Monday, 14 September 2026

కీర్తనలు

 




"నేను కష్టాలు వదలను లేదు 

 నేను పగ్గాలు పట్టను లేదు

 నేను నష్టాలు చెప్పను లేదు

 నాది ఇష్టాలు నీకు చెప్పగా వస్తే 

 నా చూపు మార్చి నన్ను పడ వేసావు వేంకటేశ్వరా 


బండి చేర్చావు గమ్యాన్ని చూపకే 

నిండు పున్నమి కూడా నిష్పలంబు చేసావు 

యత్నమంతయు నీరు కార్చావు 

విఫలమైన ఎలాంటి కోరిక అడగలేదు వేంకటేశ్వరా 


ఇమ్ముగ ఆశతో నీదరి చేరా

సమ్మడము కలుగు రీతి కృషిచ్చేసా 

నేమ్మిని ప్రభువు సహకారం కోరా 

రమ్మున్న నీసేవలు నే చేసెద వేంకటేశ్వరా 


(తిరుమల నుండి )


భావసారం:

కష్టాలను తప్పించుకోలేదు, బాధ్యతలను వదిలిపెట్టలేదు, నష్టాల గురించి ఫిర్యాదు చేయలేదు. తన కోరికలను మాత్రమే స్వామికి వినిపించిన భక్తుడు, తన ఆశలు నెరవేరక జీవితం మార్గం తప్పినట్లుగా అనుభవిస్తున్నాడు.

గమ్యం చూపకుండా ప్రయాణంలో నడిపించావని, పున్నమి వెలుగులాంటి అవకాశాలనూ ఫలించనివ్వలేదని, చేసిన ప్రయత్నాలన్నీ నీరైపోయాయని వేదన వ్యక్తం చేస్తున్నాడు. అయినా తాను అసాధ్యమైన కోరికలు అడగలేదని స్వామిని ప్రశ్నిస్తున్నాడు.

చివరికి ఆశతో తిరుమల చేరి, తన వంతు కృషి చేసి, ప్రభువు సహకారమే కోరానని, అవకాశం ఇస్తే నీ సేవలకే జీవితాన్ని అంకితం చేస్తానని వేడుకుంటున్నాడు.

*****


శీర్షిక: “నీవే నీవే వేంకటేశ్వరా” లేదా “శరణాగతి గీతం” ।


.తిరుమల 


ఏతీరుగా నె చెప్పేది 

కాలమే నని నె ఒప్పేది 

సప్తగిరి కొండలపై నుండి చూసేది 

నీవే నీవే వేంకటేశ్వరా 


నీవు యుంచిన చోటనే నిశ్చళంగా 

నిలచి యుందును కడదాక నిబ్బరంగా 

నేను నటనలన్నియుచేయు నీపరంగా 

నాది యన్నది నీదేగా నిబ్బరంగా వేంకటేశ్వరా 


కొండ నెక్కెడి దీపాలు కొడిని దులిపే 

ఉండబట్టాను లేకయు తడుపు నలిపే 

నిండు తనంబు నీదయ నీడ కోరే 

నుండలేని తనము నాకు సూత్ర మేళా వేంకటేశ్వరా 


జగతిపాలనాలిని గని జయము చేరుస్తూ 

ప్రగతి ప్రభవము గాంచ గలగ జేస్తూ 

నిగమ నిగమానంద

 తత్పరవైతివి 

యుగము నందు కలియుగ దేవా వేంకటేశ్వరా 


భావసారం:

“నా జీవిత గమనాన్ని, విధి రహస్యాన్ని పూర్తిగా వివరించలేను; అంతా కాల మహిమ అని మాత్రమే ఒప్పుకోగలను. సప్తగిరులపై నుంచి నా జీవనాన్ని దర్శిస్తూ నడిపించేది నీవే, ఓ వేంకటేశ్వరా!

నీవు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడే స్థిరంగా నిలిచి, చివరి వరకు ధైర్యంగా జీవిస్తాను. నేను చేసే ప్రతి కార్యమూ నీ సంకల్పమే; నాదని భావించేది కూడా నిజానికి నీదే.

