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”

అని పిలుపు వినపడగానే ..కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం..

{“ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది...”}


అంకితం: భర్తగా మారిన వారికి..,

భర్తగా మారాలనుకునే వారికి..,

భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి..  ఈ వ్యాసం అంకితం.....

***

 


Sunday 28 May 2023

తరుణోపాయం కథ 2 (26-05-23)

ఒక అడవిలో ఒక సింహం అనేక ఇతర జంతువులు నివసిస్తున్నాయి.ఆ అడవికి సింహం రారాజు.అదిరోజు దొరికిన జంతువులను దొరికినట్లుగా తింటూ అన్ని జంతువులను భయభ్రాంతులకు గురిచేస్తుండేది.జంతువులన్ని ఒకచోట సమావేశమై ఎలాగైనా సింహం పీడను వదిలించుకోవాలని తీర్మానించుకున్నాయి.అందుకోసం అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి.

                                    ఇదిలావుండగా సింహం ఒక రోజు పంటి నొప్పితో విలవిల్లాడుతూ  "ఈనొప్పి ఎలా తగ్గించుకోవాలి" అని నక్కను సలహా అడిగింది.అప్పుడు నక్క" మృగరాజ!ఈ అడవిలో కొంగను మించిన డాక్టర్ ఎవరు లేరు.డాక్టర్ కొంగ మీ పంటి నొప్పికి సరియైన చికిత్స చేయగలదు.వెంటనే మీరు కొంగను పిలిపించండి".అని సలహా యిచ్చింది.

                                   సింహం ఆజ్ఞతో డాక్టర్ కొంగ పరిగెత్తుకుంటూ వచ్చి సింహం నోటిలో పళ్ళను పరిశీలించి, "రాజా మీ నోటిలో నాలుగు పళ్ళు పుచ్చిపోయాయి ఆనాలుగు పళ్ళు తీసివేస్తే మీబాథ తగ్గుతుంది, కాని మీరు అందవిహీనంగా కనబడతారు అందుకని మీ పళ్ళను మొత్తం తొలగించి మరళ కొత్త పళ్ళను కట్టిస్తాను అప్పుడు మీ పంటి బాధ తగ్గటమే కాకుండా మీరు మరింత అందంగా కనిపిస్తారు మీరు సరే అంటే చికిత్స ప్రారంభిస్తాను"అని అన్నది.

                                    సింహం సరే అనగానే కొంగ సింహం నోటిలోని పళ్ళను మొత్తం ఒక్కొక్కటిగా పీకివేసింది.కొత్తపళ్ళవరుసనుకట్టి "ఇదిగో రాజా నీ కొత్త పళ్ళవరస దీనిని దగ్గరలో వున్న  నదిలో  ముంచుకొని తీసుకు వస్తాను అలా చేస్తే నీవు జంతువులను చంపుట వలన కలిగే పాపానికి నిష్కృతి లభిస్తుందని నాకు ఒక మునిపుంగవుడు సెలవిచ్చాడు కావున నేను త్వరగా నది వద్దకు వెళ్ళి తిరిగి వస్తాను ,అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి వెళ్ళింది.

                  మరింత అందంగా తయారవుతాననే భ్రమల్లోవున్న సింహం, కొంగ ఎంతకూరాకపోయేసరికి,ఆకలికి తాళలేక వేటాడలేక నీరసించి నీరసించి చిక్కిశల్యమై,చివరికి చనిపోయింది.సింహంపీడ విరగడైనందన అన్నిజంతువులు ఎంతో సంతోషించాయి.కొంగతెలివిని మెచ్చుకున్నాయి.

నీతి: ఉపాయంతో ఎంతటి అపాయాన్నైన తప్పించుకోవచ్చు.

88---

ప్రాంజలి ప్రభ -- రోజుకొక కధ చదవండి - చదవమని చెప్పండి (27 -05 -2023 ) 

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు   (ఒక వాస్తవ గాథ)

          అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు.

బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు వెళ్లేవాళ్ళే. 

ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలిని టికెట్టు తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.

బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది. వానాకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో..?

అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా!"

ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కునుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది? ఆమెకు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు..?

ఒంటరిగా ఉన్న ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే..?

ఇంతలో ముసలామె దిగే ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .

కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.

బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. 

కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.

అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.

"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు?" అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్  ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి! బస్సును నడపండి!" అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కిఆదేశాలు ఇచ్చారు.

"నాయనా! నీ పేరేంటి?" అని కండక్టర్ని అడిగింది ముసలామె.

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?.. నా పేరు మహాదూ వేంగుర్లే కర్.”

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా?"

"మాల్‌ వన్." అన్నాడు కండక్టర్ ."నీకు సంతానం ఎంత మంది?"

"ఇద్దరు" అన్నాడు కండక్టర్ .

ఇంతట్లో ముసలవ్వ ఇంటిని(పూరి గుడిసె ను) చేరుకున్నారు. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.

ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది. ఆమెకు దగ్గరి బంధువులు అనేవాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!

ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది.  భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.

ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా, వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను. కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌' బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరిట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేలరూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మలకోసం వాడుకోండి. నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను." అని అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.ఇదేంటి సమస్య? ఈ మహాదు వేంగుర్లే కర్ ఎవరు? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ దగ్గర  సెలవు తీసుకొని వెళ్లి పోయారు.            

రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ కన్నుమూసింది.ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్ని పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్, కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కానుక కండక్టర్ కి అన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది విన్న సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.

మహాదూ వేంగుర్లే కర్     పిలిచిన తారీఖున ఆఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. 

అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తనపేరట వ్రాయటం అతడికి మతి పోయినట్లు అయింది.!

అక్కడ సమీపం లో   పిల్లల గోల వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా?" అని అడిగాడుకండక్టర్.

"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తోంది." అనిచెప్పాడు సర్పంచ్ . 

"ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.

"ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ ముందుకు రావటం లేదు." అని జవాబిచ్చాడు సర్పంచ్.

వెంటనే కండక్టర్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ - "ఇదిగో సర్పంచ్ గారూ పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరిట బడికి ఒకదివ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి. మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి." 

గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరంవెంబడించింది.

చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదేఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.మనం జీవితంలో ఒకరికి చేసిన చిన్న, పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.

మనిషి మనిషి కి  మధ్య  మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు 

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

****

ప్రాంజలి ప్రభ వారి నేటి కథ
(2)...28=05=2023
జీవన సత్యం

వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. మనమే ఒక రోడ్డు వేసుకుని వెళ్ళడం కష్టం. అమ్మ చందమామను చూపించి బువ్వ తినిపిస్తుంది. జ్ఞాని దేవుణ్ని చూపిస్తాడు. చివరికి అతడే గురువుగా మిగిలిపోతాడు.

దేహం - అణువుల సముదాయం.
మనస్సు - ఆలోచనల సముదాయం.
బుద్ధి - అవగాహనల సముదాయం.
ఆత్మ - అనుభవాల సముదాయం.

 మంచివాళ్లు. ఆదర్శవంతులు ఒక మార్గం చూపిస్తారు. ఆ దారిలో మనం వెళ్తే జీవితం ఎక్కువ కష్టాలు లేకుండా సాగిపోతుంది.

ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.

 నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..

కాలం మనతోనే ప్రారంభం కాలేదు.
మన ముందు ఎందరో ఉన్నారు. గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి చూపించారు. అందువల్ల మనకు ఒక దారి ఉంది. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళిపోదాం! అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను. అవరోధాలను పరిష్కరించి, రాబోయే తరాలకు మన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నామో చూపిద్దాం.

జననం అంటే?  కార్యంగా 'ఉండడం'.
మరణం అంటే? గుప్తంగా 'ఉండడం'.
మోక్షం అంటే? లీనమై 'ఉండడం'.

మార్గం వేరు, లక్ష్యం వేరు. సరైన మార్గం ఎన్నుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. మనం ఎంతో అదృష్టవంతులం. మన ముందు తరాలవారు మనకు ఎన్నో ఉపాయాలు, పరిష్కారాలు, కిటుకులు అందించారు. భయపడకుండా అడుగు వేసుకుంటూ వచ్చేయండి. మీకు మేమున్నాం అని. వాళ్ల అనుభవాల చరిత్ర భరోసా ఇస్తోంది. వారికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం కూడా ఎంతో కొంత కృషిచేసి, మన పని చేసుకుంటూ ఆదర్శప్రాయమై ఇతరులకు నాలుగుదారుల
కూడలిలో దీపాలు వెలిగించాలి. వెలుగు భావితరాలకు కనిపించాలి. వాళ్ళు మనకు అభినందనలు తెలపాలి. ఇదే జీవితం వెళ్ళేవారు వెళ్తుంటారు. వచ్చేవాళ్లు వస్తుంటారు. ఎవరి అనుభవాలు వారివి. చివరికి అందరికీ కొన్ని అరుదైన అనుభవాలు శాశ్వతంగా మిగిలిపోతాయి.

భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!

 యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!

మరణించిన తరవాత లోకంలో శాశ్వతంగా ఎలా ఉండిపోవాలో తెలియజేస్తోంది భగవద్గీత. ఎలా బతికితే శాశ్వత పరంధామ పథం పొందగలమో కూడా వివరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు మనకు చేసిన మహోపకారం భగవద్గీత ద్వారా చూపిన జ్ఞాన మార్గం.. మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మహా గ్రంథాలు, మహానుభావుల అనుభవాలే మనకు దిక్సూచి, వారి కార్యాచరణే మనకు శిరోధార్యం. వారి నిబద్ధతే మనకు ప్రాణసమానం. వాళ్లే మన ఊపిరి. వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

జీవుడిలో దేవుడు దాగి జీవుడితో ఆట ఆడుతున్నాడు.

ఇప్పుడు జీవుడు దేవుడిలో దాగి ఆ ఆట దేవుడిదే అని నిశ్చింతగా ఉండాలి.

