Sunday 28 May 2023

తరుణోపాయం కథ 2 (26-05-23)

ఒక అడవిలో ఒక సింహం అనేక ఇతర జంతువులు నివసిస్తున్నాయి.ఆ అడవికి సింహం రారాజు.అదిరోజు దొరికిన జంతువులను దొరికినట్లుగా తింటూ అన్ని జంతువులను భయభ్రాంతులకు గురిచేస్తుండేది.జంతువులన్ని ఒకచోట సమావేశమై ఎలాగైనా సింహం పీడను వదిలించుకోవాలని తీర్మానించుకున్నాయి.అందుకోసం అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి.

                                    ఇదిలావుండగా సింహం ఒక రోజు పంటి నొప్పితో విలవిల్లాడుతూ  "ఈనొప్పి ఎలా తగ్గించుకోవాలి" అని నక్కను సలహా అడిగింది.అప్పుడు నక్క" మృగరాజ!ఈ అడవిలో కొంగను మించిన డాక్టర్ ఎవరు లేరు.డాక్టర్ కొంగ మీ పంటి నొప్పికి సరియైన చికిత్స చేయగలదు.వెంటనే మీరు కొంగను పిలిపించండి".అని సలహా యిచ్చింది.

                                   సింహం ఆజ్ఞతో డాక్టర్ కొంగ పరిగెత్తుకుంటూ వచ్చి సింహం నోటిలో పళ్ళను పరిశీలించి, "రాజా మీ నోటిలో నాలుగు పళ్ళు పుచ్చిపోయాయి ఆనాలుగు పళ్ళు తీసివేస్తే మీబాథ తగ్గుతుంది, కాని మీరు అందవిహీనంగా కనబడతారు అందుకని మీ పళ్ళను మొత్తం తొలగించి మరళ కొత్త పళ్ళను కట్టిస్తాను అప్పుడు మీ పంటి బాధ తగ్గటమే కాకుండా మీరు మరింత అందంగా కనిపిస్తారు మీరు సరే అంటే చికిత్స ప్రారంభిస్తాను"అని అన్నది.

                                    సింహం సరే అనగానే కొంగ సింహం నోటిలోని పళ్ళను మొత్తం ఒక్కొక్కటిగా పీకివేసింది.కొత్తపళ్ళవరుసనుకట్టి "ఇదిగో రాజా నీ కొత్త పళ్ళవరస దీనిని దగ్గరలో వున్న  నదిలో  ముంచుకొని తీసుకు వస్తాను అలా చేస్తే నీవు జంతువులను చంపుట వలన కలిగే పాపానికి నిష్కృతి లభిస్తుందని నాకు ఒక మునిపుంగవుడు సెలవిచ్చాడు కావున నేను త్వరగా నది వద్దకు వెళ్ళి తిరిగి వస్తాను ,అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి వెళ్ళింది.

                  మరింత అందంగా తయారవుతాననే భ్రమల్లోవున్న సింహం, కొంగ ఎంతకూరాకపోయేసరికి,ఆకలికి తాళలేక వేటాడలేక నీరసించి నీరసించి చిక్కిశల్యమై,చివరికి చనిపోయింది.సింహంపీడ విరగడైనందన అన్నిజంతువులు ఎంతో సంతోషించాయి.కొంగతెలివిని మెచ్చుకున్నాయి.

నీతి: ఉపాయంతో ఎంతటి అపాయాన్నైన తప్పించుకోవచ్చు.

88---

ప్రాంజలి ప్రభ -- రోజుకొక కధ చదవండి - చదవమని చెప్పండి (27 -05 -2023 ) 

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు   (ఒక వాస్తవ గాథ)

          అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు.

బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు వెళ్లేవాళ్ళే. 

ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలిని టికెట్టు తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.

బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది. వానాకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో..?

అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా!"

ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కునుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది? ఆమెకు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు..?

ఒంటరిగా ఉన్న ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే..?

ఇంతలో ముసలామె దిగే ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .

కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.

బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. 

కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.

అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.

"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు?" అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్  ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి! బస్సును నడపండి!" అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కిఆదేశాలు ఇచ్చారు.

"నాయనా! నీ పేరేంటి?" అని కండక్టర్ని అడిగింది ముసలామె.

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?.. నా పేరు మహాదూ వేంగుర్లే కర్.”

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా?"

"మాల్‌ వన్." అన్నాడు కండక్టర్ ."నీకు సంతానం ఎంత మంది?"

"ఇద్దరు" అన్నాడు కండక్టర్ .

ఇంతట్లో ముసలవ్వ ఇంటిని(పూరి గుడిసె ను) చేరుకున్నారు. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.

ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది. ఆమెకు దగ్గరి బంధువులు అనేవాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!

ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది.  భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.

ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా, వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను. కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌' బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరిట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేలరూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మలకోసం వాడుకోండి. నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను." అని అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.ఇదేంటి సమస్య? ఈ మహాదు వేంగుర్లే కర్ ఎవరు? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ దగ్గర  సెలవు తీసుకొని వెళ్లి పోయారు.            

రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ కన్నుమూసింది.ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్ని పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్, కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కానుక కండక్టర్ కి అన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది విన్న సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.

మహాదూ వేంగుర్లే కర్     పిలిచిన తారీఖున ఆఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. 

అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తనపేరట వ్రాయటం అతడికి మతి పోయినట్లు అయింది.!

అక్కడ సమీపం లో   పిల్లల గోల వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా?" అని అడిగాడుకండక్టర్.

"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తోంది." అనిచెప్పాడు సర్పంచ్ . 

"ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.

"ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ ముందుకు రావటం లేదు." అని జవాబిచ్చాడు సర్పంచ్.

వెంటనే కండక్టర్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ - "ఇదిగో సర్పంచ్ గారూ పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరిట బడికి ఒకదివ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి. మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి." 

గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరంవెంబడించింది.

చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదేఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.మనం జీవితంలో ఒకరికి చేసిన చిన్న, పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.

మనిషి మనిషి కి  మధ్య  మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు 

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

****

ప్రాంజలి ప్రభ వారి నేటి కథ
(2)...28=05=2023
జీవన సత్యం

వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. మనమే ఒక రోడ్డు వేసుకుని వెళ్ళడం కష్టం. అమ్మ చందమామను చూపించి బువ్వ తినిపిస్తుంది. జ్ఞాని దేవుణ్ని చూపిస్తాడు. చివరికి అతడే గురువుగా మిగిలిపోతాడు.

దేహం - అణువుల సముదాయం.
మనస్సు - ఆలోచనల సముదాయం.
బుద్ధి - అవగాహనల సముదాయం.
ఆత్మ - అనుభవాల సముదాయం.

 మంచివాళ్లు. ఆదర్శవంతులు ఒక మార్గం చూపిస్తారు. ఆ దారిలో మనం వెళ్తే జీవితం ఎక్కువ కష్టాలు లేకుండా సాగిపోతుంది.

ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.

 నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..

కాలం మనతోనే ప్రారంభం కాలేదు.
మన ముందు ఎందరో ఉన్నారు. గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి చూపించారు. అందువల్ల మనకు ఒక దారి ఉంది. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళిపోదాం! అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను. అవరోధాలను పరిష్కరించి, రాబోయే తరాలకు మన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నామో చూపిద్దాం.

జననం అంటే?  కార్యంగా 'ఉండడం'.
మరణం అంటే? గుప్తంగా 'ఉండడం'.
మోక్షం అంటే? లీనమై 'ఉండడం'.

మార్గం వేరు, లక్ష్యం వేరు. సరైన మార్గం ఎన్నుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. మనం ఎంతో అదృష్టవంతులం. మన ముందు తరాలవారు మనకు ఎన్నో ఉపాయాలు, పరిష్కారాలు, కిటుకులు అందించారు. భయపడకుండా అడుగు వేసుకుంటూ వచ్చేయండి. మీకు మేమున్నాం అని. వాళ్ల అనుభవాల చరిత్ర భరోసా ఇస్తోంది. వారికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం కూడా ఎంతో కొంత కృషిచేసి, మన పని చేసుకుంటూ ఆదర్శప్రాయమై ఇతరులకు నాలుగుదారుల
కూడలిలో దీపాలు వెలిగించాలి. వెలుగు భావితరాలకు కనిపించాలి. వాళ్ళు మనకు అభినందనలు తెలపాలి. ఇదే జీవితం వెళ్ళేవారు వెళ్తుంటారు. వచ్చేవాళ్లు వస్తుంటారు. ఎవరి అనుభవాలు వారివి. చివరికి అందరికీ కొన్ని అరుదైన అనుభవాలు శాశ్వతంగా మిగిలిపోతాయి.

భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!

 యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!

మరణించిన తరవాత లోకంలో శాశ్వతంగా ఎలా ఉండిపోవాలో తెలియజేస్తోంది భగవద్గీత. ఎలా బతికితే శాశ్వత పరంధామ పథం పొందగలమో కూడా వివరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు మనకు చేసిన మహోపకారం భగవద్గీత ద్వారా చూపిన జ్ఞాన మార్గం.. మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మహా గ్రంథాలు, మహానుభావుల అనుభవాలే మనకు దిక్సూచి, వారి కార్యాచరణే మనకు శిరోధార్యం. వారి నిబద్ధతే మనకు ప్రాణసమానం. వాళ్లే మన ఊపిరి. వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

జీవుడిలో దేవుడు దాగి జీవుడితో ఆట ఆడుతున్నాడు.

ఇప్పుడు జీవుడు దేవుడిలో దాగి ఆ ఆట దేవుడిదే అని నిశ్చింతగా ఉండాలి.

తాతముత్తాతలు ఆస్తులు ఇస్తారు. తల్లిదండ్రులు సంపాదించినవి ఇస్తారు. కాని, వెలకట్టలేనివి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అవే మనకు విలువైన సంపద. తరగని ఆస్తి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాముడంటే తెలియని ఒక ప్రదేశంలో పుడితే, రామాయణం కూడా తెలియదు. దాని గొప్పదనం తెలియదు. మన ముందు నడిచిన మహానుబావుల అడుగుజాడల్లో నడవాలి. దైర్యం విడిచిపెట్టకూడదు. వీరులు వాళ్లు. మన సుఖం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. యుద్ధాలను ఆహ్వానించారు. విజయం సాధించారు. శాంతిని అందించారు.
కర్మఫలం కర్మ చేసిన వానికి మాత్రమే చెందదు. ఆ ఫలం ప్రపంచంలో ఉన్న సకల చరాచరానికి పంచబడుతుంది.. అంటారు గురువుగారు.

 వాన చుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...

ఆదే దారిన పడుతూ లేస్తూ అయినా వెళదాం. వెయ్యిసార్లు కిందపడినా,
మళ్ళీ లేచి నిలబడదాం. ఒక కొత్త వెలుగును లోకానికి చూపిద్దాం!

రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము

 మొదటి కలయిక -  క్షణికానందము.
 రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
***
నిజమో అబద్ధమో మీరేచెప్పండి ప్రాంజలి ప్రభ కథ... (3) 29=05=2023

నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే , నీ బాధను పంచుకునే వారికేఎక్కువ విలువ ఇవ్వు.     
ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు  కాని బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. నిజమా 

కులం పోవాలని చెప్పేది మనమే..
కులం చూసి ఓటు వేసేది మనమే..
అవినీతి పోవాలనేది మనమే..
అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే.. నిజమా 

సమాజంలో మంచిని స్వీకరించి  చెడును వదిలి వేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేదే  "విద్య" అదే మన అందరి బంగారం, బంగారం పంచలేకపోయినా విద్యను పంచుదాం. నిజమా 

ఇంటికో రాముడు పుట్టాలని చెప్పేది మనమే..
మన ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవి పుట్టాలని కోరుకునేది మనమే..
మార్పు రావాలని చెప్పేది మనమే..
అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరి పోసేది మనమే..నిజమా 

మనం చేసిన మంచిని మర్చి పోవాలి. మనకు మంచి చేసిన వారిని మాత్రం జీవితాంతం మర్చి పోకూడదు.
   
గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారి తోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితోనూ పోల్చుకోవాలి. వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.   
ఉన్నది చాలనుకుంటే మనకెంతో తృప్తి. ఒకరిది వద్దనుకుంటే మదికెంతో సంతృప్తి నిజమా 
     
రేపటి అందమైన భవిష్యత్తు కోసం  మన మనస్సును ఎల్లప్పుడూ మంచి విషయాలతో నింపుకోవాలి.అదియే అందరికీ శాంతి సౌభాగ్యలు నిచ్చె సంతృప్తి

అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........
వెర్రి గొర్రెలు..కాదు కాదు తెలిసిన మూర్ఖులం నాకెందుకు అనే చవటలం...నిజమా 

  అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని
 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం. నాగరికతను పాటిస్తాము ఏ ఎండకు ఆ గోడుకు పట్టె మనుష్యులం. మాటమీద లేని మనుష్యులం. నిజమా 

​ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు ఒకనాడు జరుపుకుంటాం.​ కాదండో మారింది ఉప్పుడు దీపాలు వెలిగిస్తున్నారు కొంత మార్పు మానవలోకం. నిజమా 

​మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.​ అందుకే చెడు వేగంగా మనిషిని చేరుతుంది మంచి నిదానంగా మార్పు చూపిస్తుంది. నిజమా 

​ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.​
ఇప్పుడు ఒకేచోట పాలు, బ్రాందీ అమ్మే ప్రభుత్వాలు కొనే మనుష్యులున్నారు నిజమా.

​ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.​ ఎందుకంటే అజీర్తి రోగం రాకుండా. నిజమా 

​ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.​
ఎవరి స్వార్ధం వారిది, వారిమతం వారికే గొప్ప నిజమా 

​దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు -నిత్యందైవణామం చేస్తాడు, ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.​ దైవాన్నే మోసాగిస్తాడు. నిజమా 

​విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.​ అంటే తీరం దాటాక తెప్ప తగ లేసే మనుష్యులు కదా నిజమా 

​ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!​ 
నిజమె కదా.....

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
....
30-05-2023
కూతురు

కూతురు అమెరికాలో , అమ్మ హనుమకొండలో , కొడుకు ఇంగ్లండ్ లో, తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్, నాన్నకేమో క్రైసిస్ , నువ్వు వీసాపై ఎక్కడో అమ్మ అంపశయ్యపై 
నువ్వు రావు, రాలేనంటావు, నిజానికి రావాలని అనుకోవు, టికెట్ దొరకదంటావు..
సెలవు లేదంటావు..
వస్తే తిరిగి రావడం కష్టమంటావు..
నువ్వు వచ్చేదాక అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు  గుమ్మం వైపే..
రావని తెలిసినా  నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక..
కక్కలేక..మింగలేక..
మంచం చుట్టూ అటూ ఇటూ అవతల ఆ తల్లి ఇంకాసేపట్లో అటో ఇటో..
వయసు వచ్చినప్పటి నుంచి డాలర్ డ్రీమ్సే..
పొద్దున లేస్తే ఆ ఊసే..
నీ కలల వెనకే తల్లిదండ్రుల పరుగు..
వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ..
గుండె బరువుతో వారిక్కడ..
మొదట్లో రోజూ ఓ వాట్సప్ కాలు రెండ్రోజులకో వీడియో ఫోను పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు అప్పటికే  నిద్ర లేచి ఉంటాడు నీలో ఓ మాయలోడు...
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు ఇక్కడ డొక్కు స్కూటర్ తో తంటాలే నాన్నకి ప్రతిరోజు..
ఈలోగా అన్నీ బాగుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదంటే అక్కడే ఓ భామతో మేరేజ్..
ఆలికి కడుపో కాలో వస్తే ఆయాగా అమ్మకి వీసా నాన్నకి నేను డబ్బులు పంపుతాలే 
అని భరోసా..!
ఎంత అమ్మయినా, నీ పిల్లలకు నాన్నమ్మయినా, ఆమె నాన్నకు భార్య అక్కడ పెద్దాయన 
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని ఒకటే బెంగ..
ఆ దంపతులను అలా వేరుగా ఉంచి మీ జంట మాత్రం టింగురంగ..
మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది ఆమె వీసా గడువు..
ఆమె చేతిలో టికెట్, నాన్నకిమ్మంటూ ఓ గిఫ్టు పేకెట్..
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక అటు భర్తని విడిచి ఉండలేక చెమ్మగిల్లిన కళ్ళతో విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..
నువ్వు పంపుతావేమో..
కాని ఆ వయసులో నాన్నకు శ్రమ..
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..
వచ్చే ప్రాణం..పోయే ప్రాణం చివరకు అనివార్యమయ్యే మరణం..
వాడు వస్తున్నాడా.. ఏమంటున్నాడు..
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ..
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ..
కొరివి పెట్టాల్సిన నువ్వు సీమలో నాన్న కర్మ చేస్తుంటే ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..
అస్తికల నిమజ్జనం అంటూ నాన్న కాశీకి పయనం అంత శ్రమ ఎందుకు..
పక్కనే ఉంది కదా గోదారని నీ అనునయం..
ఇప్పుడిక నాన్న కథ 
ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లు ముఖ్యంగా ఆ ఇంట్లో అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక కష్టాలకు ఓర్వలేక..
ఓ రోజు502023న ఆయన కధా కంచికి…
ఈసారి వస్తావు కొరివి పెట్టి ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఉన్న ఊరు..కన్న తల్లి..
అన్నిటితో రుణం తెంచుకుని నేను ఎన్నారై..
మిగిలినవన్నీ జాన్తా నై..
అంటూ పుట్టిన గడ్డను వదిలి పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస ఇదే కదా చాలామంది వరస..!!
***
31--05--2023