తిరుమల కొండలపై వెలిగే దీపాల వలె నా జీవితమూ ఎన్నో కష్టసుఖాలను అనుభవించింది. అయినా నీ కరుణా నీడకోసమే నా మనసు తపిస్తోంది. నీ సన్నిధి లేక నేను ఉండలేను.

జగత్తును పాలిస్తూ, జీవులకు జయాన్ని, ప్రగతిని ప్రసాదిస్తూ, వేదనిగమాల ఆనందస్వరూపుడై, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులను కాపాడే శ్రీనివాసుడా! నీకే నా సంపూర్ణ శరణాగతి.”

*******

శీర్షిక: “నమ్మితి నిన్ను వేంకటేశ్వరా”

లేదా

“భక్తుని శరణాగతి”.

తిరుమల 03


నమ్మితి నిన్ను 

సమ్మతి కోర వచ్చినాను 

ముమ్మర భాధలున్నను 

ఉమ్మడి తీరుగా నా భక్తి తెలిపినాను 


గొప్పవాడ్ని అని నేననా లేదు 

గోడు చెప్ప వచ్చిన వాణ్ని కాదు 

బక్కవాడ్ని నీ దరినా చేరాలని ఉన్న ఆశగాడ్ని 

భాధ యంతా నీదయా నాప్రాప్తి వేంకటేశ్వారా 


ఊరు వదిలినా నిన్ను వదలను 

పేరు పోయినా మనసున వదలను 

వారు వీరని యన్నాను పట్టించుకోను 

చేరువ విధి చిత్రమే నా స్థితులు వేంకటేశ్వరా 


సంతుతో కూడి నీభక్తి సమయ మిదియే 

పంతమాకర్మయా తెలపగను లేను 

వింతలన్నియు సమరమై వినయ కలలు 

శాంతివిశ్వము నందున లేదు లేదని చిప్పుచున్నా 

వేంకటేశ్వరా j నమ్మి నాను వేంకటేశ్వరా


*****

భావసారం – తిరుమల (03)


ఈ గేయంలో భక్తుని వినమ్రత, అచంచల విశ్వాసం, జీవిత కష్టాల మధ్య దైవశరణాగతి స్పష్టంగా వ్యక్తమయ్యాయి.


భక్తుడు శ్రీ వేంకటేశ్వరుని నమ్ముకొని ఆయన సమ్మతిని కోరుతూ తిరుమలకు వచ్చానని చెబుతున్నాడు. ఎన్నో బాధలు ఉన్నప్పటికీ తన భక్తిని నిజాయితీగా సమర్పిస్తున్నాడు. తాను గొప్పవాడిని కాదని, కేవలం స్వామి సన్నిధి చేరాలనే ఆశతో వచ్చిన సాధారణ భక్తుడినని వినయంగా చెప్పుకొంటున్నాడు. తన బాధలన్నీ స్వామి కృపతోనే అర్థవంతమవుతాయని విశ్వసిస్తున్నాడు.


ఊరు, పేరు, ప్రతిష్ఠలు పోయినా స్వామిని మాత్రం విడువనని అంటున్నాడు. ఇతరుల అభిప్రాయాల కంటే భగవంతుని సాన్నిధ్యమే ముఖ్యమని భావిస్తున్నాడు. ప్రపంచంలో కల్లోలాలు, పోటీలు, అశాంతి పెరిగినా నిజమైన శాంతి దైవభక్తిలోనే ఉందని తెలియజేస్తున్నాడు.


నియమనిష్ఠలతో జీవిస్తూ, భయరహితమైన భక్తి బంధాన్ని కోరుతూ, తనను కాపాడమని వేడుకుంటున్నాడు. చివరకు స్వామి దివ్య దృష్టి, దయ, లీలలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి తనను ఆయనకు అర్పించుకుంటున్నాడు.

