Wednesday, 16 September 2026

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సందర్భానికి ప్రాంజలి ప్రభ కీర్తనలుగా.....

 


బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సందర్భానికి 

ప్రాంజలి ప్రభ కీర్తనలుగా.....


పల్లవి


ఓం నమో వేంకటేశాయ నమో నమః

ఓం నమో వేంకటేశాయ నమో నమః

శ్రీనివాస! శరణు నీ చరణములే

ఓం నమో వేంకటేశాయ కృపను నిమ్ము ॥


చరణం – 1


సంకటహరణి చరణాలు సాక్షి మాకు

నమ్మెద ఘనముగా నిన్ను నయనచోరా

హృదయనిలయుడవై హాయిని నింపి

పృథ్వీపతివై పాలించు పరమదయాళా ॥


ఓం నమో వేంకటేశాయ కృపను నిమ్ము ॥


చరణం – 2


ఒంటరిని చేసె జీవితం ఓడి గెలిచె

శక్తి చాలక సమయమందు శరణు చేరె

ధైర్యవచనములు నీ భక్తి ధరణి నిండె

దయచూపి నడిపించు దివ్య వేంకటేశా ॥


ఓం నమో వేంకటేశాయ కృపను నిమ్ము ॥


చరణం – 3


బుర్ర వేడెక్కి బురదలో మునిగినప్పుడు

స్థితిగతులన్ని మారి స్థిరము కానప్పుడు

కలవర కథలతో కనులు నిండినప్పుడు

కరుణ చూపి కాపాడు కలియుగ దైవా ॥


ఓం నమో వేంకటేశాయ కృపను నిమ్ము ॥


చరణం – 4


మ్రొక్కెద వరములివ్వవా చక్కనయ్యా

లెక్కలన్ని తెలిసినావు దేవదేవా

చుక్కల నడుమ చిక్కిన జీవునైన

చేతిపట్టి నడిపించు శ్రీనివాసా ॥


ఓం నమో వేంకటేశాయ కృపను నిమ్ము ॥


మంగళం


బ్రహ్మోత్సవ మహిమలో భక్తి పెంపు

భవసాగర తీరమునకు బాట చూపు

వేంకటాద్రి నిలయ! కృపాకటాక్షమిచ్చి

ఓం నమో వేంకటేశాయ రక్షణ నిమ్ము ॥

******

పల్లవి


ఓం నమో వేంకటేశాయ నమో నమః

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు

శరణాగత జనపాలకా శ్రీనివాసా

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు


చరణం – 


పరమ పురుషుని పదయుగ పదవి వలననే

కష్ట నిశ్చయంబు కళలు గడచి తీరునే

వచ్చిపోయెడి వర్షమై వరుస కలిపె మనసే

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు


చరణం – 


పొగడ చెట్టు సదా ధ్యాన పొంగు జూపు వేళలో

ప్రేమతో విరహముతోను పెనుగులాట వేళలో

గాలి వానలో తడిసియే గళము లేని వేళలో

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు


చరణం – 


పెదవి విప్పారి నయనాలు పిలుచుచుండె మదిలో

తలుపు తెరవగానే స్వాగతంబు జూపు కళలో

చిరునవ్వుతో సింగారి చేయు జూపు కలలో

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు


చరణం – 


ఆనతి అఖిలాండ పురుష ఆదిదేవ నమో నమః

అందరూ చేరి ఆనందనాథ నమో నమః

ఆత్మ బంధువై మాకును ఆత్రుత తీర్చు నమో నమః

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు

*****

పల్లవి


ఓం నమో వేంకటేశాయ నమో నమః

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు

శరణాగత జనపాలకా శ్రీనివాసా

ఓం నమో వేంకటేశాయ కృపయు నివ్వు


చిరుత జూపుమోము కలిగి చేరు వగుటె గోవిందా 

విచలిత నయనమ్ములతో వేంగి వున్నాము గోవిందా 

ఆమె మోహపాశాల్లోకి ఆశ చూపులగు గోవిందా 

ఓం నమో వేంకటేశాయ కృపయ నివ్వు    ...  ...    ...     


అంతరంగిక విషయాలు అర్ధమవలేదు గోవిందా 

పొగడ చెట్టుతోనుచెలిమి పిలుపు లగుటె గోవిందా 

సానుభూతి ప్రకటనల సలప రింత గోవిందా 

ఓం నమో వేంకటేశాయ కృపయ నివ్వు    ...  ...    ...    


పాదములు మోయు భద్రమ్ము పలుకలేదు గోవిందా 

వేళ్ళు జీవరసాన్నిచ్చు జీవి కాదు గోవిందా 

తనుబురదలోన మోము మాకశము చూపు గోవిందా 

ఓం నమో వేంకటేశాయ కృపయ నివ్వు    ...  ...    ...   . 

....

జీవి తాలను మార్చునా జీవ గమ్య మే గోవిందా 

ప్రేమ నీలోన చచ్చునా ప్రియము అనియుగోవిందా 

అందమును హచ్చ చేసేడి హంతకుడవు గోవిందా 

ఓం నమో వేంకటేశాయ కృపయ నిమ్ము     


***


చరణం – భావం:

వేంకటేశ్వరుని చిరునవ్వుతో కూడిన దివ్యముఖాన్ని దర్శించాలనే కోరికతో భక్తుల కళ్ళు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. దైవసన్నిధి పట్ల ఆకర్షణ, ఆత్మీయమైన ఆశ మనసును మోహపరుస్తున్నాయి. చివరికి స్వామి కృపే కోరుతున్నారు.


చరణం  – భావం:

మనలో జరిగే అంతరంగ భావాలు, ఆధ్యాత్మిక అనుభూతులు పూర్తిగా అర్థం కావడం లేదు. ప్రకృతితో, పొగడచెట్టుతో ఏర్పడిన చెలిమి కూడా ఒక దైవసంకేతంలా అనిపిస్తోంది. ఇతరుల సానుభూతి, ఓదార్పు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నా, అసలైన ఆధారం మాత్రం గోవిందుడే.


చరణం  – భావం:

మన శరీరం ఎన్నో భారాలను మోస్తున్నా, దాని అంతరార్థం మనకు పూర్తిగా తెలియదు. జీవితం ఇచ్చే జీవరసం, ప్రకృతి ఇచ్చే పోషణ మనిషిని నిలబెడుతున్నాయి. బురదలో ఉన్నా పైకి ఆకాశాన్ని చూసే ముఖంలా, కష్టాల మధ్య కూడా ఉన్నతమైన దైవకృపను చూడాలని భావం.


చరణం  – భావం:

జీవితం మారుతూ ఉంటుంది; కానీ జీవి చేరవలసిన గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. ప్రేమ, ప్రియతమ భావాలు మనలో ఎప్పటికీ నిలవాలని ఆకాంక్ష. అయితే బాహ్య సౌందర్యం వెనుక దాగిన కఠిన వాస్తవాలు మనిషిని బాధించవచ్చు. అందుకే చివరికి అందం, మోహం, బాధ అన్నిటినీ దాటి వేంకటేశ్వరుని కృపలోనే నిజమైన శాంతి, గమ్యం ఉందనే భావం వస్తుంది.

****

4

పల్లవి


మనోహర రూపమే కాదు తన్మయత్వమునిచ్చే రూపమే

మరచిపోలేని నా మనసున నిలిచిన వేంకటేశ రూపమే

శ్రీనివాసా! శ్రీవేంకటేశా! కరుణసాగరా!

పద్మావతి వల్లభా! పరమ దయామయా!


చరణం – 1


మల్లి జాజి పూలమాలలే కాదు మణిహార శోభవే

పసిడి వజ్ర కిరీట కాంతుల పరిమళ తేజమే

మరువ సుగంధముతో మెరిసే మంగళ విగ్రహమే

మరచిపోలేని నా హృదయ మందిరమందు నిలిచినవే


చరణం – 2


మంగళ వాద్య నాదములతో మధుర కీర్తనలతో

ప్రేమరసాల పరవశముతో భక్తి భావములతో

మధురాతి మధుర ప్రసాదములతో నైవేద్యములిచ్చితిమి

మనసులు దోచిన పద్మావతి రమణా! మమ్ము దయచూడుమి


చరణం – 3


మన్నింపు మన్నింపు మానవుల ప్రార్థన వినుమయ్యా

మమతల బంధ మాయలన్నియు మాయగొల్పుమయ్యా

కోప తాప కలుషములన్ని కరిగి ప్రేమ వెలసునయ్యా

కరుణతో మా హృదయములలో కల్యాణ గుణముల నింపుమయ్యా


చరణం – 4


మల్లాప్రగడ కవితలోని లోపముల క్షమించుమయ్యా

భక్తి పుష్ప సమర్పణలను సంతోషముగా స్వీకరించుమయ్యా

వేంకటాద్రి నివాస! భక్త జనావన! దయచూపుమయ్యా

శ్రీ వేంకటేశ్వర గోవిందా! శరణాగతులను కాపాడుమయ్యా


ముగింపు


గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా

పద్మావతి రమణ గోవిందా

వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా!