అర్ధమయిందా ? ప్రాంజలి ప్రభ నేటి కథ          -                                                        -               *ఒక ఊరిలో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. *
ఒక చదువు రాని వ్యక్తి శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. "రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య. "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు ఆ వ్యక్తి ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని ఆ చదువు జ్ఞానం లేని వ్యక్తి చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.
* అప్పుడు ఆ భార్య ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది. ఆ వ్యక్తి వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. చూసావా ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. "నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.*
* అప్పుడు ఆ చదువు రాని వ్యక్తి ఇలా అన్నాడు "గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది.*

కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న  భర్తను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భార్య  అక్కడేం  చేస్తున్నావు అని *అడిగింది *..
        ....... *దానికి అతడు * .......
" *ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం  కూచున్నా అన్నాడు *,”
అర్థం కాక అయోమయంలో ఉన్న *భార్యతో * *భర్త * ఈవిధంగా *చెప్పాడు * ఏమిటంటే..
" ఆలి పోయిన వాడు "శ్రీరామ చంద్రుడు",
" వెతక బోయిన వాడు  "హనుమంతుడు"
" అతని తల్లి అంజనాదేవి,
 " ఆమె మొగుడు  వాయుదేవుడు.. 
అంటే "గాలి" కోసం, బాల్కనీ లో కూచున్నా అని "విసనకర్ర" తో విసురుతూ *చెప్పాడు * "...
మొగవాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు ఎక్కడచెప్పాల్సిన మాటలు అక్కడ చెపుతారు. అందరూ ఇట్లావుంటారని అనుకోకండి ప్రత్యేకంగా మావారు లాంటివారే.
నిజమేనా
మీ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
***

దివ్య శిల్పి

శిలా నీవే....
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో.....  
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... దైవంగా మార్చుకో....!!  

శిలా నీవే....
శిల్పం నీవే....!! 
ఇంకా....ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు....  
ఎన్ని జన్మలు...                                             ‌
శిలగానే... ఉంటావు,                                
శిల్పమెక్కడో  లేదులే.....                 
అది....నీ‌ లోనే‌....
నీ మదిలోనే ఉందిలే..... శిల్పం...!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
నీవే శిల్పానివి....                                    
శిలగా.... !
ఉన్న నిన్ను నీవుగా శిల్పంగా.... 
మలిచే  శిల్పి..... ‌
ఎవరో.... 
కాదులే.... 
అది నీవేలే....!!
అది నీవేలే....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవే శిల్పివి,  
నిన్ను నీవు...                                    
ఎరుక‌తో తెలిసుకో.... !                        
నీకు నీవే శిల్పివి....!!
నీలోనే ఉన్న శిల్పాన్ని   చూడు.....!
మబ్బుల మాటున  దాగిన... 
! చందమామలా...! 
మరుగున ఉన్నది....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీ మనసులోని అయుక్తాలను,
అరిషడ్వర్గాలను
తొలగించుమూ....! 
వ్యర్థాలను,
దుర్గుణాలను...
విసిరి పారవేసేయుమూ...!!
నిన్ను నీవు.... సరిగా  మలుచుకో....   అంతే,  ‌   
ఇక అదే శిల్పమే,
అందులోన దాగిన దైవమూ....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీకు నీవే...  కర్తవు,                           
నీకు‌ నీవే...   విధాతవు,     
 నీకు నీవే  శిల్పివి....                       
నీవే‌ సుందర శిల్పానివి....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవు... నీ వ్యక్తిత్వంను,                               
నీ జీవితంను,
నీ  జీవనం  సుందరశిల్పంగా మలచుకో....
మానవా,  ఓ మానవా....!!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

మహా శిల్పీ ఓ మానవతా శిల్పీ....
ఓ దివ్య శిల్పీ       ‌మేలుకో....
నిన్ను నీవు దైవంగా మలుచుకో....!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో..... ! 
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... !
దైవంగా.. మార్చుకో....!!  
***


Sunday 19 March 2023

 


26/05/2023.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
నేటి యువతలో ఉన్న లోపాలను సరిచేసేలా 
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసనలు చూడనేలా ప్రగల్భాలు గొప్పలు చెబుతే సరిపోదంటు 
గుండెల నిండా ప్రశ్నించే దమ్ముండాలంటు  యువతలో కదలిక తెచ్చి చైతన్య పరచి  నేడు రేపు నాదే నంటు
ఉత్సాహంతో విశ్వాసంతో ముందడుగు వేయించేలా
సాగే పాట. అడుగడుగులో  సత్తా చాటేలా మునుముందు కు సాగించి సాహసం చేయమంటు
సమాజం నీదంటు  చాటి చెప్పే పాట.!!
***********
పల్లవి:-
***
ప్రశ్నించడం తెలియదే జవాబు వివరంచడం రాదే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావో చెప్పలేదే, దేశ కుటుంబాన్ని అర్ధం చేసుకోలేదే, 
ప్రజ్ఞ ఎలా అబ్బుతుందో తెలుసుకో ముందుగా, ధైర్యంగా తప్పుతప్పని, సత్యము సత్యమని వాదించడం నేర్చుకో.. నేర్చుకో.. నేర్చుకో 

ఆజ్ఞాపించడం అర్హత అనుకోవద్దులే 
ఆగ్రహించడం  చేవ ఉన్నవాడి లక్షణం అనకులే 

నోరుందనో  జేబులో డబ్బుందనో
గొప్పోడివనుకునే రోజులైతే కాదులే
అందరిలో నీ ఒకడి వని మరచి ప్రవర్తన ఎందుకులే 

