తిరుమల
పాప పుణ్యములు తెలియవు
మంచి చెడుల తేడా తెలియవు
సుఖదుఃఖములెన్నో తెలిసిన నన్ను అంటవు
ఏమని చెప్పేది? ఏదని చెప్పేది?
తప్పొప్పుల జీవన తీరు నీకే తెలుసు వేంకటేశ్వరా॥
తప్పుకీ అవమానానికీ తేడా తెలియదు
స్వార్థ నిస్వార్థముల సారము గ్రహించలేను
లోకపు మాటలన్నీ లోతుగా కొలవలేను
నా మనసు తెలిసినవాడవు నీవే వేంకటేశ్వరా॥
గడ్డిపోచంత విలువైనా గర్వించలేను
రాజ్యమేలు పెద్ద పనులైనా చేయలేను
నాకున్న చిన్న చేతులతో నావంతు చేస్తున్నాను
ప్రేమతోనే నా వంతు సేవను అర్పిస్తున్నాను
అది చాలునని దయచేసి ఆదరించు వేంకటేశ్వరా॥
మూర్ఖుడని ఎవరన్నా మౌనమే నా జవాబు
తప్పుడని ఎవరన్నా సహనమే నా బలము
మనసులోని మాటలన్నీ నీ ముందే చెప్పుకొందును
మౌనమనే ఆయుధమున ఆత్మగా నీవే దిక్కు వేంకటేశ్వరా॥
నేను చేసిన తప్పులెన్నో నీవే ఎరుగుదువు
నేను దాచిన కన్నీటిని నీవే చూచితివి
లోకమంత తీర్పిచ్చినా నీ తీర్పే నాకు చాలు
నా అంతరాత్మకు ఆధారమై నిలిచేది నీవే వేంకటేశ్వరా॥
పాపమో పుణ్యమో నాకు తెలియకపోయినా
మంచిదో చెడ్డదో పూర్తిగా తెలియకపోయినా
నీ నామమొక్కటే నిత్యము నమ్మి నడచెదను
నీ పాదసేవలోనే నా జీవితం అర్పించెదను
నన్ను నడిపించు దయామయా శ్రీ వేంకటేశ్వరా॥
నేను నీవాడను – నీవు నా వాడవు”
అనే శరణాగతి
నేను నీవాడను నిన్ను వీడను
నీవు నా వాడవు నన్ను వీడకు
నేను నీవే నీవు నాలో ఉన్నావులే
అక్షరంబుగా నా మదిలో నీవే వేంకటేశ్వరా॥
ఎవరో మోసం చేశారని నిన్నేమనను
అవమానించారని ఏమాత్రం విచారించను
ఎవరో వదిలేశారని నిన్ను వదలను
జీవన రాగము తారుమారైన నీవే దిక్కు వేంకటేశ్వరా॥
నా భవిష్యత్తు అంతా నీదయ్యా
వర్తమానమందు నీ ఇష్టముగా నడిపించవయ్యా
అర్థము పరమార్థము అంతా నీదయ్యా
సర్వార్థకామ్యతా భావము నీదే వేంకటేశ్వరా॥
ఎన్ని సార్లు చెప్పినా నా మది ఇంతేనయ్యా
మనుషులను మార్చుట నీ దయ మూలమయ్యా
కాలజ్ఞాన కర్మల తీరు అంతా నీదయ్యా
కారణ జన్మలకు కర్తవు నీవే వేంకటేశ్వరా॥
కష్టసుఖములన్ని కలగలసి వచ్చునయ్యా
ఇష్టానిష్టములు విధి వెంట నడచునయ్యా
నిష్ఠతో నీ నామము జపించుచుండగా
దుష్ట చింతలన్ని తొలగింపవే వేంకటేశ్వరా॥
శాంతియే మా సంపదగా చేకూర్చవయ్యా
సహనమే మా జీవితమున సారమవ్వయ్యా
భక్తి మార్గమున నడిపించు దయాసాగరా
మాకు దేవుడవు నీవే శ్రీ వేంకటేశ్వరా॥
*****
శరణాగతి–వేదన–భక్తి గేయరూపం
తిరుమల
అలల తీరు కోపమొచ్చి తగ్గునయ్యా
కలల తీరు జీవనమున మలుపునయ్యా
వలకు చిక్కి విధి వ్రాతను గెలువలేక
తలపు తెలుపు మది మాయలు నీవే వేంకటేశ్వరా॥
పల్లవి
ఏడుకొండలందు వెలసిన వేంకటేశా! నీవే దిక్కు
వీడనెపుడు నీ స్మరణమే నాకు హక్కు
మాడమాడలందు తిరుగు మాధవా! నీవే దక్కు
వీడనయ్య నీ పదమే తోడుగోరు వేంకటేశ్వరా॥
ఈడు జరుగుచున్న కోర్కెలెన్నో పెరుగుచుండె
