Sunday 19 March 2023

 


26/05/2023.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
నేటి యువతలో ఉన్న లోపాలను సరిచేసేలా 
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసనలు చూడనేలా ప్రగల్భాలు గొప్పలు చెబుతే సరిపోదంటు 
గుండెల నిండా ప్రశ్నించే దమ్ముండాలంటు  యువతలో కదలిక తెచ్చి చైతన్య పరచి  నేడు రేపు నాదే నంటు
ఉత్సాహంతో విశ్వాసంతో ముందడుగు వేయించేలా
సాగే పాట. అడుగడుగులో  సత్తా చాటేలా మునుముందు కు సాగించి సాహసం చేయమంటు
సమాజం నీదంటు  చాటి చెప్పే పాట.!!
***********
పల్లవి:-
***
ప్రశ్నించడం తెలియదే జవాబు వివరంచడం రాదే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావో చెప్పలేదే, దేశ కుటుంబాన్ని అర్ధం చేసుకోలేదే, 
ప్రజ్ఞ ఎలా అబ్బుతుందో తెలుసుకో ముందుగా, ధైర్యంగా తప్పుతప్పని, సత్యము సత్యమని వాదించడం నేర్చుకో.. నేర్చుకో.. నేర్చుకో 

ఆజ్ఞాపించడం అర్హత అనుకోవద్దులే 
ఆగ్రహించడం  చేవ ఉన్నవాడి లక్షణం అనకులే 

నోరుందనో  జేబులో డబ్బుందనో
గొప్పోడివనుకునే రోజులైతే కాదులే
అందరిలో నీ ఒకడి వని మరచి ప్రవర్తన ఎందుకులే 

 ప్రశ్నించడం చేతకానోడివై 
 ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే .
చరణం:-1
***
పనిచేసేవానికి తిండి కరువయ్యే రోజులే
పలుకరింపులతో మాయ చేసె రోజులే 

పైపై మాటలు  విని
సలాం కొట్టే జనాలు లేరులే 
కష్టించే తత్వానికి ఇష్టపడేవారే లేరులే 

నష్టనివారణ చర్యలు చెప్ప లేవులే 
నీ సత్తా ఏమిటో  తెలిప లేవులే 
పిల్లిని చూసి పులి అనే స్వభావం గల వాడివి లే 

రేపటి రోజు నీదని చెప్ప లేవులే 
నేటి రోజుపై పట్టు సాధించవులే 
పట్టు పట్టడమంటే తేనెతుట్టేలా ఉండాలిలే 
పట్టుదల పై సవారి చేయ లేవులే 
 పల్లవి:-
***
ప్రశ్నించడమే చేతకానోడివిలే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే 
 చరణం:-2
****
భుజం భుజం కలిపి నడిపించే చొరవ లేదులే 
జనంలోకి చొచ్చుకుపోయే తెగువ లేదులే 
నువ్వు కావాలిరా ఆ ధైర్యం నిలవాలిలే 

భజన పరుల పూజలను   
దరికే రానీవకులే 
నిన్ను నీవు నమ్మి ముందుకు సాగ వలే 
నీవు చేసే పని ఎన్నటీకి వమ్ముకాదులే
నమ్మకమే నీకు బలము అని తెలుసుకోవాలిలే 

 కాలం ఎప్పుడు సవాళ్ళ వెంట ఉండును లే 
 భయమే లేకుండా కదలాలిలే 
గాయం అయినపుడు మందుగా మారాలిలే 
న్యాయం వైపు నడువు విజయం నీదవుతుందిలే 
 
గమ్యం ఎంత దూరమైనా
నిర్ణయం నీదే కావాలిలే 
బాధైనా బఢభాగ్నైనా  లెక్కే చేయక నడుం బిగించాలిలే 
పక్కా ప్రణాళికతో  నిక్కచ్చిగా  ముందడుగు వేయాలిలే 

 జయము జయము నీదే  విజయ లక్ష్మి నీదే కావాలిలే 
 జయము జయము నీవే ప్రజలంతా నీ వెంటే ఉంటారులే 
 పల్లవి:-
***
 ప్రశ్నించడమే చేతకానోడివి కావులే 
 ప్రపంచాన్ని ఎలా ఏల గలవు తావులే 
 ************

 రచన:-
27/05/2023. *****  పాట సందర్భంపై నా విశ్లేషణ.
****౮****
ప్రేమలో పడినపుడు ఆ  ప్రేమికుల హృదయం ఎలా ఒకరికై ఒకరు పరితపిస్తారు ఎలా  ఒకరి సాంగత్యాన్ని ఒకరు కోరుకుంటు  ప్రశంసించుకుంటు   ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుపుతు  ప్రకృతి తో పోలుస్తు తన సంతోషాన్ని తెలుపుతు ప్రేమలో లీనమై పిడుకుంటున్న ఈ పాట.
*****************
పల్లవి:-
***
ఓనమాలు నేర్పవా 
ఓర్పుచూపి ఆదుకోవా
ఓటమిలోని విజయాన్ని అందించవా  
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో

ప్రతి క్షణం  నీ స్మరణై 
నన్ను వెంటాడుతున్నదే 
నాహృదయంలో నేవి  
మనసంతా  వేణువై  పాడేనులే..