తాతముత్తాతలు ఆస్తులు ఇస్తారు. తల్లిదండ్రులు సంపాదించినవి ఇస్తారు. కాని, వెలకట్టలేనివి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అవే మనకు విలువైన సంపద. తరగని ఆస్తి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాముడంటే తెలియని ఒక ప్రదేశంలో పుడితే, రామాయణం కూడా తెలియదు. దాని గొప్పదనం తెలియదు. మన ముందు నడిచిన మహానుబావుల అడుగుజాడల్లో నడవాలి. దైర్యం విడిచిపెట్టకూడదు. వీరులు వాళ్లు. మన సుఖం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. యుద్ధాలను ఆహ్వానించారు. విజయం సాధించారు. శాంతిని అందించారు.
కర్మఫలం కర్మ చేసిన వానికి మాత్రమే చెందదు. ఆ ఫలం ప్రపంచంలో ఉన్న సకల చరాచరానికి పంచబడుతుంది.. అంటారు గురువుగారు.

 వాన చుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...

ఆదే దారిన పడుతూ లేస్తూ అయినా వెళదాం. వెయ్యిసార్లు కిందపడినా,
మళ్ళీ లేచి నిలబడదాం. ఒక కొత్త వెలుగును లోకానికి చూపిద్దాం!

రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము

 మొదటి కలయిక -  క్షణికానందము.
 రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
***
నిజమో అబద్ధమో మీరేచెప్పండి ప్రాంజలి ప్రభ కథ... (3) 29=05=2023

నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే , నీ బాధను పంచుకునే వారికేఎక్కువ విలువ ఇవ్వు.     
ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు  కాని బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. నిజమా 

కులం పోవాలని చెప్పేది మనమే..
కులం చూసి ఓటు వేసేది మనమే..
అవినీతి పోవాలనేది మనమే..
అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే.. నిజమా 

సమాజంలో మంచిని స్వీకరించి  చెడును వదిలి వేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేదే  "విద్య" అదే మన అందరి బంగారం, బంగారం పంచలేకపోయినా విద్యను పంచుదాం. నిజమా 

ఇంటికో రాముడు పుట్టాలని చెప్పేది మనమే..
మన ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవి పుట్టాలని కోరుకునేది మనమే..
మార్పు రావాలని చెప్పేది మనమే..
అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరి పోసేది మనమే..నిజమా 

మనం చేసిన మంచిని మర్చి పోవాలి. మనకు మంచి చేసిన వారిని మాత్రం జీవితాంతం మర్చి పోకూడదు.
   
గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారి తోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితోనూ పోల్చుకోవాలి. వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.   
ఉన్నది చాలనుకుంటే మనకెంతో తృప్తి. ఒకరిది వద్దనుకుంటే మదికెంతో సంతృప్తి నిజమా 
     
రేపటి అందమైన భవిష్యత్తు కోసం  మన మనస్సును ఎల్లప్పుడూ మంచి విషయాలతో నింపుకోవాలి.అదియే అందరికీ శాంతి సౌభాగ్యలు నిచ్చె సంతృప్తి

అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........
వెర్రి గొర్రెలు..కాదు కాదు తెలిసిన మూర్ఖులం నాకెందుకు అనే చవటలం...నిజమా 

  అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని
 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం. నాగరికతను పాటిస్తాము ఏ ఎండకు ఆ గోడుకు పట్టె మనుష్యులం. మాటమీద లేని మనుష్యులం. నిజమా 

​ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు ఒకనాడు జరుపుకుంటాం.​ కాదండో మారింది ఉప్పుడు దీపాలు వెలిగిస్తున్నారు కొంత మార్పు మానవలోకం. నిజమా 

​మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.​ అందుకే చెడు వేగంగా మనిషిని చేరుతుంది మంచి నిదానంగా మార్పు చూపిస్తుంది. నిజమా 

​ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.​
ఇప్పుడు ఒకేచోట పాలు, బ్రాందీ అమ్మే ప్రభుత్వాలు కొనే మనుష్యులున్నారు నిజమా.

​ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.​ ఎందుకంటే అజీర్తి రోగం రాకుండా. నిజమా 

​ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.​
ఎవరి స్వార్ధం వారిది, వారిమతం వారికే గొప్ప నిజమా 

​దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు -నిత్యందైవణామం చేస్తాడు, ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.​ దైవాన్నే మోసాగిస్తాడు. నిజమా 

​విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.​ అంటే తీరం దాటాక తెప్ప తగ లేసే మనుష్యులు కదా నిజమా 

​ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!​ 
నిజమె కదా.....