 ప్రశ్నించడం చేతకానోడివై 
 ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే .
చరణం:-1
***
పనిచేసేవానికి తిండి కరువయ్యే రోజులే
పలుకరింపులతో మాయ చేసె రోజులే 

పైపై మాటలు  విని
సలాం కొట్టే జనాలు లేరులే 
కష్టించే తత్వానికి ఇష్టపడేవారే లేరులే 

నష్టనివారణ చర్యలు చెప్ప లేవులే 
నీ సత్తా ఏమిటో  తెలిప లేవులే 
పిల్లిని చూసి పులి అనే స్వభావం గల వాడివి లే 

రేపటి రోజు నీదని చెప్ప లేవులే 
నేటి రోజుపై పట్టు సాధించవులే 
పట్టు పట్టడమంటే తేనెతుట్టేలా ఉండాలిలే 
పట్టుదల పై సవారి చేయ లేవులే 
 పల్లవి:-
***
ప్రశ్నించడమే చేతకానోడివిలే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే 
 చరణం:-2
****
భుజం భుజం కలిపి నడిపించే చొరవ లేదులే 
జనంలోకి చొచ్చుకుపోయే తెగువ లేదులే 
నువ్వు కావాలిరా ఆ ధైర్యం నిలవాలిలే 

భజన పరుల పూజలను   
దరికే రానీవకులే 
నిన్ను నీవు నమ్మి ముందుకు సాగ వలే 
నీవు చేసే పని ఎన్నటీకి వమ్ముకాదులే
నమ్మకమే నీకు బలము అని తెలుసుకోవాలిలే 

 కాలం ఎప్పుడు సవాళ్ళ వెంట ఉండును లే 
 భయమే లేకుండా కదలాలిలే 
గాయం అయినపుడు మందుగా మారాలిలే 
న్యాయం వైపు నడువు విజయం నీదవుతుందిలే 
 
గమ్యం ఎంత దూరమైనా
నిర్ణయం నీదే కావాలిలే 
బాధైనా బఢభాగ్నైనా  లెక్కే చేయక నడుం బిగించాలిలే 
పక్కా ప్రణాళికతో  నిక్కచ్చిగా  ముందడుగు వేయాలిలే 

 జయము జయము నీదే  విజయ లక్ష్మి నీదే కావాలిలే 
 జయము జయము నీవే ప్రజలంతా నీ వెంటే ఉంటారులే 
 పల్లవి:-
***
 ప్రశ్నించడమే చేతకానోడివి కావులే 
 ప్రపంచాన్ని ఎలా ఏల గలవు తావులే 
 ************

 రచన:-
27/05/2023. *****  పాట సందర్భంపై నా విశ్లేషణ.
****౮****
ప్రేమలో పడినపుడు ఆ  ప్రేమికుల హృదయం ఎలా ఒకరికై ఒకరు పరితపిస్తారు ఎలా  ఒకరి సాంగత్యాన్ని ఒకరు కోరుకుంటు  ప్రశంసించుకుంటు   ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుపుతు  ప్రకృతి తో పోలుస్తు తన సంతోషాన్ని తెలుపుతు ప్రేమలో లీనమై పిడుకుంటున్న ఈ పాట.
*****************
పల్లవి:-
***
ఓనమాలు నేర్పవా 
ఓర్పుచూపి ఆదుకోవా
ఓటమిలోని విజయాన్ని అందించవా  
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో

ప్రతి క్షణం  నీ స్మరణై 
నన్ను వెంటాడుతున్నదే 
నాహృదయంలో నేవి  
మనసంతా  వేణువై  పాడేనులే..

ఆహహా  ఆహాహా

ప్రియతమా  నిను చూచిన క్షణమే
అనురాగాన్ని అందించాలని 
ఆశపడ్డా నీపైనా, 

మధురమా మనోరమా మానస వీణ  
నీ ప్రేమ పొందిన భాగ్యమే నేనై
సౌఖ్యమెంతగానో పొందానులే..
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
****
పిలిచినంతనే పలికే దేవతవే
పలుకంగనే వరమై కురిసి
చేరుకున్న  చిరునవ్వువే

అలలా ఎగసినావు   
కలనే కరిగించినావులే...

వలపే రుచి చూపినావు
తలపుల్లో  తిష్టవేసినావే...

వరుడవై పక్కన చేరి గిలిగింతలతో 
చలి మంటలు రాచేసినావురా  నాలోనా...
పల్లవి:-
**
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
***
వెచ్చని నీ ఒడిని వీడలేకుండే
బానిసగా మార్చేసినావులే..!!

స్వచ్ఛమైన  పుట్టతేనెవే
నీ అధరములే అమృతధార లే
జాలువారినా  పెదవులను ముద్దాడినాకే
తెలిసిందిలే  అమరత్వమే సాధించినానని..!!

ఏమైనా సరే    ఏదైనా సరే
నీవు నా తోడైనందుకు కృతజ్ఞతగా 
నా  కౌగిళినే  కానుకగా ఇస్తున్నా మన్మధా
ఆ జాబిల్లి సాక్షిగా...
 పల్లవి:-
****
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
********
28/05/2023.
*****
 పాట సందర్భంపై నా  విశ్లేషణ.
***********
 ఎందరో మహానుభావులు   ఆ మహానుభావులందరికి లోకి   మహానుభావుడు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి  తారక రాముడు.  వంద సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ భూమి పై పుట్టిన   గొప్ప తేజం సంకల్ప స్వరూపం.సుఃదర రూపం   పరిపూర్ణ మహోన్నత వ్యక్తిత్వం. చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించుకున్న 
దివ్య భవ్య విశ్వ రూపం నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా
 ఈ పాట.
*౮**************
 పల్లవి:-
****
విశ్వం మెచ్చిన తిరుగు లేని మనిషి 
విశ్వ నరుడై వెలుగొందిన  ఎదురులేని మనిషి
సర్వం తెలిసిన బంగారు మనిషి 
ఆంద్రావనికే ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహర్షి.బ్రహ్మర్షి 
కోరస్.
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వ విఖ్యాత నటరత్న, పద్మశ్రీ నాట సార్వభౌముడై 
సర్వ ప్రపంచ హృదయాలలో  నిలిచిన రాజర్షి..
కోరస్:-
***
 మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