*****

05


పల్లవి


బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మ జరిపే బ్రహ్మోత్సవాలయ్య

కలియుగ దైవమునకు భక్తుల చేసే మహోత్సవాలయ్య

శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవము చూడవయ్య

శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు పోదాం పదండయ్య॥


చరణం – 1


ప్రత్యక్ష దైవమునకు పరమోత్సవ మహిమలయ్య

పరమపావన వేదఘోషల పరిమళములయ్య

కమలలోచనుని సేవలో భక్త జనుల సందడయ్య

వేంకటాద్రి శిఖరమంత వెలసె దివ్య వేడుకలయ్య॥


చరణం – 2


గంధర్వుల గాన నృత్యములు గగనమున నిండునయ్య

దేవగణముల స్తోత్రధ్వనులు దిక్కులెల్ల మారుమోగునయ్య

సచీదేవి ఛత్రము పట్టి సేవలందించునయ్య

ఇంద్రుడు చామరములు వీచి మహిమ చాటునయ్య॥


చరణం – 3


పల్లకిలో ఊరేగు శ్రీనివాసుని చూడవయ్య

పరవశమై భక్తహృదయము పులకరించునయ్య

శంఖచక్రధరుని రూప సౌందర్యము గాంచవయ్య

పద్మావతి వల్లభుని కరుణారసము పొందవయ్య॥


చరణం – 4


మొదటి రోజు పెద్దశేష వాహనముపై వెలసునయ్య

ఉభయ నాచ్చియారులతో ఉత్సవమూర్తి సాగునయ్య

రెండవ రోజు హంసవాహనముపై హాయిగా విహరించునయ్య

మలయప్ప స్వామి మహిమను మనసారా చూడవయ్య॥


చరణం – 5


మూడవ రోజు సింహవాహనముపై నరసింహుడై రారయ్య

భక్తుల భయములు తీర్చు పరాక్రమమును చూపునయ్య

కల్పవృక్ష వాహనముపై కరుణాకటాక్షములయ్య

శ్రీదేవి భూదేవులతో శ్రీనివాసుడు వెలసునయ్య॥


ముగింపు


గోవింద నామస్మరణతో గుండెలు నిండునయ్య

వేంకటేశుని దర్శనముతో జన్మ ధన్యమగునయ్య

బ్రహ్మోత్సవ వైభవమును భక్తులందరు చూడవయ్య

శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు పోదాం పదండయ్య॥


****


06


చరణం – 6


నారదుడు వీణానాదముతో నామగానము చేయునయ్య

నాలుగు వేదములతో బ్రహ్మ స్వయముగా స్తుతించునయ్య

వరుణుడు జలధారలతో మంగళాభిషేకము చేయునయ్య

శ్రీదేవి భూదేవి సమేతుని వైభవమును చూడవయ్య॥


చరణం – 7


ఐదవ రోజు మోహినీ రూపముతో మలయప్పుడై వెలసునయ్య

అమృతమయ కరుణ చూపి భక్తుల హృదయము గెలుచునయ్య

ఆరవ రోజు హనుమద్వాహనముపై ఊరేగి రక్షించునయ్య

రామభక్త హనుమంతునితో ధర్మమార్గము చూపునయ్య॥


చరణం – 8


ఏడవ రోజు సూర్యప్రభ వాహనముపై ప్రకాశించునయ్య

అజ్ఞానాంధకారములన్ని తొలగించి వెలుగు నింపునయ్య

బంగారు రథముపై శ్రీదేవి భూదేవితో విహరించునయ్య

వేంకటాద్రి వీధులెల్ల వైకుంఠముగా మార్చునయ్య॥


చరణం – 9


మత్స్యావతారమునందు వేదరహస్యము కాపాడితివయ్య

కూర్మావతారమునందు మందరగిరిని మోసితివయ్య

వరాహావతారమునందు భూదేవిని రక్షించితివయ్య

వేంకటేశ కరుణతో భక్తులకు ముక్తి ప్రసాదించితివయ్య॥


చరణం – 10


భోజన చింత భోగచింత బంధములలో చిక్కితిమయ్య

భౌతిక మోహముల వలన భక్తిమార్గము మరచితిమయ్య

గురువులను పెద్దలను గౌరవింపక దూరమైతిమయ్య

దయచేసి జ్ఞానదీపము వెలిగించి దారి చూపుమయ్య॥


చరణం – 11


పరాన్నాశల వెంట తిరిగి చపలచిత్తులమైతిమయ్య

పరుల దోషములనే చూచి స్వదోషములు మరచితిమయ్య

శ్రీలక్ష్మీ వేంకటేశా! మనోవక్రతను సరిచేయుమయ్య

నీ పాదసేవలో నిత్యము నిలుపుము తండ్రీయ్య॥


ముగింపు


గోవిందా గోవిందా గోకులానంద గోవిందా

శ్రీనివాస గోవిందా శరణాగత వత్సల గోవిందా

పద్మావతి రమణ గోవిందా పరమకరుణామయ గోవిందా

వేంకటేశా గోవిందా మమ్ము కాపాడుము గోవిందా॥


07.


చరణం – 12


నారసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించావయ్య

భక్త ప్రహ్లాదుని రక్షించి భయములన్ని తొలగించావయ్య

వామన రూపముదాల్చి బలిచక్రవర్తిని గెలిచావయ్య

మూడు అడుగులతో లోకాలన్నియు నీ మహిమ చూపావయ్య॥


చరణం – 13


పరశురామ అవతారముతో అధర్మమును శిక్షించావయ్య

ధర్మమార్గ స్థాపనకై దుష్టశక్తిని దణ్డించావయ్య

రామకృష్ణ రూపములందు లోకహితము చాటావయ్య

కలియుగమున వేంకటేశుడై భక్తులను కాపాడావయ్య॥


చరణం – 14


కృష్ణావతారములో మన్ను తిన్న నోరును చూపితివయ్య

యశోదమ్మకు విశ్వరూప వైభవమును గాంచించితివయ్య

గోపగోపికల హృదయములలో ప్రేమసుధను నింపితివయ్య

గోవర్ధనగిరి ఎత్తి గోకులాన్ని రక్షించితివయ్య॥


చరణం – 15


బుద్ధావతారమునందు కరుణామృతము బోధించితివయ్య

అహింసా ధర్మ మార్గమును జగతికి తెలియజేసితివయ్య

జ్ఞానదీపము వెలిగించి జనుల మనసులు మార్చితివయ్య

సత్యశాంతి సౌభ్రాతృత్వ సుగుణములను పెంపొందించితివయ్య॥


చరణం – 16


కల్కి అవతారముతో కలియుగాంతమున వెలసితివయ్య

అధర్మాంధకారములను ఖడ్గముతో తొలగించితివయ్య

ధర్మరాజ్య స్థాపనకై దివ్యాశ్వముపై రానున్నావయ్య

భక్తుల హృదయ మందిరమున నిత్యముగా నిలిచియున్నావయ్య॥


చరణం – 17


శ్రీలక్ష్మీ వేంకటేశా! మా నైవేద్యములు స్వీకరించవయ్య

భక్తుల కోర్కెలన్నియు కరుణతో నెరవేర్చవయ్య

శరణు శరణు శ్రీనివాసా! దయతో మమ్ము పాలించవయ్య

వేంకటాద్రి నివాసా! మోక్షమార్గము చూపించవయ్య॥


ముగింపు


గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా

పద్మావతి రమణ గోవిందా

భక్తవత్సల గోవిందా

వేంకటేశా గోవిందా॥

****

మన్నించుమా తప్పులను వేంకటేశ్వరా


పల్లవి

మన్నించుమా తప్పులను వేంకటేశ్వరా

మా మనసు నిలుపుమయ్యా శ్రీనివాసా


చరణం – 1

మంకెన పువ్వు ఎరుపు, మాణిక్యము ఎరుపు

మందారం ఎరుపు, మావి చిగురు ఎరుపు

మంగళహారతి మెరుపు, గంధము పసుపు

శ్రీ వేంకటేశ్వరా నీ రూపమే మాకు మరుపు


చరణం – 2

మరచిపోలేదు నీకు కానుకలు అర్పించినాను

మనసు ప్రశాంతముగా ఉంచుతావని తలచినాను

మరువలేని మమతను పంచుతావని తలచినాను

మాలలు ధరించి పొందావు వకుళమాత దీవెనను


చరణం – 3

మాలోని అజ్ఞానము తొలగించే గురువులా

అహంకారము తొలగించి ప్రేమను పంచే తల్లిలా

అసంతృప్తిని తొలగించి సంతృప్తినిచ్చే దేవుడిలా

మాలో సఖ్యత కల్పించేవు పద్మావతి భర్తలా


చరణం – 4

మారణహోమం సృష్టించువారిని మట్టుపెడుతున్నావు

మానవుల దుఃఖాలు తొలగించి సుఖాలు కల్పిస్తున్నావు

మాపైటి మనసును కల్లోలమునుండి తప్పిస్తున్నావు

మా చేత పాదాలు కడిగించుకొని పద్మావతిని చేపట్టినావు


ముగింపు

మన్నించుమా తప్పులను వేంకటేశ్వరా

మా మనసు నిలుపుమయ్యా శ్రీనివాసా

ఓం నమో వేంకటేశాయ — నమో నమః

ఓం నమో వేంకటేశాయ — నమో నమః

*****


Monday, 14 September 2026

కీర్తనలు

 లంబోదరా — సఖ్యతా గీతం


పల్లవి

లంబోదరా! కరుణాకరా!

సమయ సంతృప్తి సఖ్యతనీయరా!

వినయ విజయము నీదేరా

కలసి కలియుగ బ్రతుకురా!


చరణం – 1

బింబాధర మధురిమ నీవురా

సంభావన సద్భావమీయరా

సఖ్యతార్థము మేలు గాంచరా

కామ్యతా భావ సిద్ధి చేయరా!


చరణం – 2

మాటలో మాధుర్యముండరా

మనసులో మమతలు నిండరా

కలహములు దూరము చేయరా

కలసి సుఖముగా బ్రతికించరా!


చరణం – 3

వినయమే విజయమై నిలువరా

వివేకమే వెలుగుగా వెలిగరా

సహనమే సఖ్యతకు వారధిరా

సత్యమార్గమున నడిపించరా!


చరణం – 4

కోరికలన్నియు కరిగించరా

కుటుంబ బంధములు కాపాడరా

అందరి హృదయముల నింపరా

అనురాగామృతము పంచరా!


చరణం – 5

లంబోదరా! విఘ్నేశ్వరా!

లోకహితము కోరే దయాకరా!

సమయ సంతృప్తి ప్రసాదించరా

కలసి కలియుగ బ్రతుకురా!

****†**


కీర్తన – 1


పరిపూర్ణత కొరకు జాగరూకత


పల్లవి


పరిపూర్ణత కొరకు జాగరూకతతో

పరమాత్మ నామమున్ పలుకుదము రామా

పరిశుద్ధ జీవన పరమపావనమై

పరిశీలించుము మనసా… రామా ॥


అనుపల్లవి


మర్మము లేనిది మనసు నిజమగును

నిర్మల హృదయము నిలకడనిచ్చును

జిజ్ఞాస హృదయము చిత్తమున్ మేల్కొల్పి

జీవన మార్గమున్ జ్యోతిగ నిలుపును ॥


చరణం – 1


మాటుపడని అంతరింద్రియమే జీవము

సోదర భావమే సహనమై నిలువాలి

సలహా నియమములు స్వీకరించుటకును

సంసిద్ధత కలిగి యుండుము రామా ॥


దేశికుని యెడ ధర్మానుష్ఠానముతో

బుద్ధి విశ్వాసమున్ హృదయమున్ ఉంచి

సత్యసూత్రములను పంచుచు సాగితే

సద్గతి మార్గమున్ చూపుము రామా ॥


చరణం – 2


వ్యక్తిగతముగా తనకు తానే సహనము

యుక్తి విధానముతో మానసమున్ నడిపి

శక్తి మలుపులను శాంతితో గమనించి

సమయ గణమంత సార్థకమగునే ॥


భక్తి తత్త్వము వివరమై వెలుగొంద

బంధ భావములు భ్రమలై తొలగిపోగా

చిత్తశుద్ధితో చిన్మయ మార్గమున

చేరే దారిని చూపుము రామా ॥


చరణం – 3


మాటలో నిజము, మనసులో నిష్ఠ

చేతలలో ధర్మము, చూపులో కరుణ

జీవితమంతయు జాగరూకతతో

జయమున్ పొందుటే పరిపూర్ణత రామా ॥


సహనమే బలమై, సత్యమే మార్గమై

వినయమే భూషణమై, భక్తియే శక్తియై

నిత్యము నీ నామ స్మరణతో సాగెద

నిర్మల జీవనము ప్రసాదించు రామా ॥

******


మనసు మంచిమార్గము — తత్త్వ కీర్తన


పల్లవి:

మనసు మంచిమార్గము చూపవే గణనాథా

మనసు నిలకడనిచ్చి మాయను తరిమేవా

వక్రతుండా! పార్వతీ సుతా!

విఘ్నములన్నియు తొలగించు గణనాథా!