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
....
30-05-2023
కూతురు

కూతురు అమెరికాలో , అమ్మ హనుమకొండలో , కొడుకు ఇంగ్లండ్ లో, తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్, నాన్నకేమో క్రైసిస్ , నువ్వు వీసాపై ఎక్కడో అమ్మ అంపశయ్యపై 
నువ్వు రావు, రాలేనంటావు, నిజానికి రావాలని అనుకోవు, టికెట్ దొరకదంటావు..
సెలవు లేదంటావు..
వస్తే తిరిగి రావడం కష్టమంటావు..
నువ్వు వచ్చేదాక అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు  గుమ్మం వైపే..
రావని తెలిసినా  నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక..
కక్కలేక..మింగలేక..
మంచం చుట్టూ అటూ ఇటూ అవతల ఆ తల్లి ఇంకాసేపట్లో అటో ఇటో..
వయసు వచ్చినప్పటి నుంచి డాలర్ డ్రీమ్సే..
పొద్దున లేస్తే ఆ ఊసే..
నీ కలల వెనకే తల్లిదండ్రుల పరుగు..
వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ..
గుండె బరువుతో వారిక్కడ..
మొదట్లో రోజూ ఓ వాట్సప్ కాలు రెండ్రోజులకో వీడియో ఫోను పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు అప్పటికే  నిద్ర లేచి ఉంటాడు నీలో ఓ మాయలోడు...
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు ఇక్కడ డొక్కు స్కూటర్ తో తంటాలే నాన్నకి ప్రతిరోజు..
ఈలోగా అన్నీ బాగుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదంటే అక్కడే ఓ భామతో మేరేజ్..
ఆలికి కడుపో కాలో వస్తే ఆయాగా అమ్మకి వీసా నాన్నకి నేను డబ్బులు పంపుతాలే 
అని భరోసా..!
ఎంత అమ్మయినా, నీ పిల్లలకు నాన్నమ్మయినా, ఆమె నాన్నకు భార్య అక్కడ పెద్దాయన 
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని ఒకటే బెంగ..
ఆ దంపతులను అలా వేరుగా ఉంచి మీ జంట మాత్రం టింగురంగ..
మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది ఆమె వీసా గడువు..
ఆమె చేతిలో టికెట్, నాన్నకిమ్మంటూ ఓ గిఫ్టు పేకెట్..
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక అటు భర్తని విడిచి ఉండలేక చెమ్మగిల్లిన కళ్ళతో విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..
నువ్వు పంపుతావేమో..
కాని ఆ వయసులో నాన్నకు శ్రమ..
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..
వచ్చే ప్రాణం..పోయే ప్రాణం చివరకు అనివార్యమయ్యే మరణం..
వాడు వస్తున్నాడా.. ఏమంటున్నాడు..
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ..
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ..
కొరివి పెట్టాల్సిన నువ్వు సీమలో నాన్న కర్మ చేస్తుంటే ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..
అస్తికల నిమజ్జనం అంటూ నాన్న కాశీకి పయనం అంత శ్రమ ఎందుకు..
పక్కనే ఉంది కదా గోదారని నీ అనునయం..
ఇప్పుడిక నాన్న కథ 
ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లు ముఖ్యంగా ఆ ఇంట్లో అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక కష్టాలకు ఓర్వలేక..
ఓ రోజు502023న ఆయన కధా కంచికి…
ఈసారి వస్తావు కొరివి పెట్టి ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఉన్న ఊరు..కన్న తల్లి..
అన్నిటితో రుణం తెంచుకుని నేను ఎన్నారై..
మిగిలినవన్నీ జాన్తా నై..
అంటూ పుట్టిన గడ్డను వదిలి పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస ఇదే కదా చాలామంది వరస..!!
***
31--05--2023

అర్ధమయిందా ? ప్రాంజలి ప్రభ నేటి కథ          -                                                        -               *ఒక ఊరిలో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. *
ఒక చదువు రాని వ్యక్తి శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. "రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య. "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు ఆ వ్యక్తి ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని ఆ చదువు జ్ఞానం లేని వ్యక్తి చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.
* అప్పుడు ఆ భార్య ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది. ఆ వ్యక్తి వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. చూసావా ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. "నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.*
* అప్పుడు ఆ చదువు రాని వ్యక్తి ఇలా అన్నాడు "గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది.*

కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న  భర్తను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భార్య  అక్కడేం  చేస్తున్నావు అని *అడిగింది *..
        ....... *దానికి అతడు * .......
" *ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం  కూచున్నా అన్నాడు *,”
అర్థం కాక అయోమయంలో ఉన్న *భార్యతో * *భర్త * ఈవిధంగా *చెప్పాడు * ఏమిటంటే..
" ఆలి పోయిన వాడు "శ్రీరామ చంద్రుడు",
" వెతక బోయిన వాడు  "హనుమంతుడు"
" అతని తల్లి అంజనాదేవి,
 " ఆమె మొగుడు  వాయుదేవుడు.. 
అంటే "గాలి" కోసం, బాల్కనీ లో కూచున్నా అని "విసనకర్ర" తో విసురుతూ *చెప్పాడు * "...
మొగవాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు ఎక్కడచెప్పాల్సిన మాటలు అక్కడ చెపుతారు. అందరూ ఇట్లావుంటారని అనుకోకండి ప్రత్యేకంగా మావారు లాంటివారే.
నిజమేనా
మీ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
***

దివ్య శిల్పి

శిలా నీవే....
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో.....  
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... దైవంగా మార్చుకో....!!  