ఆహహా  ఆహాహా

ప్రియతమా  నిను చూచిన క్షణమే
అనురాగాన్ని అందించాలని 
ఆశపడ్డా నీపైనా, 

మధురమా మనోరమా మానస వీణ  
నీ ప్రేమ పొందిన భాగ్యమే నేనై
సౌఖ్యమెంతగానో పొందానులే..
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
****
పిలిచినంతనే పలికే దేవతవే
పలుకంగనే వరమై కురిసి
చేరుకున్న  చిరునవ్వువే

అలలా ఎగసినావు   
కలనే కరిగించినావులే...

వలపే రుచి చూపినావు
తలపుల్లో  తిష్టవేసినావే...

వరుడవై పక్కన చేరి గిలిగింతలతో 
చలి మంటలు రాచేసినావురా  నాలోనా...
పల్లవి:-
**
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
***
వెచ్చని నీ ఒడిని వీడలేకుండే
బానిసగా మార్చేసినావులే..!!

స్వచ్ఛమైన  పుట్టతేనెవే
నీ అధరములే అమృతధార లే
జాలువారినా  పెదవులను ముద్దాడినాకే
తెలిసిందిలే  అమరత్వమే సాధించినానని..!!

ఏమైనా సరే    ఏదైనా సరే
నీవు నా తోడైనందుకు కృతజ్ఞతగా 
నా  కౌగిళినే  కానుకగా ఇస్తున్నా మన్మధా
ఆ జాబిల్లి సాక్షిగా...
 పల్లవి:-
****
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
********
28/05/2023.
*****
 పాట సందర్భంపై నా  విశ్లేషణ.
***********
 ఎందరో మహానుభావులు   ఆ మహానుభావులందరికి లోకి   మహానుభావుడు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి  తారక రాముడు.  వంద సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ భూమి పై పుట్టిన   గొప్ప తేజం సంకల్ప స్వరూపం.సుఃదర రూపం   పరిపూర్ణ మహోన్నత వ్యక్తిత్వం. చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించుకున్న 
దివ్య భవ్య విశ్వ రూపం నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా
 ఈ పాట.
*౮**************
 పల్లవి:-
****
విశ్వం మెచ్చిన తిరుగు లేని మనిషి 
విశ్వ నరుడై వెలుగొందిన  ఎదురులేని మనిషి
సర్వం తెలిసిన బంగారు మనిషి 
ఆంద్రావనికే ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహర్షి.బ్రహ్మర్షి 
కోరస్.
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వ విఖ్యాత నటరత్న, పద్మశ్రీ నాట సార్వభౌముడై 
సర్వ ప్రపంచ హృదయాలలో  నిలిచిన రాజర్షి..
కోరస్:-
***
 మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

ప్రజా సేవకుడై  సమాజమే దేవాలయం అన్న కధా నాయకుడు 
ప్రజలే నా దేవుళ్ళని   సంక్షేమానికే పునాదులు వేసిన మనుషుల్లో దేవుడు 
జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిన సాహసవంతుడు 

మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

కోరస్:-
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వం మెచ్చిన చండ శాసనుడు 
విశ్వనరుడై వెలుగొందిన విశ్వరూపం ఆటగాడు
చరణం:-
క్రమశిక్షణ తో నడిపించిన బడిపంతులు 
ఆకాశమంతగా ఎదిగిన అదృష్టవంతుడు 
కాలంతో పరుగెత్తె పెత్తందారలను అరికట్టిన సింహబలుడు 
ఎవ్వరు అందుకోలేనంత  కీర్తి నే పొందిన దాన వీర సూర కర్ణుడు 

రామ నామధేయుడై  
నందమూరి ఇంట జన్మించాడు 
ఆ రాముడే ఆదర్శమై
శ్రీ కృష్ణుడిలా చక్రం తిప్పాడు 
మా తారక రాముడు
మన తెలుగువారి ఆత్మగౌరవ నినాదమై తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రిగా ఏలినోడు 
తెలుగోల్లందరి గుండెల్లో పదిలంగా నిలిచిన జగదేక వీరుడు 
 పల్లవి:-
***
విశ్వం మెచ్చిన మనిషి
విశ్వనరుడై నిలిచిన మహామనిషి.
చరణం:-
***
సంఘసంస్కర్తగా మంచికి మరోపేరుగా 
పట్వాడి వ్యవస్థ నే భూస్థాపితం చేసాడు 
ఆడపడుచులకు అండ దండగా
ఆస్తి హక్కు కల్పించిన మర్మయోగి 