చరణం 1:

కళ్లలో మాధుర్యము, మాటలో నమ్మకము

అభిమానుల నమ్మకము నిలుపు నడతయు

తప్పులు పట్టుటకన్న తత్త్వము నేర్పి

కొత్త ఆలోచనలతో మనసును నడుపవే!


చరణం 2:

సహనమున్న మనిషికి సమయము మారును

నడకతో ఆరోగ్యము, నమ్మకము పెరుగును

సమస్యలెన్నున్నా పూజ్యభావముతో

ఓర్పు ఓదార్పులతో ఓపిక నేర్పవే!


చరణం 3:

దీపపు వెలుగులేక మనసు చీకటగును

ఆకలి కలిగినపుడు ఆరాటమగును

ప్రేమ కోప కష్టాలు కాలంతో మారును

ప్రేమను నింపి ఒంటరితనము తొలగించవే!


చరణం 4:

వివేక వినమ్రతలే మనిషికి మార్గము

విద్యను బట్టియే మాటకు విలువగును

వృత్తి కళలతోనే వృద్ధి కలుగును

అనుభవ జ్ఞానమే జ్ఞప్తిలో నిలుపవే!


చరణం 5:

పదవి గౌరవములు కాలముతో మారును

ప్రవర్తన బట్టియే మనసుకు శాంతి

ధర్మ దానములతో సమయ తృప్తి కలుగును

నిలకడైన మనసుతో మాయను తరిమేవా!


చరణం 6:

వరదల వర్షమువలె కరుణను కురిపించి

బాధలన్నీ తీర్చే దయామయుడవు

తుంపర తుంపరగా కృపను పెంచి

డమ డమా నాదముతో దారి చూపవే!


ముగింపు:

లోకము పూజించు విఘ్న నాయకుడవు

విద్యకు, బుద్ధికి, జ్ఞానానికి దాతవు

శ్రీకర వక్రతుండా! గణనాథా!

మా మనసు మంచిమార్గమున నడిపించవే!


శ్రీ గణనాథాయ నమః 🙏

******

తిరుమల 

పల్లవి

గుణముల మూలము నీవే వేంకటేశా
గురుతర తత్త్వము నీవే శ్రీనివాసా
మార్గదర్శివై మదిలో నిలిచేవాడా
మమ్ము కరుణతో నడిపించు వేంకటేశా ॥

చరణం – 1

గుణము లెరగని గొప్ప శక్తి నీవే
గుణగణముల గమ్యమంత నీవే
వినగా ప్రణమిల్ల వేడుకొనెద నిన్నే
కైవల్య దాయకా కాపాడవే ॥

తనువును సేవకై తత్త్వము బోధించి
మనసును మలచి మమతలు తొలగించి
అనుగ్రహ జలధీ ఆదరించి నన్ను
అంతరంగమున నిలిచేవాడా ॥

చరణం – 2

పదము విధము నీవే పద్య గద్యములలో
పదనిసల కధలలో పాటల రూపములో
చదువులలో నీవే శాస్త్రములలో నీవే
చిత్తమును మార్చు చిన్మయ రూపా ॥

అక్షరమందు నీవే అర్థమందు నీవే
భక్తుల హృదయమందు భావమందు నీవే
సత్య స్వరూపమై సర్వమందు నీవే
శరణు శ్రీ వేంకట రమణా ॥

చరణం – 3

గట్టి పట్టు పట్టి గానము చేసెదను
పట్టు వీడక ఫలము కోరెదను
వట్టి మాట కాదిది వాంఛతో పలికితిని
ఓర్పు ప్రసాదించు ఓ వేంకటేశా ॥

కష్టముల నడుమ నిలిపి కరుణ చూపి
నిష్ఠతో భక్తి మార్గమున నడిపి
ఇష్టార్థ సిద్ధిని ఈనాటి దయతో
ఇవ్వుము శ్రీనివాసా ॥

చరణం – 4

మార్గదర్శి గాను మానసమున ముందుండి
మేళవింపులన్ని మేలుగ జేయుము
శక్తులన్ని ఒకటై సానుకూలమై
సర్వహితము కలుగజేయుము ॥

లోకక్షేమమునకు లోలుడవై నిలిచి
భక్త జనావళిని భద్రముగా కాపాడి
సార్వభౌముడవై సర్వేశ్వరుడవై
సప్తగిరీశా పాలించుము ॥


కీర్తనలు

 




"నేను కష్టాలు వదలను లేదు 

 నేను పగ్గాలు పట్టను లేదు

 నేను నష్టాలు చెప్పను లేదు

 నాది ఇష్టాలు నీకు చెప్పగా వస్తే 

 నా చూపు మార్చి నన్ను పడ వేసావు వేంకటేశ్వరా 


బండి చేర్చావు గమ్యాన్ని చూపకే 

నిండు పున్నమి కూడా నిష్పలంబు చేసావు 

యత్నమంతయు నీరు కార్చావు 

విఫలమైన ఎలాంటి కోరిక అడగలేదు వేంకటేశ్వరా 


ఇమ్ముగ ఆశతో నీదరి చేరా

సమ్మడము కలుగు రీతి కృషిచ్చేసా 

నేమ్మిని ప్రభువు సహకారం కోరా 

రమ్మున్న నీసేవలు నే చేసెద వేంకటేశ్వరా 


(తిరుమల నుండి )


భావసారం:

కష్టాలను తప్పించుకోలేదు, బాధ్యతలను వదిలిపెట్టలేదు, నష్టాల గురించి ఫిర్యాదు చేయలేదు. తన కోరికలను మాత్రమే స్వామికి వినిపించిన భక్తుడు, తన ఆశలు నెరవేరక జీవితం మార్గం తప్పినట్లుగా అనుభవిస్తున్నాడు.

గమ్యం చూపకుండా ప్రయాణంలో నడిపించావని, పున్నమి వెలుగులాంటి అవకాశాలనూ ఫలించనివ్వలేదని, చేసిన ప్రయత్నాలన్నీ నీరైపోయాయని వేదన వ్యక్తం చేస్తున్నాడు. అయినా తాను అసాధ్యమైన కోరికలు అడగలేదని స్వామిని ప్రశ్నిస్తున్నాడు.

చివరికి ఆశతో తిరుమల చేరి, తన వంతు కృషి చేసి, ప్రభువు సహకారమే కోరానని, అవకాశం ఇస్తే నీ సేవలకే జీవితాన్ని అంకితం చేస్తానని వేడుకుంటున్నాడు.

*****


శీర్షిక: “నీవే నీవే వేంకటేశ్వరా” లేదా “శరణాగతి గీతం” ।


.తిరుమల 


ఏతీరుగా నె చెప్పేది 

కాలమే నని నె ఒప్పేది 

సప్తగిరి కొండలపై నుండి చూసేది 

నీవే నీవే వేంకటేశ్వరా 


నీవు యుంచిన చోటనే నిశ్చళంగా 

నిలచి యుందును కడదాక నిబ్బరంగా 

నేను నటనలన్నియుచేయు నీపరంగా 

నాది యన్నది నీదేగా నిబ్బరంగా వేంకటేశ్వరా 


కొండ నెక్కెడి దీపాలు కొడిని దులిపే 

ఉండబట్టాను లేకయు తడుపు నలిపే 

నిండు తనంబు నీదయ నీడ కోరే 

నుండలేని తనము నాకు సూత్ర మేళా వేంకటేశ్వరా 


జగతిపాలనాలిని గని జయము చేరుస్తూ 

ప్రగతి ప్రభవము గాంచ గలగ జేస్తూ 

నిగమ నిగమానంద

 తత్పరవైతివి 

యుగము నందు కలియుగ దేవా వేంకటేశ్వరా 


భావసారం:

“నా జీవిత గమనాన్ని, విధి రహస్యాన్ని పూర్తిగా వివరించలేను; అంతా కాల మహిమ అని మాత్రమే ఒప్పుకోగలను. సప్తగిరులపై నుంచి నా జీవనాన్ని దర్శిస్తూ నడిపించేది నీవే, ఓ వేంకటేశ్వరా!

నీవు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడే స్థిరంగా నిలిచి, చివరి వరకు ధైర్యంగా జీవిస్తాను. నేను చేసే ప్రతి కార్యమూ నీ సంకల్పమే; నాదని భావించేది కూడా నిజానికి నీదే.

తిరుమల కొండలపై వెలిగే దీపాల వలె నా జీవితమూ ఎన్నో కష్టసుఖాలను అనుభవించింది. అయినా నీ కరుణా నీడకోసమే నా మనసు తపిస్తోంది. నీ సన్నిధి లేక నేను ఉండలేను.

జగత్తును పాలిస్తూ, జీవులకు జయాన్ని, ప్రగతిని ప్రసాదిస్తూ, వేదనిగమాల ఆనందస్వరూపుడై, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులను కాపాడే శ్రీనివాసుడా! నీకే నా సంపూర్ణ శరణాగతి.”

*******

శీర్షిక: “నమ్మితి నిన్ను వేంకటేశ్వరా”

లేదా

“భక్తుని శరణాగతి”.

తిరుమల 03


నమ్మితి నిన్ను 

సమ్మతి కోర వచ్చినాను 

ముమ్మర భాధలున్నను 

ఉమ్మడి తీరుగా నా భక్తి తెలిపినాను 


గొప్పవాడ్ని అని నేననా లేదు 

గోడు చెప్ప వచ్చిన వాణ్ని కాదు 

బక్కవాడ్ని నీ దరినా చేరాలని ఉన్న ఆశగాడ్ని 

భాధ యంతా నీదయా నాప్రాప్తి వేంకటేశ్వారా 


ఊరు వదిలినా నిన్ను వదలను 

పేరు పోయినా మనసున వదలను 

వారు వీరని యన్నాను పట్టించుకోను 

చేరువ విధి చిత్రమే నా స్థితులు వేంకటేశ్వరా 


సంతుతో కూడి నీభక్తి సమయ మిదియే 

పంతమాకర్మయా తెలపగను లేను 

వింతలన్నియు సమరమై వినయ కలలు 

శాంతివిశ్వము నందున లేదు లేదని చిప్పుచున్నా 

వేంకటేశ్వరా j నమ్మి నాను వేంకటేశ్వరా


*****

భావసారం – తిరుమల (03)


ఈ గేయంలో భక్తుని వినమ్రత, అచంచల విశ్వాసం, జీవిత కష్టాల మధ్య దైవశరణాగతి స్పష్టంగా వ్యక్తమయ్యాయి.


భక్తుడు శ్రీ వేంకటేశ్వరుని నమ్ముకొని ఆయన సమ్మతిని కోరుతూ తిరుమలకు వచ్చానని చెబుతున్నాడు. ఎన్నో బాధలు ఉన్నప్పటికీ తన భక్తిని నిజాయితీగా సమర్పిస్తున్నాడు. తాను గొప్పవాడిని కాదని, కేవలం స్వామి సన్నిధి చేరాలనే ఆశతో వచ్చిన సాధారణ భక్తుడినని వినయంగా చెప్పుకొంటున్నాడు. తన బాధలన్నీ స్వామి కృపతోనే అర్థవంతమవుతాయని విశ్వసిస్తున్నాడు.