శిలా నీవే....
శిల్పం నీవే....!! 
ఇంకా....ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు....  
ఎన్ని జన్మలు...                                             ‌
శిలగానే... ఉంటావు,                                
శిల్పమెక్కడో  లేదులే.....                 
అది....నీ‌ లోనే‌....
నీ మదిలోనే ఉందిలే..... శిల్పం...!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
నీవే శిల్పానివి....                                    
శిలగా.... !
ఉన్న నిన్ను నీవుగా శిల్పంగా.... 
మలిచే  శిల్పి..... ‌
ఎవరో.... 
కాదులే.... 
అది నీవేలే....!!
అది నీవేలే....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవే శిల్పివి,  
నిన్ను నీవు...                                    
ఎరుక‌తో తెలిసుకో.... !                        
నీకు నీవే శిల్పివి....!!
నీలోనే ఉన్న శిల్పాన్ని   చూడు.....!
మబ్బుల మాటున  దాగిన... 
! చందమామలా...! 
మరుగున ఉన్నది....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీ మనసులోని అయుక్తాలను,
అరిషడ్వర్గాలను
తొలగించుమూ....! 
వ్యర్థాలను,
దుర్గుణాలను...
విసిరి పారవేసేయుమూ...!!
నిన్ను నీవు.... సరిగా  మలుచుకో....   అంతే,  ‌   
ఇక అదే శిల్పమే,
అందులోన దాగిన దైవమూ....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీకు నీవే...  కర్తవు,                           
నీకు‌ నీవే...   విధాతవు,     
 నీకు నీవే  శిల్పివి....                       
నీవే‌ సుందర శిల్పానివి....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవు... నీ వ్యక్తిత్వంను,                               
నీ జీవితంను,
నీ  జీవనం  సుందరశిల్పంగా మలచుకో....
మానవా,  ఓ మానవా....!!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

మహా శిల్పీ ఓ మానవతా శిల్పీ....
ఓ దివ్య శిల్పీ       ‌మేలుకో....
నిన్ను నీవు దైవంగా మలుచుకో....!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో..... ! 
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... !
దైవంగా.. మార్చుకో....!!  
***


Sunday 19 March 2023

 


26/05/2023.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
నేటి యువతలో ఉన్న లోపాలను సరిచేసేలా 
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసనలు చూడనేలా ప్రగల్భాలు గొప్పలు చెబుతే సరిపోదంటు 
గుండెల నిండా ప్రశ్నించే దమ్ముండాలంటు  యువతలో కదలిక తెచ్చి చైతన్య పరచి  నేడు రేపు నాదే నంటు
ఉత్సాహంతో విశ్వాసంతో ముందడుగు వేయించేలా
సాగే పాట. అడుగడుగులో  సత్తా చాటేలా మునుముందు కు సాగించి సాహసం చేయమంటు
సమాజం నీదంటు  చాటి చెప్పే పాట.!!
***********
పల్లవి:-
***
ప్రశ్నించడం తెలియదే జవాబు వివరంచడం రాదే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావో చెప్పలేదే, దేశ కుటుంబాన్ని అర్ధం చేసుకోలేదే, 
ప్రజ్ఞ ఎలా అబ్బుతుందో తెలుసుకో ముందుగా, ధైర్యంగా తప్పుతప్పని, సత్యము సత్యమని వాదించడం నేర్చుకో.. నేర్చుకో.. నేర్చుకో 

ఆజ్ఞాపించడం అర్హత అనుకోవద్దులే 
ఆగ్రహించడం  చేవ ఉన్నవాడి లక్షణం అనకులే 

నోరుందనో  జేబులో డబ్బుందనో
గొప్పోడివనుకునే రోజులైతే కాదులే
అందరిలో నీ ఒకడి వని మరచి ప్రవర్తన ఎందుకులే 

 ప్రశ్నించడం చేతకానోడివై 
 ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే .
చరణం:-1
***
పనిచేసేవానికి తిండి కరువయ్యే రోజులే
పలుకరింపులతో మాయ చేసె రోజులే 

పైపై మాటలు  విని
సలాం కొట్టే జనాలు లేరులే 
కష్టించే తత్వానికి ఇష్టపడేవారే లేరులే 

నష్టనివారణ చర్యలు చెప్ప లేవులే 
నీ సత్తా ఏమిటో  తెలిప లేవులే 
పిల్లిని చూసి పులి అనే స్వభావం గల వాడివి లే 

రేపటి రోజు నీదని చెప్ప లేవులే 
నేటి రోజుపై పట్టు సాధించవులే 
పట్టు పట్టడమంటే తేనెతుట్టేలా ఉండాలిలే 
పట్టుదల పై సవారి చేయ లేవులే 
 పల్లవి:-
***
ప్రశ్నించడమే చేతకానోడివిలే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే 
 చరణం:-2
****
భుజం భుజం కలిపి నడిపించే చొరవ లేదులే 
జనంలోకి చొచ్చుకుపోయే తెగువ లేదులే 
నువ్వు కావాలిరా ఆ ధైర్యం నిలవాలిలే 

భజన పరుల పూజలను   
దరికే రానీవకులే 
నిన్ను నీవు నమ్మి ముందుకు సాగ వలే 
నీవు చేసే పని ఎన్నటీకి వమ్ముకాదులే
నమ్మకమే నీకు బలము అని తెలుసుకోవాలిలే 

 కాలం ఎప్పుడు సవాళ్ళ వెంట ఉండును లే 
 భయమే లేకుండా కదలాలిలే 
గాయం అయినపుడు మందుగా మారాలిలే 
న్యాయం వైపు నడువు విజయం నీదవుతుందిలే 
 