ఉచిత కరెంటు ఇచ్చి 
పేదోడి గుడిసెల్లో వెలుగై నిలిచాడు 
రెండు రూపాయల కే 
బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి
ఇంటింటికి అమ్మై అన్నం పెట్టిన 
అన్నపూర్ణ గా నిలిచాడు 

ఓ మా నందమూరి  
తెలుగు దేశ విజయ భేరి మ్రొ 
 గించిన రాముని మించిన రాముడు 

ఓ నటరత్న
ఓహోహో  మహా నాయకా
తెలుగు నాడులో
విజయ బావుటా ఎగరేసి
చరిత్ర సృష్టించిన యుగపురుషుడు 

చిన్ననాటి స్నేహితులతో జీవితచక్రమ్, మేలుకొలుపుగా శ్రీ నాధుడు 
ధరిత్రిలో చెరగనిది నీ చరిత
మీతోనే  మా నవ శకానికి నాంది పలికాడు 
మా దేవుడవయ్యావు ఆ దేవుని చెంతకు చేరి
నిత్యం మము  దీవిస్తున్నావు .. 
 సత్యః ప్రభోదిస్తున్నావు..

ఈ మీ శత జయంతి రోజు మీ నామస్మరణం
అరుణోదయ గీతమై అణువణువు పలుకుతోంది
ఆత్మీయ రాగం.. ఆత్మీయ రాగం
పల్లవి:-
****
 విశ్వం మెచ్చిన మనిషి
 విశ్వ నరుడై వెలుగొందిన మహా మనిషి.
************

**********
నేటి నా పాట  సంఖ్య:
**********
రచన:- మల్లాప్రగడ రామకృష్ణ 
******
పాట సందర్భంపై నా విశ్లేషణ:-. ********** అందరూ కలసి ఉగాది పాట .
************** 
పల్లవి:-
****
రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 

ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    

ఎన్నెన్నో అందాల నెల ఇది  
ఈ బృందావన చందనం  మనఅందరిది 
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను తలపించేది 
కొత్త వంట, వస్త్ర అపురూప ఘట్టము ఇది 
ఆనందాల యుగాది వేదిక  వీక్షణం   !!

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు
         
చరణం:-
****
అదృష్టమే మా అందరి ఆనందం 
ఆకాసాన దిగివచ్చిన దేవతల మయం 
ఆనందమే మా లోగిలై సుందరానంద మకరందం  
హరివిల్లులా  విరబూసిందోయి యుగాది వేదిక  వీక్షణం

ప్రకృతి  వీడి ఉండలేము మేము 
పంచాంగం వినందే ఉండలేము 
పదహారణాల తెలుగింటి  వారసులం 
మా అందరి కలయిక మనో ఉల్లాసము  
ఉరుకుల పరుగుల లేవు యుగాది వేదిక  వీక్షణం

పల్లవి:-
**
చరణం:-
***
మేము ఒక్కరొక్కరమే కలసియు 
రసాబసా మవకుండా హృదయాన్ని తలపించియు 
అనుభవజ్ఞులు చెప్పినది అక్షర సత్యమని నేమియు 
అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము యుగాది 

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 
ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    
*************

Monday 6 March 2023

 🕉 pranjali Prabha  మన గుడి : 01

     చిత్తూరు జిల్లా , andhra pradesh  🕉

*కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం..*

🕉 మన గుడి  : 01🕉

🔅 చిత్తూరు జిల్లా :  కాణిపాకం

🔅కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం

 తిరుమలపై కోనేటి రాయుని కోనేటి రాయని దర్శించుకున్న భక్తులు  కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ స్వామివారి మహిమలు అనంతం. 

ఎందరో భక్తులు వినాయకుడి మహిమలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాణిపాకం ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరు, పోలీసులకు ఫిర్యాదు చేయరు. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిసాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతడి పని పడతాడని భావిస్తారు.

 కాణిపాకంగా మారిన విహరపురి : చరిత్ర,  విశిష్టత. 

కాణిపాకం క్షేత్రం  ఒకప్పుడు విహరపురి గా పిలువబడేది.

కాణిపాకం పేరు వెనుక అసలు రహస్యం.. 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.

టెంకాయ నీళ్ళు కాణి భాగం అంతా ప్రవహించడం వల్ల కాణిపాకం అయింది

 ప్రకృతి వైపరీత్యాల వల్ల విహరపురి తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. వరదలు వచ్చి, బహుదా నది పొంగిపొర్లడంతో ఆలయంలోని వరసిద్ధి వినాయకుడు బావిలోకి జారి, అక్కడే ఉండిపోయాడు.