*****

శీర్షిక:స్వప్న జీవితం – వేంకటేశ్వర శరణం”


తిరుమల 


ఎంతవారికైనా 

తప్పని కర్మబంధము 

శాంతి కోరెద వేంకటేశ్వరా 



బొట్టు పెట్టినంత మాత్రాన బుద్దిమంతుడను కాను 

పట్టు బట్టి విద్య నేర్చినా ఏమీ తెలియని వాడిని నేను 

గట్టు మీద కూర్చొని  సలహాలు ఇవ్వలేను 

పట్టు బట్టి నిన్ను వేడుకుంటున్నాను వేంకటేశ్వరా 


 నేను ఆశపడను అందనిదాని కోసమొన్నడూ  నచ్చనిదానికోసం కష్టపడను ఎన్నడూ 

. నీకోసం కష్టపడేవారిని మరచిపోను ఎన్నడూ .

నిన్ను ఇష్టపడేవారిని మాత్రం. వదులుకోను ఎన్నడూ... వేంకటేశ్వరా "



 ఇది(జీవితం) ఒక స్వప్నం అంతే., వేంకటేశ్వరా 


స్వప్నం అనేది అబద్ధం అని తెలిశాక, కల్పించావా వేంకటేశ్వరా 


పండు రసభారంతో... రాలినట్లు 

వయసుమల్లిన జీవులు రాలినట్లు 

 బ్రహ్మానంద రసానుభూతితో నిండిన మనస్సు... పంచు వేంకటేశ్వరా 

అజ్ఞానం నుండి విడువడు మనసు నిచ్చు వేంకటేశ్వరా 

****


భావసారం – తిరుమల (04)


ఈ గేయంలో జీవన సత్యం, కర్మబంధం, వినయం, వైరాగ్యం, భక్తి, జ్ఞానాన్వేషణ కలగలిపి ఉన్నాయి.


భక్తుడు “ఎంత గొప్పవారికైనా కర్మబంధం తప్పదు” అని అంగీకరిస్తూ, ఆ బంధాల మధ్య మనశ్శాంతిని ప్రసాదించమని శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. నుదుట బొట్టు పెట్టుకోవడం వల్ల గాని, విద్యాభ్యాసం చేయడం వల్ల గాని తాను జ్ఞాని కాలేదని వినయంగా ఒప్పుకుంటున్నాడు. ఇతరులకు ఉపదేశాలు చేయగల స్థితిలో లేనని, తనకు తెలిసింది ఒక్కటే—స్వామిని ఆశ్రయించడం అని చెబుతున్నాడు.


అందనిదాని కోసం ఆశపడనని, ఇష్టంలేని దాని కోసం శ్రమించనని, దైవసేవలో నిమగ్నమైన వారిని మరచిపోనని, భగవంతుని ప్రేమించే భక్తులను విడువనని తన సంకల్పాన్ని వెల్లడిస్తున్నాడు.


జీవితం ఒక స్వప్నమని గ్రహించిన మనసు, “ఈ మాయా ప్రపంచాన్ని ఎందుకు సృష్టించావు?” అని భగవంతుని ప్రశ్నిస్తుంది. అయితే ఆ ప్రశ్నలో తిరస్కారం కాదు, తత్త్వాన్వేషణ ఉంది. చివరగా, పండు పక్వానికి వచ్చి సహజంగా రాలినట్లే, వృద్ధాప్యానికి చేరిన జీవులు కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్తారని గుర్తుచేస్తూ, బ్రహ్మానంద రసంతో నిండిన మనస్సును ప్రసాదించి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తి కలిగించమని వేడుకుంటున్నాడు.

******

శీర్షిక:

“కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా”