గమ్యం ఎంత దూరమైనా
నిర్ణయం నీదే కావాలిలే 
బాధైనా బఢభాగ్నైనా  లెక్కే చేయక నడుం బిగించాలిలే 
పక్కా ప్రణాళికతో  నిక్కచ్చిగా  ముందడుగు వేయాలిలే 

 జయము జయము నీదే  విజయ లక్ష్మి నీదే కావాలిలే 
 జయము జయము నీవే ప్రజలంతా నీ వెంటే ఉంటారులే 
 పల్లవి:-
***
 ప్రశ్నించడమే చేతకానోడివి కావులే 
 ప్రపంచాన్ని ఎలా ఏల గలవు తావులే 
 ************

 రచన:-
27/05/2023. *****  పాట సందర్భంపై నా విశ్లేషణ.
****౮****
ప్రేమలో పడినపుడు ఆ  ప్రేమికుల హృదయం ఎలా ఒకరికై ఒకరు పరితపిస్తారు ఎలా  ఒకరి సాంగత్యాన్ని ఒకరు కోరుకుంటు  ప్రశంసించుకుంటు   ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుపుతు  ప్రకృతి తో పోలుస్తు తన సంతోషాన్ని తెలుపుతు ప్రేమలో లీనమై పిడుకుంటున్న ఈ పాట.
*****************
పల్లవి:-
***
ఓనమాలు నేర్పవా 
ఓర్పుచూపి ఆదుకోవా
ఓటమిలోని విజయాన్ని అందించవా  
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో

ప్రతి క్షణం  నీ స్మరణై 
నన్ను వెంటాడుతున్నదే 
నాహృదయంలో నేవి  
మనసంతా  వేణువై  పాడేనులే..

ఆహహా  ఆహాహా

ప్రియతమా  నిను చూచిన క్షణమే
అనురాగాన్ని అందించాలని 
ఆశపడ్డా నీపైనా, 

మధురమా మనోరమా మానస వీణ  
నీ ప్రేమ పొందిన భాగ్యమే నేనై
సౌఖ్యమెంతగానో పొందానులే..
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
****
పిలిచినంతనే పలికే దేవతవే
పలుకంగనే వరమై కురిసి
చేరుకున్న  చిరునవ్వువే

అలలా ఎగసినావు   
కలనే కరిగించినావులే...

వలపే రుచి చూపినావు
తలపుల్లో  తిష్టవేసినావే...

వరుడవై పక్కన చేరి గిలిగింతలతో 
చలి మంటలు రాచేసినావురా  నాలోనా...
పల్లవి:-
**
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
***
వెచ్చని నీ ఒడిని వీడలేకుండే
బానిసగా మార్చేసినావులే..!!

స్వచ్ఛమైన  పుట్టతేనెవే
నీ అధరములే అమృతధార లే
జాలువారినా  పెదవులను ముద్దాడినాకే
తెలిసిందిలే  అమరత్వమే సాధించినానని..!!

ఏమైనా సరే    ఏదైనా సరే
నీవు నా తోడైనందుకు కృతజ్ఞతగా 
నా  కౌగిళినే  కానుకగా ఇస్తున్నా మన్మధా
ఆ జాబిల్లి సాక్షిగా...
 పల్లవి:-
****
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
********
28/05/2023.
*****
 పాట సందర్భంపై నా  విశ్లేషణ.
***********
 ఎందరో మహానుభావులు   ఆ మహానుభావులందరికి లోకి   మహానుభావుడు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి  తారక రాముడు.  వంద సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ భూమి పై పుట్టిన   గొప్ప తేజం సంకల్ప స్వరూపం.సుఃదర రూపం   పరిపూర్ణ మహోన్నత వ్యక్తిత్వం. చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించుకున్న 
దివ్య భవ్య విశ్వ రూపం నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా
 ఈ పాట.
*౮**************
 పల్లవి:-
****
విశ్వం మెచ్చిన తిరుగు లేని మనిషి 
విశ్వ నరుడై వెలుగొందిన  ఎదురులేని మనిషి
సర్వం తెలిసిన బంగారు మనిషి 
ఆంద్రావనికే ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహర్షి.బ్రహ్మర్షి 
కోరస్.
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వ విఖ్యాత నటరత్న, పద్మశ్రీ నాట సార్వభౌముడై 
సర్వ ప్రపంచ హృదయాలలో  నిలిచిన రాజర్షి..
కోరస్:-
***
 మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

ప్రజా సేవకుడై  సమాజమే దేవాలయం అన్న కధా నాయకుడు 
ప్రజలే నా దేవుళ్ళని   సంక్షేమానికే పునాదులు వేసిన మనుషుల్లో దేవుడు 
జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిన సాహసవంతుడు 

మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

కోరస్:-
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వం మెచ్చిన చండ శాసనుడు 
విశ్వనరుడై వెలుగొందిన విశ్వరూపం ఆటగాడు
చరణం:-
క్రమశిక్షణ తో నడిపించిన బడిపంతులు 
ఆకాశమంతగా ఎదిగిన అదృష్టవంతుడు 
కాలంతో పరుగెత్తె పెత్తందారలను అరికట్టిన సింహబలుడు 
ఎవ్వరు అందుకోలేనంత  కీర్తి నే పొందిన దాన వీర సూర కర్ణుడు 