ఊరు, పేరు, ప్రతిష్ఠలు పోయినా స్వామిని మాత్రం విడువనని అంటున్నాడు. ఇతరుల అభిప్రాయాల కంటే భగవంతుని సాన్నిధ్యమే ముఖ్యమని భావిస్తున్నాడు. ప్రపంచంలో కల్లోలాలు, పోటీలు, అశాంతి పెరిగినా నిజమైన శాంతి దైవభక్తిలోనే ఉందని తెలియజేస్తున్నాడు.


నియమనిష్ఠలతో జీవిస్తూ, భయరహితమైన భక్తి బంధాన్ని కోరుతూ, తనను కాపాడమని వేడుకుంటున్నాడు. చివరకు స్వామి దివ్య దృష్టి, దయ, లీలలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి తనను ఆయనకు అర్పించుకుంటున్నాడు.

*****

శీర్షిక:స్వప్న జీవితం – వేంకటేశ్వర శరణం”


తిరుమల 


ఎంతవారికైనా 

తప్పని కర్మబంధము 

శాంతి కోరెద వేంకటేశ్వరా 



బొట్టు పెట్టినంత మాత్రాన బుద్దిమంతుడను కాను 

పట్టు బట్టి విద్య నేర్చినా ఏమీ తెలియని వాడిని నేను 

గట్టు మీద కూర్చొని  సలహాలు ఇవ్వలేను 

పట్టు బట్టి నిన్ను వేడుకుంటున్నాను వేంకటేశ్వరా 


 నేను ఆశపడను అందనిదాని కోసమొన్నడూ  నచ్చనిదానికోసం కష్టపడను ఎన్నడూ 

. నీకోసం కష్టపడేవారిని మరచిపోను ఎన్నడూ .

నిన్ను ఇష్టపడేవారిని మాత్రం. వదులుకోను ఎన్నడూ... వేంకటేశ్వరా "



 ఇది(జీవితం) ఒక స్వప్నం అంతే., వేంకటేశ్వరా 


స్వప్నం అనేది అబద్ధం అని తెలిశాక, కల్పించావా వేంకటేశ్వరా 


పండు రసభారంతో... రాలినట్లు 

వయసుమల్లిన జీవులు రాలినట్లు 

 బ్రహ్మానంద రసానుభూతితో నిండిన మనస్సు... పంచు వేంకటేశ్వరా 

అజ్ఞానం నుండి విడువడు మనసు నిచ్చు వేంకటేశ్వరా 

****


భావసారం – తిరుమల (04)


ఈ గేయంలో జీవన సత్యం, కర్మబంధం, వినయం, వైరాగ్యం, భక్తి, జ్ఞానాన్వేషణ కలగలిపి ఉన్నాయి.


భక్తుడు “ఎంత గొప్పవారికైనా కర్మబంధం తప్పదు” అని అంగీకరిస్తూ, ఆ బంధాల మధ్య మనశ్శాంతిని ప్రసాదించమని శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. నుదుట బొట్టు పెట్టుకోవడం వల్ల గాని, విద్యాభ్యాసం చేయడం వల్ల గాని తాను జ్ఞాని కాలేదని వినయంగా ఒప్పుకుంటున్నాడు. ఇతరులకు ఉపదేశాలు చేయగల స్థితిలో లేనని, తనకు తెలిసింది ఒక్కటే—స్వామిని ఆశ్రయించడం అని చెబుతున్నాడు.


అందనిదాని కోసం ఆశపడనని, ఇష్టంలేని దాని కోసం శ్రమించనని, దైవసేవలో నిమగ్నమైన వారిని మరచిపోనని, భగవంతుని ప్రేమించే భక్తులను విడువనని తన సంకల్పాన్ని వెల్లడిస్తున్నాడు.


జీవితం ఒక స్వప్నమని గ్రహించిన మనసు, “ఈ మాయా ప్రపంచాన్ని ఎందుకు సృష్టించావు?” అని భగవంతుని ప్రశ్నిస్తుంది. అయితే ఆ ప్రశ్నలో తిరస్కారం కాదు, తత్త్వాన్వేషణ ఉంది. చివరగా, పండు పక్వానికి వచ్చి సహజంగా రాలినట్లే, వృద్ధాప్యానికి చేరిన జీవులు కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్తారని గుర్తుచేస్తూ, బ్రహ్మానంద రసంతో నిండిన మనస్సును ప్రసాదించి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తి కలిగించమని వేడుకుంటున్నాడు.

******

శీర్షిక:

“కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా”


తిరుమల 


జ్ఞానము విజ్ఞానము తెలియనివాడ్ని 

ధ్యానము తీరు బ్రతికేవాడ్ని 

ధర్మంమ్ముకొరకు నిలిచేవాడ్ని 

సత్య వాక్కుగా బ్రతకాలనీ నీ కారణా కటాక్షాలకు ఈ జన్మ చాలు వేంకటేశ్వరా 


పొగ నడుమ వేడిది అగుచు 

ధగధగ రుపు వేంకటేశ్వరుని తిరుమల స్వర్గమనుచు 

ఆశక్తే సర్వలోకాల రక్షణ యనుచు 

మ్రాక్కిన వారికి మొక్కులు దీర్చ శ్రీ వేంకటేశ్వరా 


సత్య ధామమని యండ్రు 

పరమహోమమనిచుండ్రు 

ప్రకృతి ప్రశాంత ధామ మండ్రు 

వేదమంత్ర శక్తియున్న వాసమండ్రు 

మంత్రపుష్ప మూల ఆర్య అండ్రు 

కాలతీరు జన రక్షగా నడ్రు 

కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా 


శుబ్రతల మధ్య సిద్ధిని కోరె దా 

యోగిని కాను నిరతము భక్తి చేరెదా 

యత్నము మాత్రమే అంతా నీదయ తీరుగా 

ఈశరీరం నీసృష్టి నీఇష్ట ప్రకారమే వేంకటేశ్వరా 


******

ఎన్ని సార్లు వచ్చినా కరుణించే వాడివయ్యా”


తిరుమల 05


బ్రోచెద వీవని నమ్ముచుంటితియు 

నోమును నోచెద నిరతి తోడ మదియు 

గోవిందా యని అలాపణల భక్తియు 

సోలితి నయ్యా వ్యధల వలన వేంకటేశ్వరా 


శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా 

సోమేశ్వరునితో చెలిమిగా గోవిందా 

సర్వ ప్రాణులను బ్రోచెదవు గోవిందా 

సమయ గోప్యత సంతసంబు గోవిందా 


చెక్కులెన్ని యున్న చింత లేదు గోవిందా 

ఒక్క మాటపైననిలబడ లేదు గోవిందా 

చుక్క మధ్య నమ్మియు నటన గోవిందా 

మక్కువగను వేడుకగాను నీ దయ గోవిందా 


తిరుమల లడ్డు తీపి ఇదేనని యేల చెప్పదనయ్య 

ప్రసాదాలు అమృతం లా నున్నవి గదయ్యా 

తొక్కిసలాటలో కూడా నీవే ఉన్నావయ్యా 

ఎన్ని సార్లు వచ్చినా కరుణించే వాడివయ్యా వేంకటేశ్వరా 


****

భావసారం – తిరుమల (

ఈ గేయంలో భక్తుని విశ్వాసం, గోవింద నామస్మరణ మహిమ, తిరుమల అనుభూతి, శ్రీ వేంకటేశ్వరుని అపార కరుణ ఎంతో హృద్యంగా వ్యక్తమయ్యాయి.

భక్తుడు “నన్ను కాపాడేది నీవే” అనే నమ్మకంతో నిత్యం వ్రతాలు, నోములు ఆచరిస్తూ, “గోవిందా” అనే నామాన్ని జపిస్తున్నాడు. అయితే జీవిత వ్యథలు, కష్టాలు అతనిని అలసింపజేసినా, భక్తి మాత్రం తగ్గలేదు. ఆ నామస్మరణే అతనికి ఆధారం.


శ్రీనివాసుడు, వేంకటేశుడు, గోవిందుడు సమస్త జీవరాశులను రక్షించే కరుణామయుడని కీర్తిస్తున్నాడు. కాల రహస్యాలు, జీవన గమనాలు అన్నీ ఆయన సంకల్పంలోనే నడుస్తాయని భావిస్తున్నాడు.


లోకంలో ఎన్నో లెక్కలు, చిక్కులు, మాటల మార్పులు ఉన్నా వాటి గురించి చింతించకుండా, స్వామి కృపనే ఆశ్రయంగా తీసుకుంటున్నాడు. మనుషుల నటనల మధ్య కూడా తన విశ్వాసం మాత్రం గోవిందునిపైనే నిలిచివుందని చెబుతున్నాడు.


చివరగా తిరుమల యాత్రానుభూతిని ఎంతో సహజంగా వర్ణిస్తున్నాడు. తిరుమల లడ్డూ తీపిని మాటల్లో చెప్పలేమని, ప్రసాదాలు అమృతస్వరూపమని, భక్తుల రద్దీ మధ్య కూడా స్వామి సాన్నిధ్యమే అనుభూతి అవుతుందని చెబుతున్నాడు. ఎన్నిసార్లు దర్శనానికి వచ్చినా అదే కరుణ, అదే అనుగ్రహం ప్రసాదించే దయామూర్తి వేంకటేశ్వరుడని భక్తుడు ఆనందభరితంగా స్తుతిస్తున్నాడు.

***

భావసారం – తిరుమల 


ఈ గేయంలో భక్తుని వినయం, ధర్మనిష్ఠ, సత్యజీవనం, తిరుమల మహిమ, సంపూర్ణ శరణాగతి ఎంతో హృద్యంగా ప్రతిఫలించాయి.


భక్తుడు తనను తాను జ్ఞానవంతుడనిగానీ, విజ్ఞానసంపన్నుడనిగానీ భావించడు. ధ్యానం ఎంతగా వచ్చునో అంతగా జీవిస్తూ, ధర్మం కోసం నిలబడే సాధారణ భక్తుడినని చెబుతున్నాడు. సత్యవాక్కుతో జీవించాలని కోరుకుంటూ, వేంకటేశ్వరుని కరుణాకటాక్షాలే తన జీవితానికి పరమసంపద అని భావిస్తున్నాడు.


తిరుమల కొండలను భక్తుడు స్వర్గసీమగా దర్శిస్తున్నాడు. పొగమంచు మధ్య ప్రకాశించే శ్రీ వేంకటేశ్వరుని మహిమను స్మరిస్తూ, సమస్త లోకాల రక్షణకై నిలిచిన దివ్యశక్తిగా వర్ణిస్తున్నాడు. భక్తితో మొక్కిన వారి కోరికలను తీర్చే దయామయుడని కీర్తిస్తున్నాడు.


తిరుమల సత్యధామం, యజ్ఞహోమ ఫలభూమి, ప్రకృతి ప్రశాంత నిలయం, వేదమంత్రాల శక్తి నిండిన పుణ్యక్షేత్రమని భావిస్తున్నాడు. మంత్రపుష్పాల సుగంధం, వేదఘోషల పవిత్రత, జనరక్షణ కోసం నిలిచిన దైవకృప అక్కడ సాక్షాత్కారమవుతుందని చెబుతున్నాడు. అందుకే తనకు కపటరహితమైన మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాడు.