 విహరపురి ఈ వరదల నుండి కోలుకుంటుండగానే అనావృష్టి సంభవించి పట్టణం మరుభూమిగా మారిపోయింది. 

ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా కలిసివెలసి జీవిస్తున్న ముగ్గురు మిత్రులకు కాణి పొలం వుండేది.

 కాణి అంటే 1.3 ఎకరం. వీరిలో మొదటివాడు గుడ్డి, రెండవవాడు చెవిటి, మూడవవాడు మూగ. వీరికి పుట్టుకతోనే ఈ వైకల్యాలు సంభవించాయి. పంట వేయడానికి అవసరమైన నీటి కోసం బావిని లోతు చేయడానికి చెవిటి, మూగ మిత్రులు చేతిలో గునపాలతో బావిలోకి దిగారు. గుడ్డి మిత్రుడు మాత్రం గట్టునే ఉండిపోయాడు. మిత్రులిద్దరూ గునపంతో పోటు వేయగానే ఠంగ్ మన్న శబ్దం వచ్చింది. వెంటనే వెచ్చటి రక్తం పైకి చిమ్మింది. ఈ రక్తపు చుక్కలు మీద  పడగానే చెవిటి మిత్రునికి మాట వినిపించింది. మూగ మిత్రునికి మాట వచ్చింది. ఇది భగవంతుడి మహాత్మ్యమని తెలుసుకున్న మిత్రులిద్దరు రక్తదారను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నెత్తుటి ధార ఆగకుండా ఇంకా పైకి చిమ్మి గుడ్డివాని కనులను తాకింది. వెంటనే వానికి చూపు వచ్చింది. వెంటనే అతడు రాజు వద్దకు పరుగుతీసి, జరిగినదంతా చెప్పాడు. అది విని రాజు తన రాణులతోను, దానదాసీజనంతోను, అక్కడకు చేరుకుని ఆ బావిలో లెక్కిలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిని శాంతింప జేశాడు. అలా బావి నుండి ఉబికి వచ్చిన కొబ్బరి నీరు కాణిపై పారింది. దాంతో విహారపురికి కాణిపాకం అనే పేరు సార్థకమై, క్రమంగా కాణిపాకంగా మారింది.

 సంతానం లేని దంపతులు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని, 11 లేదా 22, 41 రోజులు నియమానుసారం పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

ప్రతిఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో లక్షలాది మంది భక్తులు సత్యప్రమాణాల స్వామి దర్శనానికి వస్తుంటారు. 

చిత్తూరు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్యక్షేత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో వుంది.

 పెరుగుతున్న విగ్రహం

స్వామి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వున్నాడని భక్తుల నమ్మకం. దీనికి సాక్ష్యంగా సుమారు 50 సంవత్సరాల ముందు స్వామి వారికి చేయించిన వెండి కవచం నేడు స్వామి వారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ వున్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభువునిగా ఖ్యాతినొందారు.

 బాహుదానది చరిత్ర

వినాయకస్వామి వెలసిన బాహుదానదికి ఆ పేరు రావడం గురించి కూడా పురాణ కథవుంది. 

స్వామిని చూడాలని శంఖుడు, అంఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు.

దైవ లీలలో భాగంగా చేయని తప్పుకు అంఖితుడికి రాజుగారి ద్వారా చేతులు నరకమని శిక్ష పడింది. 

భటులు రాజు ఆజ్ఞ ప్రకారం అంఖితుడి చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన శిక్ష పడటంతో దు:ఖంతో తమ్ముని వెంటబెట్టుకొని శంఖుడు కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వెళ్ళాడు. 

దైవదర్శనానికి ముందుగా అక్కడ నదిలో స్నానమాచరిస్తుండగా ఖండించిన అంఖితుని చేతులు తిరిగివచ్చాయి.పోయిన బహువులు తిరిగి వచ్చిన కారణంగా ఆ నదికి బహుదానదిగా పేరు వచ్చింది.

 శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాంగణంలో వుండటంతో కాణిపాకం క్షేత్రాన్ని శివవైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు...

****

* అపూర్వ శాస్త్రాలు *

 

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

 

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

 

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

 

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన

నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

 

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

 

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల

శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక

విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

 

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

 

🌼 7.విషశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార.

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

 

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

 రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు

ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే

ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు

చెప్పబడ్డాయి.

 

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను

పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా

విభజించి తర్కించారు.

 

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో

తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

 

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో

వివరించారు.

 

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

 

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల

పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

 

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,

సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,

 కుమారస్వామి రచించిన గజశాస్త్రం,

 భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,

 ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

 

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?


వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు  ఇది వాట్సాప్ లో సేకరణ మీరు చదవగలరు  

🌼 ఓం నమః శివాయ