రామ నామధేయుడై  
నందమూరి ఇంట జన్మించాడు 
ఆ రాముడే ఆదర్శమై
శ్రీ కృష్ణుడిలా చక్రం తిప్పాడు 
మా తారక రాముడు
మన తెలుగువారి ఆత్మగౌరవ నినాదమై తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రిగా ఏలినోడు 
తెలుగోల్లందరి గుండెల్లో పదిలంగా నిలిచిన జగదేక వీరుడు 
 పల్లవి:-
***
విశ్వం మెచ్చిన మనిషి
విశ్వనరుడై నిలిచిన మహామనిషి.
చరణం:-
***
సంఘసంస్కర్తగా మంచికి మరోపేరుగా 
పట్వాడి వ్యవస్థ నే భూస్థాపితం చేసాడు 
ఆడపడుచులకు అండ దండగా
ఆస్తి హక్కు కల్పించిన మర్మయోగి 

ఉచిత కరెంటు ఇచ్చి 
పేదోడి గుడిసెల్లో వెలుగై నిలిచాడు 
రెండు రూపాయల కే 
బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి
ఇంటింటికి అమ్మై అన్నం పెట్టిన 
అన్నపూర్ణ గా నిలిచాడు 

ఓ మా నందమూరి  
తెలుగు దేశ విజయ భేరి మ్రొ 
 గించిన రాముని మించిన రాముడు 

ఓ నటరత్న
ఓహోహో  మహా నాయకా
తెలుగు నాడులో
విజయ బావుటా ఎగరేసి
చరిత్ర సృష్టించిన యుగపురుషుడు 

చిన్ననాటి స్నేహితులతో జీవితచక్రమ్, మేలుకొలుపుగా శ్రీ నాధుడు 
ధరిత్రిలో చెరగనిది నీ చరిత
మీతోనే  మా నవ శకానికి నాంది పలికాడు 
మా దేవుడవయ్యావు ఆ దేవుని చెంతకు చేరి
నిత్యం మము  దీవిస్తున్నావు .. 
 సత్యః ప్రభోదిస్తున్నావు..

ఈ మీ శత జయంతి రోజు మీ నామస్మరణం
అరుణోదయ గీతమై అణువణువు పలుకుతోంది
ఆత్మీయ రాగం.. ఆత్మీయ రాగం
పల్లవి:-
****
 విశ్వం మెచ్చిన మనిషి
 విశ్వ నరుడై వెలుగొందిన మహా మనిషి.
************

**********
నేటి నా పాట  సంఖ్య:
**********
రచన:- మల్లాప్రగడ రామకృష్ణ 
******
పాట సందర్భంపై నా విశ్లేషణ:-. ********** అందరూ కలసి ఉగాది పాట .
************** 
పల్లవి:-
****
రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 

ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    

ఎన్నెన్నో అందాల నెల ఇది  
ఈ బృందావన చందనం  మనఅందరిది 
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను తలపించేది 
కొత్త వంట, వస్త్ర అపురూప ఘట్టము ఇది 
ఆనందాల యుగాది వేదిక  వీక్షణం   !!

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు
         
చరణం:-
****
అదృష్టమే మా అందరి ఆనందం 
ఆకాసాన దిగివచ్చిన దేవతల మయం 
ఆనందమే మా లోగిలై సుందరానంద మకరందం  
హరివిల్లులా  విరబూసిందోయి యుగాది వేదిక  వీక్షణం

ప్రకృతి  వీడి ఉండలేము మేము 
పంచాంగం వినందే ఉండలేము 
పదహారణాల తెలుగింటి  వారసులం 
మా అందరి కలయిక మనో ఉల్లాసము  
ఉరుకుల పరుగుల లేవు యుగాది వేదిక  వీక్షణం

పల్లవి:-
**
చరణం:-
***
మేము ఒక్కరొక్కరమే కలసియు 
రసాబసా మవకుండా హృదయాన్ని తలపించియు 
అనుభవజ్ఞులు చెప్పినది అక్షర సత్యమని నేమియు 
అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము యుగాది 

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 
ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    
*************

Monday 6 March 2023

 🕉 pranjali Prabha  మన గుడి : 01

     చిత్తూరు జిల్లా , andhra pradesh  🕉

*కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం..*

🕉 మన గుడి  : 01🕉

🔅 చిత్తూరు జిల్లా :  కాణిపాకం

🔅కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం

 తిరుమలపై కోనేటి రాయుని కోనేటి రాయని దర్శించుకున్న భక్తులు  కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ స్వామివారి మహిమలు అనంతం. 

ఎందరో భక్తులు వినాయకుడి మహిమలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాణిపాకం ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరు, పోలీసులకు ఫిర్యాదు చేయరు. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిసాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతడి పని పడతాడని భావిస్తారు.

 కాణిపాకంగా మారిన విహరపురి : చరిత్ర,  విశిష్టత. 

కాణిపాకం క్షేత్రం  ఒకప్పుడు విహరపురి గా పిలువబడేది.

కాణిపాకం పేరు వెనుక అసలు రహస్యం.. 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.