ఏమి కటకట బ్రతుకిది వేంకటేశ్వరా
నేడు భారమై నియతి నన్ను నెట్టుచుండె
ఏలుకొమ్ము దయతోడ వేంకటేశ్వరా॥
ఆడి తప్ప మతికి మరి గతియేదీ లేదయ్యా
ఏడు జన్మలైన నీడ నీవే దేవా
ఏమియో కథలైన ఎడబాటు దారులైన
ఏలుకొమ్ము నిరతము వేంకటేశ్వరా॥
దాడి చేయు వేదనలే ముసిరె నా మనసున
వాడిపోయె ఆశలన్ని వానలేని చేనులా
ఊడిగములు చేసెదనయ్య యోగదేశికా
ఆడుకొనుము నన్ను నీవు వేంకటేశ్వరా॥
నాది యేమి లేదని నమ్మి వచ్చితిని
నీది యంతయని భావించి నిలిచితిని
చేదు తీపి ఫలితములు నీకే అర్పితిని
నీ చరణములే శరణు వేంకటేశ్వరా॥
కన్నీటి పూజలతో కడగుచున్న హృదయము
పున్నమి వెలుగువంటి కరుణ కోరుచున్నది
అన్నివేళలా నన్ను ఆదుకొనుము స్వామీ
అంతరంగ నివాస వేంకటేశ్వరాయి
*****
కాలతత్త్వం, శరణాగతి భావం
తిరుమల
దుఃఖము లేని లోకమేది
సుఖము గాంచని విలువయేది
నఖశిఖ పర్యంత రోగరహిత దేహమేది
ఆనందామృతమందించే శ్రీ వేంకటేశ్వరా॥
ఏది నాదనెడి భావములేని వాడ్ని
నమ్మకమ్ముతో నడిచే దీనుడ్ని
యుగయుగములు నిన్నే తలచే వాడ్ని
కనులతో సత్యము గనలేని వాడ్ని
కాలధర్మములో మంచి తెలియని వాడ్ని
బ్రతుకునందు నీ బానిసను వేంకటేశ్వరా॥
ఉదయ సాయంత్రము రాత్రియై
ఆయుష్యమును హరించు కాలమై
సూర్యచంద్ర స్వరూపుడవు నీవే
నిన్ను తలచిన క్షణమే నిజమైన ఆయుష్యే
నన్ను నేనుగా అర్పించుటే నా ఆయుష్యే
దేహము భగవత్సేవకై దయచేయు వేంకటేశ్వరా॥
కష్టసుఖముల కలబోతలో
కరుణ చూపే కల్పవృక్షమా
జననమరణ మార్గమందు
జగతి దాటించు దయాసాగరా
నీ నామమే నా శ్వాసగాను
నీ పాదమే శరణు వేంకటేశ్వరా॥॥
శ్రీ వేంకటేశాయ నమః ॥
భావసారం:
దుఃఖం లేని జీవితం లేదని, సుఖం విలువ కూడా కష్టాల ద్వారా తెలుస్తుందని కవి గ్రహిస్తున్నాడు. శరీరం రోగరహితం కాదని, నిజమైన ఆనందామృతాన్ని ప్రసాదించగలవాడు శ్రీ వేంకటేశ్వరుడే అని ప్రార్థిస్తున్నాడు.
తనకు స్వంతమని చెప్పుకునే దేదీ లేదని, నమ్మకంతో జీవిస్తూ నిత్యం భగవంతుని తలచేవాడినని చెబుతున్నాడు. అయినప్పటికీ సత్యాన్నిk సంపూర్ణంగా గ్రహించలేక, కాలధర్మంలో మంచి–చెడులను తెలుసుకోలేని సాధారణ మానవుడినని అంగీకరిస్తూ, తాను వేంకటేశ్వరుని దాసుడినని శరణాగతి వ్యక్తం చేస్తున్నాడు.
ఉదయం, సాయంత్రం, రాత్రి అనే కాలచక్రం ద్వారా ఆయుష్షును హరించే సూర్యచంద్రుల రూపమూ నీవేనని, అయితే నిన్ను స్మరించే క్షణాలే నిజమైన ఆయుష్షని భావిస్తున్నాడు. తన జీవితం, శరీరం, శ్వాస అన్నిటినీ భగవత్సేవకే అంకితం చేస్తూ, దేహమే సేవాసాధనమని వేంకటేశ్వరుని సన్నిధిలో సమర్పిస్తున్నాడు.
****
తిరుమల
పల్లవి
విద్య నేర్పు గురువు నీవు
వేల్పు కన్న ఘనుడవైనావు
ముద్దు చేసి చెప్పిన మొదటి పదము నీవుయే
సిరులు తాండవించ లేని తనము దేవా
కోటి దండాలు గురువని పూజించినాను
వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...