చివరగా, తాను యోగి కానప్పటికీ భక్తిమార్గంలో నడవాలనుకుంటున్నాడు. తన ప్రయత్నం మాత్రమే తనదని, ఫలితమంతా స్వామి కృపేనని అంగీకరిస్తున్నాడు. ఈ శరీరం కూడా భగవంతుని సృష్టే కాబట్టి, తన జీవితం అంతా ఆయన సంకల్పానుసారమే సాగాలని సంపూర్ణ శరణాగతితో ప్రార్థిస్తున్నాడు.

*****

 సప్తపద్యాం వేంకటేశనుతిః..

--

 ఏడుకొండలందునున్నవేంకటేశ! నీవె దిక్కు 

ఱేఁడువీవె ప్రోవ మ


మ్ము  ఋషిగణస్తుతా


వీడనెప్పుడుస్మరణమును విష్ణురూప! కౌస్తుభాంగ!

గాఢఁపుటుదధినిమునిగితి కమ్రకాంతుఁడా!


మాడమాడలందుఁదిరుగు మబ్బుదేహ! భక్తివశ్య!

 వీడనయ్యపదమునీది తోడుఁగోరుచున్


వాడిపోవనిసరముఁగల వాసుదేవ సంకటహర!

పాడియగును వరములీయ పంకజనయనా!



ఈడుజరుగుచున్నఁ గోర్కెలెచ్చువగుచునుండె యకట..

నేడుబ్రతుకు భారమగుచు నియతిఁదప్పెనే


దాడి చేయ వెతలు ముసిరె

దానవారి సైపఁజాల..

ఊడిగములుసేసెదనయ యోగదేశికా!


ఆడిఁదప్పకముగితినిడు యజ్ఞభోక్త! శ్రీనివాస!

ఏడు గడవు నీవె దేవ  యేలుకొమ్మురా..

----

కీర్తనలు

 

*
తిరుమల

పల్లవి

ఇదేమి లోకమో దేవా, ఇదేమి విధియో దేవా
మైళ్ళ కొద్దీ నడచి వచ్చి నీ దరి చేరితిమి దేవా
క్షణమొక దర్శనమే చాలు మా కష్టాలు కరిగిపోవా
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరా!

చరణం – 1

ఉచిత నడక మార్గమున సాగి అలసిన దేహముతో
గంటల తరబడి వేచియుండి గడిపితిమి ఆశతో
నీ రూపమును చూడగానే మరిచెదము బాధలన్నీ
కరుణ చూపి కాపాడవయ్యా కలియుగ దైవమా!

చరణం – 2

రాజకీయ ప్రభావములు పెరిగిన కాలమిది
ఆన్‌లైన్ మాయల మధ్య అలమటించు జనమిది
మాలాంటి సామాన్యులకు దర్శనమే దుర్లభమై
దయతో మార్గము చూపవయ్యా దివ్య వెంకటరమణా!

చరణం – 3

వయసు మీరి వచ్చిన వారికీ వేదన తెలిసినదే
చేతిలో ధనము లేనివారి గోడు వినబడునదే
నీ సేవకుల హృదయమందు సద్విచారము నింపి
సమదర్శన భావముతో సేవ చేయించవయ్యా!

చరణం – 4

అవకాశములు కలిగిన వారికి అందని వరములేవు
అవకాశము లేనివారికి దుర్భరమైన మార్గములు
ఈ వ్యత్యాసమును తొలగించి సమత్వ దీపమై వెలిగి
అందరిని ఆలింగనించు అపర కరుణాసాగరా!

ముగింపు

అంతా నీవేనని నమ్మి ఈ వినతి చెప్పుచున్నా
నా మాటలలో దోషముంటే నన్ను సరిదిద్దవయ్యా
భక్తుల హృదయ బాధలన్ని నీ పాదములకర్పించి
శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరా శరణం!

*****
.
తిరుమల

అనుభవమే అనుకరణయై
ఆదర్శమే మహాత్మీయతయై
ఆశలు ఎన్నున్నా ఆరాధ్యతయై
అస్తవ్యస్తమైన ఆధ్యాత్మిక జీవనమై
నన్ను నడిపించేది నీవే వేంకటేశ్వరా!

అమృతమని అనురాగమని
బంధమని బంధుత్వమని
బాధ్యతయని భాగ్యమని
భావభావ బంధమంతా నీదే
శ్రీ వేంకటేశ్వరా!

కథలన్నీ కనికరమై
కళలన్నీ కరుణా గమనమై
వలపులన్నీ విధి ఫలములై
వయసంతా ధర్మ జ్ఞాపకాలై
పంచభూతాలే తోడురై

మా హృదయంలో పరమాత్ముడవై
నిత్యం నిర్మల దర్శనమిస్తూ
మనసుకు మార్గమై
జీవితానికి సారమై
మాలోనే వెలుగుతున్నావా
వేంకటేశ్వరా!

అనుభవంలో నీవే
అనురాగంలో నీవే
బంధుత్వంలో నీవే
బాధ్యతలో నీవే
హృదయాంతరంలో నీవే
శ్రీనివాసా — వేంకటేశ్వరా

!భావసారం:
మన జీవితంలోని అనుభవాలు, ఆదర్శాలు, ఆశలు, బంధాలు, బాధ్యతలు—అన్నీ చివరకు భగవంతుని వైపే నడిపించే మార్గాలుగా మారాలి. కథల్లో కనికరం, కళల్లో కరుణ, వలపులో విధిఫలం, వయసులో ధర్మజ్ఞాపకం కనిపించినప్పుడు పంచభూతాలతో సహా మన హృదయంలోనే పరమాత్మ దర్శనం కలుగుతుంది. यही ఈ పద్యంలోని అంతరార్థం.
*****

తిరుమల

చీకటిలోనెవరూ చూడరని
తప్పు మీద తప్పు చేస్తూ సాగుతున్నా
అంతరాత్మ హెచ్చరిక వినక
మూర్ఖత్వముతో బ్రతుకు నడుపుతున్నా

నా వెనుక ఎవరు ఉన్నారో
నా కర్మలకు సాక్షులెవరో తెలియకున్నా
తెలిసీ తెలియనట్టుగా జీవించే
జీవులమే కదా వేంకటేశ్వరా!

సూర్యచంద్రుల సాక్షిగా
యమధర్మరాజు సాక్షిగా
కాలపురుషుని చూపులలో
నింగి, నీరు, నిప్పు, నేల, వాయువుల సాక్షిగా
మనిషి చేసే శుభాశుభ కర్మలన్నీ
నిలిచిపోవునని తెలియదా వేంకటేశ్వరా!

ఏమని చెప్పేది? ఏదని చెప్పేది?
తప్పు ఎవరిదో తేల్చలేకున్నా
ప్రకృతిదా? ప్రభువుదా?
వ్రా త రాసిన బ్రహ్మదా?
నా కర్మల ఫలమా? తెలియదయ్యా!

విధి అని తప్పించుకోనా?
ప్రకృతి అని నిందించనా?
ప్రభువు మీద భారం వేయనా?
నిజమేమిటో నీవే తెలుపవయ్యా!

తప్పును తెలుసుకునే జ్ఞానమివ్వు
తప్పిన దారిని సరిచేసే బుద్ధినివ్వు
నిజానిజాలను గ్రహించే చూపునివ్వు
నిన్ను వేడుకొనుటకే వచ్చామయ్యా
వేంకటేశ్వరా!

చీకటి వెలుగుల మధ్యనైనా
అంతరాత్మ దీపమై నీవుండవయ్యా
మా కర్మలకు మేమే బాధ్యులమని
తెలిసే జ్ఞానము ప్రసాదించవయ్యా
నమో నమో వేంకటేశాయ

!భావసారం:
ఎవరూ చూడరని అనుకున్నా మనిషి చేసే ప్రతి కర్మకు ప్రకృతి, కాలం, పంచభూతాలు, అంతరాత్మ సాక్షులే. తప్పు జరిగినప్పుడు దానిని విధిపైనో, ప్రకృతిపైనో, దేవునిపైనో నెట్టకుండా “నా కర్మకు నేనే బాధ్యుడిని” అని తెలుసుకునే జ్ఞానం కావాలని వేంకటేశ్వరుణ్ణి ప్రార్థించే తాత్త్విక గీతం ఇది.
*****

తిరుమల

పరిగెత్తే మనసు తనను తాను
ప్రశ్నించుకున్నా సమాధానము కనలేదు
కన్ను ఎందరినైనా చూడగలదు
తన కన్నును తాను చూడగలదా వేంకటేశ్వరా?

నీ హృదయంలో శ్రీదేవి భూదేవిని
చూడగలుగుతున్నాం భక్తితో
వారి హృదయాలలో దాగిన
తత్త్వభావాన్ని గ్రహించగలమా వేంకటేశ్వరా?

ఒక్కరినే తృప్తిపరచలేని మానవుణ్ణి నేను
ఇరువురినీ ఎలా తృప్తిపరుస్తున్నావయ్యా?
అయినా ఇద్దరినీ నీ హృదయంలోనే
అనురాగముతో ఉంచుకున్నావు కదయ్యా!

నా మనసు మాటను ఆలకించవయ్యా
నా లోపలున్న నిన్ను నాకు చూపవయ్యా
అందరి హృదయాలలో నీవున్నావంటే
శ్రీదేవి భూదేవి సమేతుడవైన నీవు
మాలో ఉన్నట్లే కదా వేంకటేశ్వరా!

బయట వెదికే చూపులకు
లోపల వెలిగే తత్త్వము తెలియదయ్యా
మనసును నిశ్చలపరచి చూసిన వేళ
నీవే కనిపించెదవు — నీవే వినిపించెదవు
నీవే అంతరాత్మవై నిలిచెదవు!

నమో నమో వేంకటేశాయ
నమో నమః!
శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ శ్రీనివాసాయ నమో నమః!

భావసారం:
మనిషి ప్రపంచాన్ని చూడగలడు కానీ తనను తాను పూర్తిగా తెలుసుకోలేడు. కన్ను ఇతరులను చూసినట్లే మనసు కూడా అందరినీ పరిశీలిస్తుంది; కానీ తనలోని దైవతత్త్వాన్ని గుర్తించడం కష్టం. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు వారిని తన హృదయంలో ఉంచుకున్నట్లే, ప్రతి జీవి హృదయంలోనూ అదే దైవతత్త్వం ఉన్నదనే అద్వైత భావన ఈ పద్యానికి అంతర్లీనమైన సందేశం.
*****

గణపతి నవరాత్రుల భజన పాట*
*రచన:-*
*మాడుగుల మురళీధరశర్మ*
                  ****
*(చక్కనయ్యా!చందమామ-మాదిరి)*
                    ****

*పల్లవి:-*
ఈ ఏకదంతా వేడగానే! వేగరావయ్యా!
భోగ భాగ్యములిచ్చి మమ్మూ! బ్రోవవేమయ్యా!
మా!స్వామి నీవయ్యా!!2!!