ప్రజా సేవకుడై  సమాజమే దేవాలయం అన్న కధా నాయకుడు 
ప్రజలే నా దేవుళ్ళని   సంక్షేమానికే పునాదులు వేసిన మనుషుల్లో దేవుడు 
జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిన సాహసవంతుడు 

మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

కోరస్:-
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వం మెచ్చిన చండ శాసనుడు 
విశ్వనరుడై వెలుగొందిన విశ్వరూపం ఆటగాడు
చరణం:-
క్రమశిక్షణ తో నడిపించిన బడిపంతులు 
ఆకాశమంతగా ఎదిగిన అదృష్టవంతుడు 
కాలంతో పరుగెత్తె పెత్తందారలను అరికట్టిన సింహబలుడు 
ఎవ్వరు అందుకోలేనంత  కీర్తి నే పొందిన దాన వీర సూర కర్ణుడు 

రామ నామధేయుడై  
నందమూరి ఇంట జన్మించాడు 
ఆ రాముడే ఆదర్శమై
శ్రీ కృష్ణుడిలా చక్రం తిప్పాడు 
మా తారక రాముడు
మన తెలుగువారి ఆత్మగౌరవ నినాదమై తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రిగా ఏలినోడు 
తెలుగోల్లందరి గుండెల్లో పదిలంగా నిలిచిన జగదేక వీరుడు 
 పల్లవి:-
***
విశ్వం మెచ్చిన మనిషి
విశ్వనరుడై నిలిచిన మహామనిషి.
చరణం:-
***
సంఘసంస్కర్తగా మంచికి మరోపేరుగా 
పట్వాడి వ్యవస్థ నే భూస్థాపితం చేసాడు 
ఆడపడుచులకు అండ దండగా
ఆస్తి హక్కు కల్పించిన మర్మయోగి 

ఉచిత కరెంటు ఇచ్చి 
పేదోడి గుడిసెల్లో వెలుగై నిలిచాడు 
రెండు రూపాయల కే 
బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి
ఇంటింటికి అమ్మై అన్నం పెట్టిన 
అన్నపూర్ణ గా నిలిచాడు 

ఓ మా నందమూరి  
తెలుగు దేశ విజయ భేరి మ్రొ 
 గించిన రాముని మించిన రాముడు 

ఓ నటరత్న
ఓహోహో  మహా నాయకా
తెలుగు నాడులో
విజయ బావుటా ఎగరేసి
చరిత్ర సృష్టించిన యుగపురుషుడు 

చిన్ననాటి స్నేహితులతో జీవితచక్రమ్, మేలుకొలుపుగా శ్రీ నాధుడు 
ధరిత్రిలో చెరగనిది నీ చరిత
మీతోనే  మా నవ శకానికి నాంది పలికాడు 
మా దేవుడవయ్యావు ఆ దేవుని చెంతకు చేరి
నిత్యం మము  దీవిస్తున్నావు .. 
 సత్యః ప్రభోదిస్తున్నావు..

ఈ మీ శత జయంతి రోజు మీ నామస్మరణం
అరుణోదయ గీతమై అణువణువు పలుకుతోంది
ఆత్మీయ రాగం.. ఆత్మీయ రాగం
పల్లవి:-
****
 విశ్వం మెచ్చిన మనిషి
 విశ్వ నరుడై వెలుగొందిన మహా మనిషి.
************

**********
నేటి నా పాట  సంఖ్య:
**********
రచన:- మల్లాప్రగడ రామకృష్ణ 
******
పాట సందర్భంపై నా విశ్లేషణ:-. ********** అందరూ కలసి ఉగాది పాట .
************** 
పల్లవి:-
****
రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 

ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    

ఎన్నెన్నో అందాల నెల ఇది  
ఈ బృందావన చందనం  మనఅందరిది 
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను తలపించేది 
కొత్త వంట, వస్త్ర అపురూప ఘట్టము ఇది 
ఆనందాల యుగాది వేదిక  వీక్షణం   !!

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు
         
చరణం:-
****
అదృష్టమే మా అందరి ఆనందం 
ఆకాసాన దిగివచ్చిన దేవతల మయం 
ఆనందమే మా లోగిలై సుందరానంద మకరందం  
హరివిల్లులా  విరబూసిందోయి యుగాది వేదిక  వీక్షణం

ప్రకృతి  వీడి ఉండలేము మేము 
పంచాంగం వినందే ఉండలేము 
పదహారణాల తెలుగింటి  వారసులం 
మా అందరి కలయిక మనో ఉల్లాసము  
ఉరుకుల పరుగుల లేవు యుగాది వేదిక  వీక్షణం

పల్లవి:-
**
చరణం:-
***
మేము ఒక్కరొక్కరమే కలసియు 
రసాబసా మవకుండా హృదయాన్ని తలపించియు 
అనుభవజ్ఞులు చెప్పినది అక్షర సత్యమని నేమియు 
అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము యుగాది 

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 
ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    
*************

Monday 6 March 2023

 🕉 pranjali Prabha  మన గుడి : 01

     చిత్తూరు జిల్లా , andhra pradesh  🕉

*కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం..*

🕉 మన గుడి  : 01🕉

🔅 చిత్తూరు జిల్లా :  కాణిపాకం

🔅కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం

 తిరుమలపై కోనేటి రాయుని కోనేటి రాయని దర్శించుకున్న భక్తులు  కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ స్వామివారి మహిమలు అనంతం. 