టెంకాయ నీళ్ళు కాణి భాగం అంతా ప్రవహించడం వల్ల కాణిపాకం అయింది

 ప్రకృతి వైపరీత్యాల వల్ల విహరపురి తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. వరదలు వచ్చి, బహుదా నది పొంగిపొర్లడంతో ఆలయంలోని వరసిద్ధి వినాయకుడు బావిలోకి జారి, అక్కడే ఉండిపోయాడు.

 విహరపురి ఈ వరదల నుండి కోలుకుంటుండగానే అనావృష్టి సంభవించి పట్టణం మరుభూమిగా మారిపోయింది. 

ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా కలిసివెలసి జీవిస్తున్న ముగ్గురు మిత్రులకు కాణి పొలం వుండేది.

 కాణి అంటే 1.3 ఎకరం. వీరిలో మొదటివాడు గుడ్డి, రెండవవాడు చెవిటి, మూడవవాడు మూగ. వీరికి పుట్టుకతోనే ఈ వైకల్యాలు సంభవించాయి. పంట వేయడానికి అవసరమైన నీటి కోసం బావిని లోతు చేయడానికి చెవిటి, మూగ మిత్రులు చేతిలో గునపాలతో బావిలోకి దిగారు. గుడ్డి మిత్రుడు మాత్రం గట్టునే ఉండిపోయాడు. మిత్రులిద్దరూ గునపంతో పోటు వేయగానే ఠంగ్ మన్న శబ్దం వచ్చింది. వెంటనే వెచ్చటి రక్తం పైకి చిమ్మింది. ఈ రక్తపు చుక్కలు మీద  పడగానే చెవిటి మిత్రునికి మాట వినిపించింది. మూగ మిత్రునికి మాట వచ్చింది. ఇది భగవంతుడి మహాత్మ్యమని తెలుసుకున్న మిత్రులిద్దరు రక్తదారను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నెత్తుటి ధార ఆగకుండా ఇంకా పైకి చిమ్మి గుడ్డివాని కనులను తాకింది. వెంటనే వానికి చూపు వచ్చింది. వెంటనే అతడు రాజు వద్దకు పరుగుతీసి, జరిగినదంతా చెప్పాడు. అది విని రాజు తన రాణులతోను, దానదాసీజనంతోను, అక్కడకు చేరుకుని ఆ బావిలో లెక్కిలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిని శాంతింప జేశాడు. అలా బావి నుండి ఉబికి వచ్చిన కొబ్బరి నీరు కాణిపై పారింది. దాంతో విహారపురికి కాణిపాకం అనే పేరు సార్థకమై, క్రమంగా కాణిపాకంగా మారింది.

 సంతానం లేని దంపతులు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని, 11 లేదా 22, 41 రోజులు నియమానుసారం పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

ప్రతిఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో లక్షలాది మంది భక్తులు సత్యప్రమాణాల స్వామి దర్శనానికి వస్తుంటారు. 

చిత్తూరు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్యక్షేత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో వుంది.

 పెరుగుతున్న విగ్రహం

స్వామి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వున్నాడని భక్తుల నమ్మకం. దీనికి సాక్ష్యంగా సుమారు 50 సంవత్సరాల ముందు స్వామి వారికి చేయించిన వెండి కవచం నేడు స్వామి వారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ వున్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభువునిగా ఖ్యాతినొందారు.

 బాహుదానది చరిత్ర

వినాయకస్వామి వెలసిన బాహుదానదికి ఆ పేరు రావడం గురించి కూడా పురాణ కథవుంది. 

స్వామిని చూడాలని శంఖుడు, అంఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు.

దైవ లీలలో భాగంగా చేయని తప్పుకు అంఖితుడికి రాజుగారి ద్వారా చేతులు నరకమని శిక్ష పడింది. 

భటులు రాజు ఆజ్ఞ ప్రకారం అంఖితుడి చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన శిక్ష పడటంతో దు:ఖంతో తమ్ముని వెంటబెట్టుకొని శంఖుడు కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వెళ్ళాడు. 

దైవదర్శనానికి ముందుగా అక్కడ నదిలో స్నానమాచరిస్తుండగా ఖండించిన అంఖితుని చేతులు తిరిగివచ్చాయి.పోయిన బహువులు తిరిగి వచ్చిన కారణంగా ఆ నదికి బహుదానదిగా పేరు వచ్చింది.

 శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాంగణంలో వుండటంతో కాణిపాకం క్షేత్రాన్ని శివవైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు...

****

* అపూర్వ శాస్త్రాలు *

 

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

 

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

 

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

 

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన

నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

 

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

 

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల

శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక

విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

 

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

 

🌼 7.విషశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార.

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

 

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

 రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు

ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే

ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు

చెప్పబడ్డాయి.

 

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను

పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా

విభజించి తర్కించారు.

 

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో

తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

 

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో

వివరించారు.

 

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

 

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల

పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

 

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,

సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,

 కుమారస్వామి రచించిన గజశాస్త్రం,

 భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,

 ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

 

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?


వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు  ఇది వాట్సాప్ లో సేకరణ మీరు చదవగలరు  

🌼 ఓం నమః శివాయ