*చరణం-1*
ప్రమథ గణముల నాయకా! నిను!
ప్రస్తుతింతు వినాయకా!
విఘ్న నాశక! మాకు యెపుడూ! విఘ్నములు రానీకురా!2!
విజయ గణపతీ-విశ్వమంతా!2!
విస్తరించావా!మా!దిక్కు నీవేగా!!
*!!ఏకదంతా వేడగానే!!*

*చరణం-2*
ఘనముగా నవరాత్రి పూజల గణపతీ గైకొమ్మురా!
లోకమంతా మోకరిల్లీ!
నీకు భజనలు సేయుగా!2!
శోక వినుతా! శుభప్రదాతా !2!
శాంతి గూర్చుమురా......
ప్రశాంతి నొసగుమురా!!
*!!ఏకదంతా వేడగానే!!*

*చరణం-3*
కరుణతో *కాళేశ్వరములో*
కాంక్ష మీరగా యుంటివా!
అరుణ పుష్పములన్ని తెచ్చీ! అర్పణము గావింతురా!2!
అర్ధరహితుడా!-ఆర్తితీర్చి!2!
ఆదుకోవయ్యా ...‌‌మా!
అండనుండవయా!!
*!!ఏకదంతా వేడగానే!!*
******
ऊँ!
----
" సప్తపది..సూర్యనుతి..
--
సప్తవర్ణవారువమ్మెచలన యానమయ్యె నీకు
తప్త హాట కకిర ణాలు సుప్తివదలఁగా

తృప్తిఁదీరఁగాంచ మదికి ధృతిని చుఱుకుతనమునొసఁగు
దీప్తిబుద్ధిధైర్యభావ దృక్పథసరళిన్

ప్రాప్తధనఁపుక్షేమభాగ్యరాశిపొసగుతుష్టివరము
సుప్త లోక జీవ తతికి శోభనొసఁగుచున్

భాస్కర!కరుణించుమయ్య పాండితీవిభవమునీయ
యాస్కుఁడుమొదలైన ఋషుల యాగవిధులనన్

కశ్యపసుత! అంశుమంత! వశ్యభక్త! తీక్ష్ణతవిడు
వశ్య ఋఙ్నుతరవి! శుద్ధభావదాతృఁడా!

శాంతిదాంతి నిలయ! మాకు సౌఖ్యములను నొసఁగుమయ్య
కాంతిపుంజనికర! భువిని కావఁగోరెదన్

దండములను స్వీకరించు తపన! తాల్మితోడనీవె
అండనుండుమెపుడు నిరతయానశీలుఁడా!
----*****

కీర్తనలు

 తిరుమల 


కనీసం మూడు రోజులైనా ఉండనీ వయ్యా

తృణప్రాయమైన నా మనసు భావం వినవయ్యా

గణాలు పెరిగిన కొద్దీ గందరగోళమే తిరుమలయ్యా

ప్రాణమైన మనసులందరిలో నీ తత్వమేనయ్యా

గుణభావమెట్లున్నా దర్శన భావమే ముఖ్యమయ్యా


క్షణక్షణ మార్పులతో భక్తజన హృదయాలతో

ఓర్పులతో తనమన భేదము చూపని ప్రభువయ్యా

ఆణువణువున గోవిందా అని ఆర్తనాదమయ్యా

మునివరుల దర్శనం నాకు లేకున్నా

నీ భక్తజనుల మధ్య నిన్ను చూడగలిగేనయ్యా


వనసమూహాలలో

వన్యమృగాల మధ్యలో

లతల ఆనందాలలో

గిరి శిఖరాలపైన జనసమ్మేళనాలలో

అంతా నీదయే — మా ప్రాప్తియే

సహృదయ భావంతో నిన్నే వేడుకుంటున్నారయ్యా


అమృత హృదయంతో భక్తులను చూస్తున్నావయ్యా

నీ కరుణ చూపులు మాపై ప్రసరించవయ్యా

మా మనసుల గందరగోళమంతా తొలగించవయ్యా

నీ సన్నిధిలో మూడు రోజులైనా నిలిపి

నీ నామస్మరణలో మమ్ము ముంచవయ్యా

వేంకటేశ్వరా


!భావసారం:

తిరుమలలో జనసందోహం ఎంత పెరిగినా, భక్తుల హృదయాలలో మాత్రం వేంకటేశ్వరుడే ఉన్నాడని కవి భావిస్తున్నాడు. మునుల దర్శనం లభించకపోయినా, ప్రకృతిలోనూ, భక్తజనులలోనూ, గిరిశిఖరాలలోనూ స్వామి సాన్నిధ్యాన్ని అనుభవించాలని కోరుతున్నాడు. “కనీసం మూడు రోజులైనా నీ కొండపై ఉండి, నీ కరుణా దృష్టిలో నా మనసును నిలపాలి” అన్నదే ఈ గీతం యొక్క ప్రధాన ఆకాంక్ష.

****

తిరుమల 


నీవున్నావని నిన్నే కోరుచున్నా

నీ ఊహ ఏ తీరుగో నేనేమి ఎరుగనా

నా ఊయల బ్రతుకున నీవే మిన్నా

నన్ను నీ దారిలో నడిపించు వేంకటేశ్వరా


బావుటగా నన్నయినా ఉండమన్నా

చెవులు నిక్కబొడిచి నీ గానమే వినాలన్నా

అవునో కాదో తెలియని ప్రాణమిదన్నా

అయినా నీ పాదములే ఆశ్రయమన్నా


భావభవమేదో తెలుపగలుగుచున్నా

అవసరమెంతో నీకు చెప్పలేకున్నా

వివరణలు నీవే చెప్తావని నమ్ముకున్నా

సవరణలతో సాగిన జీవితం నాదన్నా


అవహేళనల మధ్య నలిగిపోతున్నా

నావిధ పూజలతో నిన్నే వేడుకుంటున్నా

వివిధ వంకలు ఇక వలదయ్యా

విమల హృదయముతో నన్ను దయచేయి వేంకటేశ్వరా


!భావం:

“నీవున్నావనే నమ్మకంతో నిన్నే కోరుతున్నాను. నా జీవితానికి దారి నాకు తెలియకపోయినా, నీవే నడిపిస్తావని విశ్వసిస్తున్నాను. నా జీవితంలో జరిగిన తప్పులను సరిదిద్ది, అవహేళనలు ఎదురైనా మనసు కుంగిపోకుండా, నీ పాదసేవలో నన్ను నిలబెట్టు” —

*****

తిరుమల 


నేతగ నేను నిన్ను ఎన్ను కొ నగా 

జాతిని గాంచగల్గు ఫలిత ముగా 

 గీత భవముగా చర్మము నిలుపగ 

 ఖ్యాతి గోరను నేను వేం కటేశ్వరా 


శ్వేతపత్రము నాదు భక్తిగా 

వాతలెన్నిపడినా నిన్ను నిన్నుగా 

చేత నైనసేవల భవముగా

జీతము కోరని జీవనముగా 

కతలు చెప్పుతూ నిన్ను కొల్చేద వేంకటేశ్వరా 


ఈతలంపు మది చిందులేయగా 

నీతపము తప్పు త్రోవ పడకుండగా 

సతము మనసు నదుపుగా చేర్చు వేంకటేశ్వరా 


రాత లన్ని నీదయ కరుణగా 

జతలు జతలు గా వేడుకగా 

వెతలు లేని నిత్య భజనలుగా 

పతనము కాని తనము నీదే వేంకటేశ్వరా

******


తిరుమల 


ఎన్నుకొనగ నిన్నే నాథా

జన్మఫలము నీ దయగ గాకా

గీతభావమై గుండె నిలుపగా

ఖ్యాతి కోరను వేంకటేశ్వరా!


భక్తి శ్వేతపత్రమై నిలువగా

బాధలెన్నైనా నిన్నే నమ్మగా

చేతనైన సేవలే పూజలుగా

జీతము కోరని జీవనముగా

కథలు చెప్పుచు నిన్ను కొలిచెద వేంకటేశ్వరా!


మనసులో తలపులు చిందులాడగా

తపనలన్నియు నీ దారిలో సాగగా

తప్పు త్రోవకు మనసు జారకగా

సతతము నన్ను నడిపించు వేంకటేశ్వరా!


రాతలన్నియు నీ దయగా మారగా

జతలు జతలుగా వేడుకలవగా

వెతలులేని నిత్య భజనలుగా

పతనమెరుగని పథమై నిలువగా

నా తనమంతయు నీదే వేంకటేశ్వరా!


భావసారం:

“నిన్నే ఎన్నుకున్నాను; నీ సేవే నా జీవితానికి ఫలితం. పేరు, ప్రతిష్ఠ, ప్రతిఫలం కోరను. ఎన్ని బాధలు వచ్చినా నీపై నమ్మకం విడువను. నా మనసు తప్పుదారిలో పడకుండా నడిపించి, నా జీవితంలోని ప్రతి రాతను నీ కరుణగా మార్చి, చివరకు నా జీవితం అంతా నీదిగా అర్పించుకోవాలి” —

****

తిరుమల 


పల్లవి


తత్వ గమన గమ్యము నీవే వేంకటేశ్వరా

త్యాగ భవ ఫలదాత నీవే వేంకటేశ్వరా॥


చరణం – 1


అరయుచు సృష్టి సుధర్మము

ఆచరించు జీవన సారము

చరణము పట్టిన భక్తులకు

చెలిమియు శుభములు చేకూరున్॥


తరుణము తప్పిదము జరిగినా

తలచిన నీ నామ స్మరణా

వరుసగా శుభఫల మిచ్చెడి

వాత్సల్యమూర్తివి వేంకటేశ్వరా॥


చరణం – 2


నెమ్మదినిచ్చెడి నీ దయయే

నిలిచెడి సకల విద్యయే

సమ్మతి సభభావముతో

సాగెడి సత్పథ మిదియే॥


నమ్మక హృదయ భవముతో

నిన్నే చేరిన జనులతో

రమ్మని పిలిచి రక్షించెడి

రక్షకుడవు వేంకటేశ్వరా॥


చరణం – 3


తత్వ మనసుగా నాదమువై

తరగని జ్ఞాన ప్రభామువై

వేద గమన దాహములకు

వెలుగై నిలిచెడి దేవుడవై॥


తత్వ నిజ విజయమంతయు

నీ దరి చేరుటయే సత్యము

తత్వ సమయ ఫలమిచ్చెడి

త్యాగమూర్తివి వేంకటేశ్వరా॥


ముగింపు


ధర్మము నీవే దైవము నీవే

దారియు నీవే గమ్యము నీవే

కలియుగ జనుల కాపాడువాడా

కరుణాసాగర వేంకటేశ్వరా॥


అరయుచు సృష్టి సు ధర్మము 

చరణము పట్టగ దళచితి చెలిమియు గానున్ 

తరుణము తప్పిదము జరుగ 

వరుస మది శుభము నినుగన వాంచల తీరున్ 


నెమ్మిగనుండితి నీదయ 

సమ్మక కళవిద్యలగను  సభభావముతో 

నమ్మక హృదయ భవముగా 

రమ్మున్నయెడల జనులకు రక్షణయుండున్


తత్వ మనసుగా నాదము 

తత్వ గమన గమ్యవేద దాహము తీరున్ 

తత్వ నిజ విజయము నీదరి 

తత్వ సమయము ఫలమౌను త్యాగ భవముగన్ వేంకటేశ్వరా 


భావం 


సృష్టి ధర్మాన్ని గ్రహిస్తూ, భగవంతుని చరణాలను ఆశ్రయించినవారికి సత్సంగం, స్నేహం, శుభఫలితాలు లభిస్తాయి. మానవ జీవితంలో తప్పిదాలు సహజమే అయినా, వాటిని సరిదిద్దుకుంటూ దైవమార్గంలో నడిస్తే కోరికలు సార్థకమవుతాయి.