తిరుమల 


జ్ఞానము విజ్ఞానము తెలియనివాడ్ని 

ధ్యానము తీరు బ్రతికేవాడ్ని 

ధర్మంమ్ముకొరకు నిలిచేవాడ్ని 

సత్య వాక్కుగా బ్రతకాలనీ నీ కారణా కటాక్షాలకు ఈ జన్మ చాలు వేంకటేశ్వరా 


పొగ నడుమ వేడిది అగుచు 

ధగధగ రుపు వేంకటేశ్వరుని తిరుమల స్వర్గమనుచు 

ఆశక్తే సర్వలోకాల రక్షణ యనుచు 

మ్రాక్కిన వారికి మొక్కులు దీర్చ శ్రీ వేంకటేశ్వరా 


సత్య ధామమని యండ్రు 

పరమహోమమనిచుండ్రు 

ప్రకృతి ప్రశాంత ధామ మండ్రు 

వేదమంత్ర శక్తియున్న వాసమండ్రు 

మంత్రపుష్ప మూల ఆర్య అండ్రు 

కాలతీరు జన రక్షగా నడ్రు 

కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా 


శుబ్రతల మధ్య సిద్ధిని కోరె దా 

యోగిని కాను నిరతము భక్తి చేరెదా 

యత్నము మాత్రమే అంతా నీదయ తీరుగా 

ఈశరీరం నీసృష్టి నీఇష్ట ప్రకారమే వేంకటేశ్వరా 


******

ఎన్ని సార్లు వచ్చినా కరుణించే వాడివయ్యా”


తిరుమల 05


బ్రోచెద వీవని నమ్ముచుంటితియు 

నోమును నోచెద నిరతి తోడ మదియు 

గోవిందా యని అలాపణల భక్తియు 

సోలితి నయ్యా వ్యధల వలన వేంకటేశ్వరా 


శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా 

సోమేశ్వరునితో చెలిమిగా గోవిందా 

సర్వ ప్రాణులను బ్రోచెదవు గోవిందా 

సమయ గోప్యత సంతసంబు గోవిందా 


చెక్కులెన్ని యున్న చింత లేదు గోవిందా 

ఒక్క మాటపైననిలబడ లేదు గోవిందా 

చుక్క మధ్య నమ్మియు నటన గోవిందా 

మక్కువగను వేడుకగాను నీ దయ గోవిందా 


తిరుమల లడ్డు తీపి ఇదేనని యేల చెప్పదనయ్య 

ప్రసాదాలు అమృతం లా నున్నవి గదయ్యా 

తొక్కిసలాటలో కూడా నీవే ఉన్నావయ్యా 

ఎన్ని సార్లు వచ్చినా కరుణించే వాడివయ్యా వేంకటేశ్వరా 


****

భావసారం – తిరుమల (

ఈ గేయంలో భక్తుని విశ్వాసం, గోవింద నామస్మరణ మహిమ, తిరుమల అనుభూతి, శ్రీ వేంకటేశ్వరుని అపార కరుణ ఎంతో హృద్యంగా వ్యక్తమయ్యాయి.

భక్తుడు “నన్ను కాపాడేది నీవే” అనే నమ్మకంతో నిత్యం వ్రతాలు, నోములు ఆచరిస్తూ, “గోవిందా” అనే నామాన్ని జపిస్తున్నాడు. అయితే జీవిత వ్యథలు, కష్టాలు అతనిని అలసింపజేసినా, భక్తి మాత్రం తగ్గలేదు. ఆ నామస్మరణే అతనికి ఆధారం.


శ్రీనివాసుడు, వేంకటేశుడు, గోవిందుడు సమస్త జీవరాశులను రక్షించే కరుణామయుడని కీర్తిస్తున్నాడు. కాల రహస్యాలు, జీవన గమనాలు అన్నీ ఆయన సంకల్పంలోనే నడుస్తాయని భావిస్తున్నాడు.


లోకంలో ఎన్నో లెక్కలు, చిక్కులు, మాటల మార్పులు ఉన్నా వాటి గురించి చింతించకుండా, స్వామి కృపనే ఆశ్రయంగా తీసుకుంటున్నాడు. మనుషుల నటనల మధ్య కూడా తన విశ్వాసం మాత్రం గోవిందునిపైనే నిలిచివుందని చెబుతున్నాడు.


చివరగా తిరుమల యాత్రానుభూతిని ఎంతో సహజంగా వర్ణిస్తున్నాడు. తిరుమల లడ్డూ తీపిని మాటల్లో చెప్పలేమని, ప్రసాదాలు అమృతస్వరూపమని, భక్తుల రద్దీ మధ్య కూడా స్వామి సాన్నిధ్యమే అనుభూతి అవుతుందని చెబుతున్నాడు. ఎన్నిసార్లు దర్శనానికి వచ్చినా అదే కరుణ, అదే అనుగ్రహం ప్రసాదించే దయామూర్తి వేంకటేశ్వరుడని భక్తుడు ఆనందభరితంగా స్తుతిస్తున్నాడు.