చరణం – 1
చిక్కులెదురైనా చింతపడక నిన్ను చేరా
చిత్తబలిమితో చిక్కులన్నీ చింత వీడా
కలుగు శాంతి జీవి కనుచు కర్మ తీరా
మాటల చెలిమితో చెప్పెదా మనసు
వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...
చరణం – 2
పద్యం నేర్పు గురువు నీవయ్యా
గద్య భావమది విషయము చెప్పగలనయ్యా
మిథ్యా బ్రతుకుగా నేను ఉన్నా నిన్ను వేడుచున్నా
ఎవ్వరి కంటనీరు రానీయక కాపాడవయ్యా
వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...
ముగింపు
తప్పులు ఎన్నున్నా తండ్రివై క్షమించవయ్యా
తడబడే అడుగులకు దారివై నిలువవయ్యా
నీ చరణ సేవలో నా జన్మ సార్థకమయ్యేలా
కరుణ చూపవయ్యా శ్రీ వేంకటేశ్వరా!
****+
శీర్షిక:
“కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా”
తిరుమల
జ్ఞానము విజ్ఞానము తెలియనివాడ్ని
ధ్యానము తీరు బ్రతికేవాడ్ని
ధర్మంమ్ముకొరకు నిలిచేవాడ్ని
సత్య వాక్కుగా బ్రతకాలనీ నీ కారణా కటాక్షాలకు ఈ జన్మ చాలు వేంకటేశ్వరా
పొగ నడుమ వేడిది అగుచు
ధగధగ రుపు వేంకటేశ్వరుని తిరుమల స్వర్గమనుచు
ఆశక్తే సర్వలోకాల రక్షణ యనుచు
మ్రాక్కిన వారికి మొక్కులు దీర్చ శ్రీ వేంకటేశ్వరా
సత్య ధామమని యండ్రు
పరమహోమమనిచుండ్రు
ప్రకృతి ప్రశాంత ధామ మండ్రు
వేదమంత్ర శక్తియున్న వాసమండ్రు
మంత్రపుష్ప మూల ఆర్య అండ్రు
కాలతీరు జన రక్షగా నడ్రు
కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా
శుబ్రతల మధ్య సిద్ధిని కోరె దా
యోగిని కాను నిరతము భక్తి చేరెదా
యత్నము మాత్రమే అంతా నీదయ తీరుగా
ఈశరీరం నీసృష్టి నీఇష్ట ప్రకారమే వేంకటేశ్వరా
భావసారం – తిరుమల (06)
ఈ గేయంలో భక్తుని వినయం, ధర్మనిష్ఠ, సత్యజీవనం, తిరుమల మహిమ, సంపూర్ణ శరణాగతి ఎంతో హృద్యంగా ప్రతిఫలించాయి.
భక్తుడు తనను తాను జ్ఞానవంతుడనిగానీ, విజ్ఞానసంపన్నుడనిగానీ భావించడు. ధ్యానం ఎంతగా వచ్చునో అంతగా జీవిస్తూ, ధర్మం కోసం నిలబడే సాధారణ భక్తుడినని చెబుతున్నాడు. సత్యవాక్కుతో జీవించాలని కోరుకుంటూ, వేంకటేశ్వరుని కరుణాకటాక్షాలే తన జీవితానికి పరమసంపద అని భావిస్తున్నాడు.
తిరుమల కొండలను భక్తుడు స్వర్గసీమగా దర్శిస్తున్నాడు. పొగమంచు మధ్య ప్రకాశించే శ్రీ వేంకటేశ్వరుని మహిమను స్మరిస్తూ, సమస్త లోకాల రక్షణకై నిలిచిన దివ్యశక్తిగా వర్ణిస్తున్నాడు. భక్తితో మొక్కిన వారి కోరికలను తీర్చే దయామయుడని కీర్తిస్తున్నాడు.
తిరుమల సత్యధామం, యజ్ఞహోమ ఫలభూమి, ప్రకృతి ప్రశాంత నిలయం, వేదమంత్రాల శక్తి నిండిన పుణ్యక్షేత్రమని భావిస్తున్నాడు. మంత్రపుష్పాల సుగంధం, వేదఘోషల పవిత్రత, జనరక్షణ కోసం నిలిచిన దైవకృప అక్కడ సాక్షాత్కారమవుతుందని చెబుతున్నాడు. అందుకే తనకు కపటరహితమైన మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాడు.
చివరగా, తాను యోగి కానప్పటికీ భక్తిమార్గంలో నడవాలనుకుంటున్నాడు. తన ప్రయత్నం మాత్రమే తనదని, ఫలితమంతా స్వామి కృపేనని అంగీకరిస్తున్నాడు. ఈ శరీరం కూడా భగవంతుని సృష్టే కాబట్టి, తన జీవితం అంతా ఆయన సంకల్పానుసారమే సాగాలని సంపూర్ణ శరణాగతితో ప్రార్థిస్తున్నాడు.
****
No comments:
Post a Comment