శ్రీ వేంకటేశ్వరుని కృపతో మనసుకు ప్రశాంతత, జీవితానికి సద్విద్య, సమాజానికి సత్సభా భావన కలుగుతాయి. హృదయంలో నమ్మకాన్ని నిలుపుకొని ఆయనను ఆశ్రయించిన వారికి రక్షణ, ధైర్యం, మార్గదర్శనం లభిస్తాయి.

తత్త్వజ్ఞానం కోసం తపించే మనసుకు భగవంతుడే పరమ గమ్యం. వేదాంత సారాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక దాహం ఆయన సన్నిధిలో తీరుతుంది. నిజమైన విజయం సంపదలో కాదు, త్యాగంలోనూ ధర్మంలోనూ ఉందని బోధిస్తూ, సమయానుకూలంగా ఫలితాన్ని ప్రసాదించేది శ్రీ వేంకటేశ్వరుని కరుణే.సంక్షిప్త సందేశం:

నమ్మకం, ధర్మం, తత్త్వజ్ఞానం, త్యాగభావం కలిసినచో జీవితం సార్థకమవుతుంది; ఆ మార్గానికి శ్రీ వేంకటేశ్వరుడే రక్షకుడు, మార్గదర్శి.

****

తిరుమల 


పల్లవి


ఎందరో మహానుభావులు నిన్ను కీర్తించిరి

ఎందరో భక్తులు నీ దరి చేరిరి

ఏ దారి వచ్చినా నీ సన్నిధియే గమ్యము

వేంకటేశ్వరా! నీ దయే మా భాగ్యము॥


చరణం – 1


కాలమేదైనా కరుణ నీదయ్యా

గమ్యమేదైనా గతి నీవయ్యా

నీ దరి వచ్చిన వారిలో నేనొక నల్లపూసనయ్యా

అంతా నిన్ను నమ్మి వచ్చిన వారమయ్యా వేంకటేశ్వరా॥


చరణం – 2


కోటాను కోట్ల జన సముద్రము

కొండపై పొంగు భక్తి సంద్రము

ఆగని అన్నదాన అమృత ప్రవాహము

అలసిన హృదయాలకు ఆనంద నిలయము॥


చరణం – 3


మొక్కుల హుండీ మనసుల సమర్పణ

పరమార్థ భావాల పవిత్ర సంకల్పం

కన్నీటి ప్రార్థనల కరుణా రూపము

కలియుగ దైవమా! నీవే శరణము॥


చరణం – 4


ఆశాజనకమై ఆదరించువాడా

ఆరోగ్య దాయకుడై కాపాడువాడా

ఆపద బాంధవుడై అండగా నిలిచే

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా వేంకటేశ్వరా॥


తిరుమల 


వింటున్నామా? అంటున్నామా?

విన్న మాటను నడుస్తున్నామా?

సద్భావముతో సాగుతున్నామా?

సత్యమార్గము చేరుతున్నామా?


సముద్ర హోరు దాటిన తర్వాత

సముద్ర సౌందర్య దర్శనమయ్యే,

జన సముద్రము దాటిన తర్వాత

శ్రీనివాసుని కరుణ లభించే.


దగ్గరగా నిలిచినంత మాత్రాన

దైవసన్నిధి దక్కదయ్యా,

హృదయములో భక్తి నిండితే

పరమపదమే చేరునయ్యా.


మిణుగురు పురుగులవలె జనుల కాంతులు,

గగనసీమ వెన్నెలలవలె వెలుగు కాంతులు,

దేవదేవుని బంగారు గోపుర కాంతులు,

భక్తబృంద విన్యాస దివ్య శోభలు,

వెలుగుల నడుమ దివ్య దర్శనమిచ్చే

వేంకటేశ్వరా! నీ మహిమే అద్భుతము.


భావం 

మనము వినేది, చెప్పేది, ఆచరించేది ఒకటేనా అని ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. సద్భావనతో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత. సముద్రాన్ని చూడాలంటే ముందుగా దాని అలల హోరును దాటాలి; అలాగే తిరుమలలో పరమాత్మ దర్శనం పొందాలంటే ముందుగా భక్తజన సముద్రాన్ని చూడాలి. ఆ జనసందోహం కూడా పరమాత్ముని లీలలో భాగమే. భగవంతునికి దగ్గరగా ఉండటం అంటే కేవలం శారీరక సమీపం కాదు; ఆయన తత్త్వాన్ని గ్రహించి, భక్తి మార్గంలో నడిచి, పరమపదానికి అర్హత పొందడమే అసలు అర్థం.

జనసందోహం, విద్యుద్దీపాల కాంతులు, వెన్నెల వెలుగులు, బంగారు గోపుర శోభ—all కలసి తిరుమలలో ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ వెలుగులన్నిటి మధ్య భక్తునికి లభించే వేంకటేశ్వర దర్శనమే పరమానందం.

*****

తిరుమల 


పాప పుణ్యములు తెలియవు

మంచి చెడుల తేడా తెలియవు

సుఖదుఃఖములెన్నో తెలిసిన నన్ను అంటవు

ఏమని చెప్పేది? ఏదని చెప్పేది?

తప్పొప్పుల జీవన తీరు నీకే తెలుసు వేంకటేశ్వరా॥


తప్పుకీ అవమానానికీ తేడా తెలియదు

స్వార్థ నిస్వార్థముల సారము గ్రహించలేను

లోకపు మాటలన్నీ లోతుగా కొలవలేను

నా మనసు తెలిసినవాడవు నీవే వేంకటేశ్వరా॥


గడ్డిపోచంత విలువైనా గర్వించలేను

రాజ్యమేలు పెద్ద పనులైనా చేయలేను

నాకున్న చిన్న చేతులతో నావంతు చేస్తున్నాను

ప్రేమతోనే నా వంతు సేవను అర్పిస్తున్నాను

అది చాలునని దయచేసి ఆదరించు వేంకటేశ్వరా॥


మూర్ఖుడని ఎవరన్నా మౌనమే నా జవాబు

తప్పుడని ఎవరన్నా సహనమే నా బలము

మనసులోని మాటలన్నీ నీ ముందే చెప్పుకొందును

మౌనమనే ఆయుధమున ఆత్మగా నీవే దిక్కు వేంకటేశ్వరా॥


నేను చేసిన తప్పులెన్నో నీవే ఎరుగుదువు

నేను దాచిన కన్నీటిని నీవే చూచితివి

లోకమంత తీర్పిచ్చినా నీ తీర్పే నాకు చాలు

నా అంతరాత్మకు ఆధారమై నిలిచేది నీవే వేంకటేశ్వరా॥


పాపమో పుణ్యమో నాకు తెలియకపోయినా

మంచిదో చెడ్డదో పూర్తిగా తెలియకపోయినా

నీ నామమొక్కటే నిత్యము నమ్మి నడచెదను

నీ పాదసేవలోనే నా జీవితం అర్పించెదను

నన్ను నడిపించు దయామయా శ్రీ వేంకటేశ్వరా॥

*****

కీర్తనలు

 తిరుమల 


పాప పుణ్యములు తెలియవు

మంచి చెడుల తేడా తెలియవు

సుఖదుఃఖములెన్నో తెలిసిన నన్ను అంటవు

ఏమని చెప్పేది? ఏదని చెప్పేది?

తప్పొప్పుల జీవన తీరు నీకే తెలుసు వేంకటేశ్వరా॥


తప్పుకీ అవమానానికీ తేడా తెలియదు

స్వార్థ నిస్వార్థముల సారము గ్రహించలేను

లోకపు మాటలన్నీ లోతుగా కొలవలేను

నా మనసు తెలిసినవాడవు నీవే వేంకటేశ్వరా॥


గడ్డిపోచంత విలువైనా గర్వించలేను

రాజ్యమేలు పెద్ద పనులైనా చేయలేను

నాకున్న చిన్న చేతులతో నావంతు చేస్తున్నాను

ప్రేమతోనే నా వంతు సేవను అర్పిస్తున్నాను

అది చాలునని దయచేసి ఆదరించు వేంకటేశ్వరా॥


మూర్ఖుడని ఎవరన్నా మౌనమే నా జవాబు

తప్పుడని ఎవరన్నా సహనమే నా బలము

మనసులోని మాటలన్నీ నీ ముందే చెప్పుకొందును

మౌనమనే ఆయుధమున ఆత్మగా నీవే దిక్కు వేంకటేశ్వరా॥


నేను చేసిన తప్పులెన్నో నీవే ఎరుగుదువు

నేను దాచిన కన్నీటిని నీవే చూచితివి

లోకమంత తీర్పిచ్చినా నీ తీర్పే నాకు చాలు

నా అంతరాత్మకు ఆధారమై నిలిచేది నీవే వేంకటేశ్వరా॥


పాపమో పుణ్యమో నాకు తెలియకపోయినా

మంచిదో చెడ్డదో పూర్తిగా తెలియకపోయినా

నీ నామమొక్కటే నిత్యము నమ్మి నడచెదను

నీ పాదసేవలోనే నా జీవితం అర్పించెదను

నన్ను నడిపించు దయామయా శ్రీ వేంకటేశ్వరా॥


నేను నీవాడను – నీవు నా వాడవు” 