ఎందరో భక్తులు వినాయకుడి మహిమలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాణిపాకం ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరు, పోలీసులకు ఫిర్యాదు చేయరు. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిసాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతడి పని పడతాడని భావిస్తారు.

 కాణిపాకంగా మారిన విహరపురి : చరిత్ర,  విశిష్టత. 

కాణిపాకం క్షేత్రం  ఒకప్పుడు విహరపురి గా పిలువబడేది.

కాణిపాకం పేరు వెనుక అసలు రహస్యం.. 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.

టెంకాయ నీళ్ళు కాణి భాగం అంతా ప్రవహించడం వల్ల కాణిపాకం అయింది

 ప్రకృతి వైపరీత్యాల వల్ల విహరపురి తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. వరదలు వచ్చి, బహుదా నది పొంగిపొర్లడంతో ఆలయంలోని వరసిద్ధి వినాయకుడు బావిలోకి జారి, అక్కడే ఉండిపోయాడు.

 విహరపురి ఈ వరదల నుండి కోలుకుంటుండగానే అనావృష్టి సంభవించి పట్టణం మరుభూమిగా మారిపోయింది. 

ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా కలిసివెలసి జీవిస్తున్న ముగ్గురు మిత్రులకు కాణి పొలం వుండేది.

 కాణి అంటే 1.3 ఎకరం. వీరిలో మొదటివాడు గుడ్డి, రెండవవాడు చెవిటి, మూడవవాడు మూగ. వీరికి పుట్టుకతోనే ఈ వైకల్యాలు సంభవించాయి. పంట వేయడానికి అవసరమైన నీటి కోసం బావిని లోతు చేయడానికి చెవిటి, మూగ మిత్రులు చేతిలో గునపాలతో బావిలోకి దిగారు. గుడ్డి మిత్రుడు మాత్రం గట్టునే ఉండిపోయాడు. మిత్రులిద్దరూ గునపంతో పోటు వేయగానే ఠంగ్ మన్న శబ్దం వచ్చింది. వెంటనే వెచ్చటి రక్తం పైకి చిమ్మింది. ఈ రక్తపు చుక్కలు మీద  పడగానే చెవిటి మిత్రునికి మాట వినిపించింది. మూగ మిత్రునికి మాట వచ్చింది. ఇది భగవంతుడి మహాత్మ్యమని తెలుసుకున్న మిత్రులిద్దరు రక్తదారను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నెత్తుటి ధార ఆగకుండా ఇంకా పైకి చిమ్మి గుడ్డివాని కనులను తాకింది. వెంటనే వానికి చూపు వచ్చింది. వెంటనే అతడు రాజు వద్దకు పరుగుతీసి, జరిగినదంతా చెప్పాడు. అది విని రాజు తన రాణులతోను, దానదాసీజనంతోను, అక్కడకు చేరుకుని ఆ బావిలో లెక్కిలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిని శాంతింప జేశాడు. అలా బావి నుండి ఉబికి వచ్చిన కొబ్బరి నీరు కాణిపై పారింది. దాంతో విహారపురికి కాణిపాకం అనే పేరు సార్థకమై, క్రమంగా కాణిపాకంగా మారింది.

 సంతానం లేని దంపతులు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని, 11 లేదా 22, 41 రోజులు నియమానుసారం పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

ప్రతిఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో లక్షలాది మంది భక్తులు సత్యప్రమాణాల స్వామి దర్శనానికి వస్తుంటారు. 

చిత్తూరు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్యక్షేత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో వుంది.

 పెరుగుతున్న విగ్రహం

స్వామి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వున్నాడని భక్తుల నమ్మకం. దీనికి సాక్ష్యంగా సుమారు 50 సంవత్సరాల ముందు స్వామి వారికి చేయించిన వెండి కవచం నేడు స్వామి వారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ వున్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభువునిగా ఖ్యాతినొందారు.

 బాహుదానది చరిత్ర

వినాయకస్వామి వెలసిన బాహుదానదికి ఆ పేరు రావడం గురించి కూడా పురాణ కథవుంది. 

స్వామిని చూడాలని శంఖుడు, అంఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు.

దైవ లీలలో భాగంగా చేయని తప్పుకు అంఖితుడికి రాజుగారి ద్వారా చేతులు నరకమని శిక్ష పడింది. 

భటులు రాజు ఆజ్ఞ ప్రకారం అంఖితుడి చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన శిక్ష పడటంతో దు:ఖంతో తమ్ముని వెంటబెట్టుకొని శంఖుడు కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వెళ్ళాడు. 

దైవదర్శనానికి ముందుగా అక్కడ నదిలో స్నానమాచరిస్తుండగా ఖండించిన అంఖితుని చేతులు తిరిగివచ్చాయి.పోయిన బహువులు తిరిగి వచ్చిన కారణంగా ఆ నదికి బహుదానదిగా పేరు వచ్చింది.

 శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాంగణంలో వుండటంతో కాణిపాకం క్షేత్రాన్ని శివవైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు...

****

* అపూర్వ శాస్త్రాలు *

 

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

 

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

 

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

 

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన

నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

 

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

 

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల

శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక

విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

 

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

 

🌼 7.విషశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార.

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

 

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

 రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు

ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే

ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు

చెప్పబడ్డాయి.

 

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను

పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా

విభజించి తర్కించారు.

 

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో

తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

 

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో

వివరించారు.

 

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

 

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల

పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

 

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,

సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,

 కుమారస్వామి రచించిన గజశాస్త్రం,

 భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,

 ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

 

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?


వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు  ఇది వాట్సాప్ లో సేకరణ మీరు చదవగలరు  

🌼 ఓం నమః శివాయ


Thursday 23 February 2023

 

 



ప్రాంజలి ప్రభ... సమస్యను పరిష్కరించడం..... 01 -౦౩-2023

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

...