***

భావసారం – తిరుమల 


ఈ గేయంలో భక్తుని వినయం, ధర్మనిష్ఠ, సత్యజీవనం, తిరుమల మహిమ, సంపూర్ణ శరణాగతి ఎంతో హృద్యంగా ప్రతిఫలించాయి.


భక్తుడు తనను తాను జ్ఞానవంతుడనిగానీ, విజ్ఞానసంపన్నుడనిగానీ భావించడు. ధ్యానం ఎంతగా వచ్చునో అంతగా జీవిస్తూ, ధర్మం కోసం నిలబడే సాధారణ భక్తుడినని చెబుతున్నాడు. సత్యవాక్కుతో జీవించాలని కోరుకుంటూ, వేంకటేశ్వరుని కరుణాకటాక్షాలే తన జీవితానికి పరమసంపద అని భావిస్తున్నాడు.


తిరుమల కొండలను భక్తుడు స్వర్గసీమగా దర్శిస్తున్నాడు. పొగమంచు మధ్య ప్రకాశించే శ్రీ వేంకటేశ్వరుని మహిమను స్మరిస్తూ, సమస్త లోకాల రక్షణకై నిలిచిన దివ్యశక్తిగా వర్ణిస్తున్నాడు. భక్తితో మొక్కిన వారి కోరికలను తీర్చే దయామయుడని కీర్తిస్తున్నాడు.


తిరుమల సత్యధామం, యజ్ఞహోమ ఫలభూమి, ప్రకృతి ప్రశాంత నిలయం, వేదమంత్రాల శక్తి నిండిన పుణ్యక్షేత్రమని భావిస్తున్నాడు. మంత్రపుష్పాల సుగంధం, వేదఘోషల పవిత్రత, జనరక్షణ కోసం నిలిచిన దైవకృప అక్కడ సాక్షాత్కారమవుతుందని చెబుతున్నాడు. అందుకే తనకు కపటరహితమైన మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాడు.


చివరగా, తాను యోగి కానప్పటికీ భక్తిమార్గంలో నడవాలనుకుంటున్నాడు. తన ప్రయత్నం మాత్రమే తనదని, ఫలితమంతా స్వామి కృపేనని అంగీకరిస్తున్నాడు. ఈ శరీరం కూడా భగవంతుని సృష్టే కాబట్టి, తన జీవితం అంతా ఆయన సంకల్పానుసారమే సాగాలని సంపూర్ణ శరణాగతితో ప్రార్థిస్తున్నాడు.

*****

 సప్తపద్యాం వేంకటేశనుతిః..

--

 ఏడుకొండలందునున్నవేంకటేశ! నీవె దిక్కు 

ఱేఁడువీవె ప్రోవ మ


మ్ము  ఋషిగణస్తుతా


వీడనెప్పుడుస్మరణమును విష్ణురూప! కౌస్తుభాంగ!

గాఢఁపుటుదధినిమునిగితి కమ్రకాంతుఁడా!


మాడమాడలందుఁదిరుగు మబ్బుదేహ! భక్తివశ్య!

 వీడనయ్యపదమునీది తోడుఁగోరుచున్


వాడిపోవనిసరముఁగల వాసుదేవ సంకటహర!

పాడియగును వరములీయ పంకజనయనా!



ఈడుజరుగుచున్నఁ గోర్కెలెచ్చువగుచునుండె యకట..

నేడుబ్రతుకు భారమగుచు నియతిఁదప్పెనే


దాడి చేయ వెతలు ముసిరె

దానవారి సైపఁజాల..

ఊడిగములుసేసెదనయ యోగదేశికా!


ఆడిఁదప్పకముగితినిడు యజ్ఞభోక్త! శ్రీనివాస!

ఏడు గడవు నీవె దేవ  యేలుకొమ్మురా..

----

No comments:

Post a Comment