అనే శరణాగతి 


నేను నీవాడను నిన్ను వీడను

నీవు నా వాడవు నన్ను వీడకు

నేను నీవే నీవు నాలో ఉన్నావులే

అక్షరంబుగా నా మదిలో నీవే వేంకటేశ్వరా॥


ఎవరో మోసం చేశారని నిన్నేమనను

అవమానించారని ఏమాత్రం విచారించను

ఎవరో వదిలేశారని నిన్ను వదలను

జీవన రాగము తారుమారైన నీవే దిక్కు వేంకటేశ్వరా॥


నా భవిష్యత్తు అంతా నీదయ్యా

వర్తమానమందు నీ ఇష్టముగా నడిపించవయ్యా

అర్థము పరమార్థము అంతా నీదయ్యా

సర్వార్థకామ్యతా భావము నీదే వేంకటేశ్వరా॥


ఎన్ని సార్లు చెప్పినా నా మది ఇంతేనయ్యా

మనుషులను మార్చుట నీ దయ మూలమయ్యా

కాలజ్ఞాన కర్మల తీరు అంతా నీదయ్యా

కారణ జన్మలకు కర్తవు నీవే వేంకటేశ్వరా॥


కష్టసుఖములన్ని కలగలసి వచ్చునయ్యా

ఇష్టానిష్టములు విధి వెంట నడచునయ్యా

నిష్ఠతో నీ నామము జపించుచుండగా

దుష్ట చింతలన్ని తొలగింపవే వేంకటేశ్వరా॥


శాంతియే మా సంపదగా చేకూర్చవయ్యా

సహనమే మా జీవితమున సారమవ్వయ్యా

భక్తి మార్గమున నడిపించు దయాసాగరా

మాకు దేవుడవు నీవే శ్రీ వేంకటేశ్వరా॥

*****

శరణాగతి–వేదన–భక్తి  గేయరూపం

తిరుమల 


అలల తీరు కోపమొచ్చి తగ్గునయ్యా

కలల తీరు జీవనమున మలుపునయ్యా

వలకు చిక్కి విధి వ్రాతను గెలువలేక

తలపు తెలుపు మది మాయలు నీవే వేంకటేశ్వరా॥


పల్లవి

ఏడుకొండలందు వెలసిన వేంకటేశా! నీవే దిక్కు

వీడనెపుడు నీ స్మరణమే నాకు హక్కు

మాడమాడలందు తిరుగు మాధవా! నీవే దక్కు

వీడనయ్య నీ పదమే తోడుగోరు వేంకటేశ్వరా॥


ఈడు జరుగుచున్న కోర్కెలెన్నో పెరుగుచుండె

ఏమి కటకట బ్రతుకిది వేంకటేశ్వరా

నేడు భారమై నియతి నన్ను నెట్టుచుండె

ఏలుకొమ్ము దయతోడ వేంకటేశ్వరా॥


ఆడి తప్ప మతికి మరి గతియేదీ లేదయ్యా

ఏడు జన్మలైన నీడ నీవే దేవా

ఏమియో కథలైన ఎడబాటు దారులైన

ఏలుకొమ్ము నిరతము వేంకటేశ్వరా॥


దాడి చేయు వేదనలే ముసిరె నా మనసున

వాడిపోయె ఆశలన్ని వానలేని చేనులా

ఊడిగములు చేసెదనయ్య యోగదేశికా

ఆడుకొనుము నన్ను నీవు వేంకటేశ్వరా॥


నాది యేమి లేదని నమ్మి వచ్చితిని

నీది యంతయని భావించి నిలిచితిని

చేదు తీపి ఫలితములు నీకే అర్పితిని

నీ చరణములే శరణు వేంకటేశ్వరా॥


కన్నీటి పూజలతో కడగుచున్న హృదయము

పున్నమి వెలుగువంటి కరుణ కోరుచున్నది

అన్నివేళలా నన్ను ఆదుకొనుము స్వామీ

అంతరంగ నివాస వేంకటేశ్వరాయి

*****

 కాలతత్త్వం, శరణాగతి భావం


తిరుమల 


దుఃఖము లేని లోకమేది

సుఖము గాంచని విలువయేది

నఖశిఖ పర్యంత రోగరహిత దేహమేది

ఆనందామృతమందించే శ్రీ వేంకటేశ్వరా॥


ఏది నాదనెడి భావములేని వాడ్ని

నమ్మకమ్ముతో నడిచే దీనుడ్ని

యుగయుగములు నిన్నే తలచే వాడ్ని

కనులతో సత్యము గనలేని వాడ్ని

కాలధర్మములో మంచి తెలియని వాడ్ని

బ్రతుకునందు నీ బానిసను వేంకటేశ్వరా॥


ఉదయ సాయంత్రము రాత్రియై

ఆయుష్యమును హరించు కాలమై

సూర్యచంద్ర స్వరూపుడవు నీవే

నిన్ను తలచిన క్షణమే నిజమైన ఆయుష్యే

నన్ను నేనుగా అర్పించుటే నా ఆయుష్యే

దేహము భగవత్సేవకై దయచేయు వేంకటేశ్వరా॥


కష్టసుఖముల కలబోతలో

కరుణ చూపే కల్పవృక్షమా

జననమరణ మార్గమందు

జగతి దాటించు దయాసాగరా

నీ నామమే నా శ్వాసగాను

నీ పాదమే శరణు వేంకటేశ్వరా॥॥

 శ్రీ వేంకటేశాయ నమః ॥


భావసారం:


దుఃఖం లేని జీవితం లేదని, సుఖం విలువ కూడా కష్టాల ద్వారా తెలుస్తుందని కవి గ్రహిస్తున్నాడు. శరీరం రోగరహితం కాదని, నిజమైన ఆనందామృతాన్ని ప్రసాదించగలవాడు శ్రీ వేంకటేశ్వరుడే అని ప్రార్థిస్తున్నాడు.


తనకు స్వంతమని చెప్పుకునే దేదీ లేదని, నమ్మకంతో జీవిస్తూ నిత్యం భగవంతుని తలచేవాడినని చెబుతున్నాడు. అయినప్పటికీ సత్యాన్నిk సంపూర్ణంగా గ్రహించలేక, కాలధర్మంలో మంచి–చెడులను తెలుసుకోలేని సాధారణ మానవుడినని అంగీకరిస్తూ, తాను వేంకటేశ్వరుని దాసుడినని శరణాగతి వ్యక్తం చేస్తున్నాడు.


ఉదయం, సాయంత్రం, రాత్రి అనే కాలచక్రం ద్వారా ఆయుష్షును హరించే సూర్యచంద్రుల రూపమూ నీవేనని, అయితే నిన్ను స్మరించే క్షణాలే నిజమైన ఆయుష్షని భావిస్తున్నాడు. తన జీవితం, శరీరం, శ్వాస అన్నిటినీ భగవత్సేవకే అంకితం చేస్తూ, దేహమే సేవాసాధనమని వేంకటేశ్వరుని సన్నిధిలో సమర్పిస్తున్నాడు.

****

తిరుమల 


పల్లవి


విద్య నేర్పు గురువు నీవు

వేల్పు కన్న ఘనుడవైనావు

ముద్దు చేసి చెప్పిన మొదటి పదము నీవుయే

సిరులు తాండవించ లేని తనము దేవా

కోటి దండాలు గురువని పూజించినాను

వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...


చరణం – 1


చిక్కులెదురైనా చింతపడక నిన్ను చేరా

చిత్తబలిమితో చిక్కులన్నీ చింత వీడా

కలుగు శాంతి జీవి కనుచు కర్మ తీరా

మాటల చెలిమితో చెప్పెదా మనసు

వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...


చరణం – 2


పద్యం నేర్పు గురువు నీవయ్యా

గద్య భావమది విషయము చెప్పగలనయ్యా

మిథ్యా బ్రతుకుగా నేను ఉన్నా నిన్ను వేడుచున్నా

ఎవ్వరి కంటనీరు రానీయక కాపాడవయ్యా

వేంకటేశ్వరా... వేంకటేశ్వరా...


ముగింపు

తప్పులు ఎన్నున్నా తండ్రివై క్షమించవయ్యా

తడబడే అడుగులకు దారివై నిలువవయ్యా

నీ చరణ సేవలో నా జన్మ సార్థకమయ్యేలా

కరుణ చూపవయ్యా శ్రీ వేంకటేశ్వరా!

****+

శీర్షిక:

“కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా”


తిరుమల 


జ్ఞానము విజ్ఞానము తెలియనివాడ్ని 

ధ్యానము తీరు బ్రతికేవాడ్ని 

ధర్మంమ్ముకొరకు నిలిచేవాడ్ని 

సత్య వాక్కుగా బ్రతకాలనీ నీ కారణా కటాక్షాలకు ఈ జన్మ చాలు వేంకటేశ్వరా 


పొగ నడుమ వేడిది అగుచు 

ధగధగ రుపు వేంకటేశ్వరుని తిరుమల స్వర్గమనుచు 

ఆశక్తే సర్వలోకాల రక్షణ యనుచు 

మ్రాక్కిన వారికి మొక్కులు దీర్చ శ్రీ వేంకటేశ్వరా 


సత్య ధామమని యండ్రు 

పరమహోమమనిచుండ్రు 

ప్రకృతి ప్రశాంత ధామ మండ్రు 

వేదమంత్ర శక్తియున్న వాసమండ్రు 

మంత్రపుష్ప మూల ఆర్య అండ్రు 

కాలతీరు జన రక్షగా నడ్రు 

కపటములేని మనసు నుంచు వేంకటేశ్వరా 


శుబ్రతల మధ్య సిద్ధిని కోరె దా 

యోగిని కాను నిరతము భక్తి చేరెదా 

యత్నము మాత్రమే అంతా నీదయ తీరుగా 

ఈశరీరం నీసృష్టి నీఇష్ట ప్రకారమే వేంకటేశ్వరా 


భావసారం – తిరుమల (06)


ఈ గేయంలో భక్తుని వినయం, ధర్మనిష్ఠ, సత్యజీవనం, తిరుమల మహిమ, సంపూర్ణ శరణాగతి ఎంతో హృద్యంగా ప్రతిఫలించాయి.

భక్తుడు తనను తాను జ్ఞానవంతుడనిగానీ, విజ్ఞానసంపన్నుడనిగానీ భావించడు. ధ్యానం ఎంతగా వచ్చునో అంతగా జీవిస్తూ, ధర్మం కోసం నిలబడే సాధారణ భక్తుడినని చెబుతున్నాడు. సత్యవాక్కుతో జీవించాలని కోరుకుంటూ, వేంకటేశ్వరుని కరుణాకటాక్షాలే తన జీవితానికి పరమసంపద అని భావిస్తున్నాడు.

తిరుమల కొండలను భక్తుడు స్వర్గసీమగా దర్శిస్తున్నాడు. పొగమంచు మధ్య ప్రకాశించే శ్రీ వేంకటేశ్వరుని మహిమను స్మరిస్తూ, సమస్త లోకాల రక్షణకై నిలిచిన దివ్యశక్తిగా వర్ణిస్తున్నాడు. భక్తితో మొక్కిన వారి కోరికలను తీర్చే దయామయుడని కీర్తిస్తున్నాడు.

తిరుమల సత్యధామం, యజ్ఞహోమ ఫలభూమి, ప్రకృతి ప్రశాంత నిలయం, వేదమంత్రాల శక్తి నిండిన పుణ్యక్షేత్రమని భావిస్తున్నాడు. మంత్రపుష్పాల సుగంధం, వేదఘోషల పవిత్రత, జనరక్షణ కోసం నిలిచిన దైవకృప అక్కడ సాక్షాత్కారమవుతుందని చెబుతున్నాడు. అందుకే తనకు కపటరహితమైన మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాడు.

చివరగా, తాను యోగి కానప్పటికీ భక్తిమార్గంలో నడవాలనుకుంటున్నాడు. తన ప్రయత్నం మాత్రమే తనదని, ఫలితమంతా స్వామి కృపేనని అంగీకరిస్తున్నాడు. ఈ శరీరం కూడా భగవంతుని సృష్టే కాబట్టి, తన జీవితం అంతా ఆయన సంకల్పానుసారమే సాగాలని సంపూర్ణ శరణాగతితో ప్రార్థిస్తున్నాడు.

****