ఉ:: జీరయు కాదులే మగువ జేష్టలు మగ్గుత మారమేమియున్

నేరము ఏలనో ఇపుడు. నీడల పంచన సేవచేయుటన్

సారము నాది నీదియగు సాధణ శోధన చెందుటే అహం

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

.....


వర్ణన....28=02=2023

చేతి కలము   (పెన్ను)

🛑🛑🛑🛑🛑✳️👌👌✳️

తే. చిత్ర గుప్త వ్రాత కలము జీవ యాత్ర

మనిషి నడవడికల వ్రాత మనసు కలము

కథల వినికిడి యే వ్రాత కలము నిజము

తాళ పత్ర కంఠము వ్రాత తరతరాలు

.......


సమస్యా పూరణ: 27-02-2023

న్యస్తాక్షరి......... వా .. ర ... ణా  ... సి     పద్య పాదం చివర రావాలి      చివర రావాలి....

న్యస్తాక్షరి ఆటవెలది 


*...వారణాసినందు వారాహి వరమువా

రణము నందు  లలిత సైన్యధీర

కాశిపురిన తిరుగు కాలభైరవరణా

చిన్మ యాన శివవు చిత్రవాసి

సమస్యా పూరణ: దత్తపది27-02-2023

*క్యారె,జారె, ఆరె, ఖారె*

*మణి ప్రవాళము*
************
తే ..సౌమ్య సౌక్యా రెపరెపలు స్వారి చేయు
వినయ వనజా రెపరెపలు విద్య గాను
సహన విధి గా ఆ రెపరెపలు సమయ మేను
కదలె చెరఖా రెపరెపలు కాల చెక్ర
...........
తే. క్యారె పలుకులో అర్ధము కాదుకా దు
జారె అక్కడకు వినుము జాగు ఏల
ఆరె అర్ధమవనులేద ఆగు టేల
ఖారె మాంసమని అనకు ఖరము ఖరము
.........
తే. *క్యారె* బడుగుల వెతలను కనగ లేవ,
*జ్యారె*  కూడగట్టు జనుల సాయపడగ,
*ఆరె* బీదల నాదుకో యన్న మిచ్చి,
*ఖారె* వారితో సహపంక్తి గర్వముగను

న్యస్తాక్షరి.....

మాం
సా
హా
రం

పద్య పాదాది న రావాలి

🏵️🏵️🏵️
కం..మాంగళ్యబంధము ఇదే
సాంగత్యం ఇది సుఖముకు ఆ అపరంజీ
హారము జిలుగు వెలుగులుగా
రంజిల్లు మనసు హృదయము రమ్యచరితమే
.........

మాం ద్య మంటిన బుద్ధికి మంచి నేర్ప,

సా రముడిగిన భూమిని సాగు చేయ,

హా ల వ్యసనుడికి తెలుప పాల రుచి, త

రం బగునె యేరి కైన సారంగమందు!

****

హాల= సారా

సారంగము = భూమి

🔴🔴🔴25=02=2023

సమస్యను పరిష్కరించడం.......

కప్పకు సంపంగి నూనె కావలె వింటే


🙏🙏🙏

కప్పా కబురే నూతి న

చెప్పా దలిచే కధలను చిలిపి తలపుగా

కప్పకు తల శుభ్రతగను

కప్పకు సంపంగి నూనె కావలె వింటే

.........

కప్పము కట్టక తిరిగెడి

చెప్పక తప్పులన్ని యునె చేయ గలుగుటే

గొప్పగ పలుకులు తా వేం

కప్ప సంపంగి నూనె కావలె వింటే

........

న్యస్తాక్షరి.......  ధ ర్మ యు ద్ధం       ...... ....... .... 101  

******

తే. ధరణి మ్రాక్కి జీవిత గమ్య దరి దరి ధ మ

ర్మ మగు కళలన్ని అడవిలో రకరకముల

యురక నురుగుల జలములే యుదయం మగు యు

ద్దం అనుకరణంగ మనుషులే ధర్మ బ్రతుకు

.....

ఆ:: ధ ర్మ మార్గ మందు తప్పక జరుపు క

ర్మ లను, బ్రతుకు వరకు, మదిని కమ్మి

యు న్న మాయ పోయె నన్న తొలగు నిషి

ద్ధము లగు  తలపులును  తమకు తామె.

ప్రాంజలి ప్రభ ... వర్ణన.......... 24 -02 -2023

ఆంధ్ర మాత.( తెలుగు తల్లి) వర్ణన

......

తీరనివ్యధ అనుటేల తీరు ఆంధ్ర 

తప్పు తెలిసికొనిన జీవి తృప్తి వెతక

ధైర్య వచనాలు చెలిమిగా దైవ పూజ

నిగ్రహము నుంచి బ్రతుకులో నిజము తెలుగు

......

తే. అంధ కారము వల్లనే ఆంధ్ర మాత

కనులు విప్పినా చూడకే కదలి కదలి

శాప మిచ్చె కర్మలవల్ల శాంతి కరువు

ఆంధ్ర నుద్ధారణ జరుగు అదును బట్టి

......

తే:: చింత లేని ప్రభుత్వము చిత్రమిది యు

దగ్గ లేక కక్క నులేక ధరణి దూత

ఈ గతి అరణ్య రోదన ఈప్సి తమ్ము

ఆంధ్ర చదువుల అర్ధము ఆట యగుట

......

శ్రీ స్వచ్ఛసువర్ణప్రభాం ,

శ్రీస్వామిప్రియతమహృత్స్థాం ,  వనజామ్..

భాస్వద్భాస్కరకాంతిం ,

 లక్ష్మీం + అనపగామినీం భజే !!! 

---

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

****


దత్తపది..గుడ్, బ్యాడ్, రాంగు, రైటు

తే:: గురువు ఓర్పు పాఠము నేర్పు గుడ్ యనుటయె
బాధ మాపక తిట్టటే బ్యాడ్ యనుటయె
రవ్వవెలుగులో చదువుట రాంగనుటయె
రైతులాకష్ట పడుటయే రైటగుటయె
......